Monday 1 January 2024

వెంకటేశ్వరస్వామి-తొండమాన్ చక్రవర్తి (02-Jan-24, Enlightenment Story)


 🙏వెంకటేశ్వరస్వామి-తొండమాన్ చక్రవర్తి🙏

*🙏\|/⚜🌹⚜🛕\|/🛕⚜🌹⚜\|/🙏

🛕🙏పూర్వం తిరుమలలో “తొండమాన్ చక్రవర్తి” అనే భక్తుడు స్వామి వారికి రోజూ బంగారు తులసి దళాలు సమర్పించేవాడు. అప్పట్లో స్వామి వారు భక్తులతో మాట్లాడుతూ ఉండేవారు కూడా. ఈ తొండమాన్ చక్రవర్తి రోజూ స్వామి వారి దగ్గరికి వెళ్లి చెబుతూ ఉండేవాడుట .

🛕🙏“స్వామి నేను మీకు రోజూ బంగారు తులసీదళాలతో పూజ చేస్తున్నాను. పైగా, నాకంటే పెద్ద భక్తుడు మీకు ఎవరున్నారు స్వామి?” అన్నాడుట.

🛕🙏స్వామి తొండమానుడుకి ఒక పాఠం చెప్పాలని, నాకు ప్రియమైన భక్తుడ ఈ ప్రాంతానికి దగ్గ లోనే భీముడు అని ఒక కుమ్మరివాడు ఉంటాడు. వాడిని వెళ్లి చూడు అన్నారుట.. మరుసటి రోజు వెళదాం అని అనుకుని,చక్రవర్తి స్వామి వారి పాదాల క్రింద ఉన్న తులసి దళాలని శుభ్రం చేస్తున్నాడు. అప్పుడు, తను చేయించిన బంగారు తులసి దళాల క్రింద, మట్టి తులసిదళాలు కనిపించాయి.

🛕🙏అప్పుడు స్వామి వారు చెప్పారు ఈ మట్టి దళాలు, ఆ భీముడే సమర్పించాడు నాకు అని. అప్పుడా చక్రవర్తి మనసులో అనుకున్నాడు, మట్టి తులసి దళాలు స్వామికి నచ్చాయా, వీడు ఎవరో కాని వెంటనే వెళ్లి కలవాలని బయలుదేరాడు.ఆ రోజు చాల ఎండగా ఉంది, అప్పటికే నడిచి నడిచి, భీముడి ఇంటి దగ్గరలో స్పృహ తప్పి పడిపోయాడు చక్రవర్తి…అప్పుడు ఆ భీముడే, తొండమాన్ చక్రవర్తిని లేవదీసి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. తొండమాన్ చక్రవర్తి అడిగాడుట, “ఒరేయ్ నువ్వు ఏమి చేస్తూ ఉంటావు? వేంకటేశ్వర స్వామి వారికి నువ్వంటే చాల ఇష్టం కదా” అని.

🛕🙏భీముడు అన్నాడు, నేనేం చేస్తాను స్వామి, కుండ చేసేముందు వెంకటేశ్వరా నన్ను అనుగ్రహించావు.
కుండలు చేసుకునే శక్తి ని ఇచ్చావు.అవి అమ్మితే నాలుగు రూపాయలు వచ్చేట్టు చేసావు. వాటి వల్ల నా సంసారం సాగుతోంది.నీకు కృతజ్ఞతగా ఒక మట్టి తులసి దళం చేసి నీ పాదాల యందు ఉంచుతాను అని అక్కడే ఉన్న కొయ్యతో చేయబడిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూర్తికి సమర్పించేవాడిని. ఏ పని మొదలుపెట్టినా “గోవింద” నేను చేయడమేమిటి? నీవే నాతో చేయించు కుంటున్నావు స్వామి” అనేవాడిని అని చెప్పాడు.

🛕🙏అప్పుడు తొండమాన్ చక్రవర్తి అనుకున్నారుట, వీడేమో  అంతా స్వామి వారే చేయిస్తున్నారు అని అనుకుంటున్నాడు,నేనేమో  నేను చేస్తున్నాను అని సమర్పిస్తున్నాను.అని తనతప్పు తెలుసుకొని తిరిగి వెళ్ళాడు.

🛕🙏ఇదే మనమందరము చేసే పెద్ద తప్పిదం భీముడు అన్నం తినే ముందు మట్టితో చిన్న మూకుడు చేసి, అందులో అన్నం ముద్ద పెట్టి, స్వామి వారికి సమర్పించి తను తినేవాడు.స్వామి వారు భీముడి భక్తికి పొంగిపోయి శ్రీదేవి, భూదేవి సహితుడై, దివ్య విమానంలోంచి దిగి, భీముడి పాక ముందు ప్రత్యక్ష మయ్యారు. వెంటనే స్వామి వారు భీముడిని కౌగలించుకుని, భీముడు తన మీద చూపించే భక్తికి పొంగిపోయి, తన ఒంటి మీద ఉన్న ఆభరణాలన్ని భీముడి మెడలో వేసారు. అలాగే శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు,వారి ఆభరణాలన్ని భీముడి భార్యకి తొడిగారు. స్వామి వారు గరుత్మంతుడిని పిలిచి ఈ జీవుడిని తన భార్యను సశరీరంగా, వైకుంఠానికి తీసుకువెళ్ళమని ఆదేశించారు.

🛕🙏అందుకే ఇప్పటికీ స్వామివారి ఆనంద నిలయంలో మొదటి గడప దాటి పెట్టే నైవేద్యం కుండతో చేసిన పెరుగు అన్నం. ప్రతి రోజూ ఒక కొత్త కుండ చేసి అందులోనే నైవేద్యం పెడతారు. అదొక్కటే తింటారు స్వామి వారు.

 *🌹సారాంశం🌹
*****************
ఎక్కడ భక్తి ఉందో అక్కడ వశుడై పోతాడు స్వామిఎక్కడ భక్తి ఉందో అక్కడ వశుడై పోతాడు స్వామి. ఎక్కడ గర్వం/అహంకారం ఉన్నాయో అక్కడ ఆయన ఉండరు..🛕🙏



🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...