Sunday 28 April 2024

ఎగ దీస్తే బ్రహ్మ హత్య - దిగ దీస్తే గో హత్య అనే మాట ఎలా వచ్చింది? (29-Apr-24, Enlightenment Story)

 ఎగ దీస్తే బ్రహ్మ హత్య - దిగ దీస్తే గో హత్య అనే మాట ఎలా వచ్చింది?    

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🌺🍀🌺🍀🌺🌺🍀🌺🌺🍀🌺🍀🌺🌺🍀🌺                     

పూర్వం, ఒక రాజ్యం లో  సర్వ  సైన్యాధ్యక్షుడు  హటాత్తుగా మరణించాడు. కొత్త  సైన్యాధ్యక్షుని కోసం వచ్చినవారికి రాజు రక రకాల పరీక్షలు నిర్వహిస్తున్నాడు. విషయం తెలిసిన శత్రు రాజు తన సైన్యంతో  ఆ రాజ్యం పై దండయాత్రకు బయలుదేరాడు. రాజుకి ఈ విషయం తెలిసి ఏమి చేయాలో అర్ధం కాలేదు. రాజ్యాన్ని ఈ సమయం లో ఎలా రక్షించాలి అని రాజుగారు మధన పడుతున్నాడు.


అప్పుడు సుమారు 100 మంది బ్రాహ్మణులు వచ్చి, మహారాజా, మమ్మలిని యుద్దానికి వెళ్లేందుకు అనుమతించండి అని అన్నారు. అప్పుడు మహారాజు గారు, ఓ పండి తోత్తములారా, మీరు వేదాలు చదవ గలరు, కానీ యుద్ధం ఎలా చేయగలరు అని ప్రశ్నించాడు.

మహారాజా, మా శక్తిని శంకించకండి, యుద్దానికి వెళ్లడమే కాదు,  రాజ్యాన్ని రక్షిస్తాం అన్నారు పండితులు. అప్పుడు రాజుగారు మంత్రి వంక చూసాడు. అప్పుడు మంత్రి, మహారాజా, వేదాలలో యుద్ధ విద్యల గురించి కూడా ఉంటుంది, కాబట్టి వాళ్లకి యుద్ధం గురించి తెలుసు, శంకించకుండా, వారిని యుద్ధనికి అనుమతించండి అని సలహా ఇచ్చాడు.

రాజుగారు అంగీకరించి, సరే, మీకు కావలసిన సైన్యాన్ని, గుర్రాలను, ఇంకా మీకు కావలసిన బలగం మీ వెంట తీసుకెళ్లండి అన్నాడు. అప్పుడు పండితులు, అవేమి అవసరం లేదు మహారాజా, మేము ఎంత మంది ఉన్నామో, అన్ని గోవులను మా వెంట పంపండి అన్నారు.

వారి మాటలకు రాజుగారు మొదట అగ్రహించినా, వెంటనే తమాయించుకుని, ఓ పండితోత్తములారా, ఈ కష్ట సమయంలో మీకు పరిహాసం తగునా అన్నారు.  గుర్రాలుకి అయితే యుద్ధం తెలుసు, కాని గోవులు ఎలా శత్రువుల దాడి నుండి  తప్పించుకోగలవు అన్నారు రాజుగారు.

సందేహించకండి మహారాజా, మీకా భయం అక్కర్లేదు అన్నారు పండితులు. వారి అంతరంగం అర్ధం కాని రాజు గారు మరల మంత్రిని సంప్రదించాడు. మంత్రి కూడా ఏమి చెప్పలేక పోయాడు. అప్పుడు ఆస్థాన విదూషకుడు, మహారాజా, అన్నిటికంటే విధి బలీయమైంది, ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. మరో ఆలోచన లేకుండా వారు అడిగిన గోవుల్ని వారి వెంట పంపండి అన్నాడు. అతడు అవటానికి విదూషకుడు అయినా, అతని సలహా పాటించి రాజుగారు 100 గోవుల్ని ఆ పండితుల వెంట పంపించాడు.

అప్పుడు బ్రాహ్మణులు ఆ గోవుల్ని తీసుకుని యుద్ధ రంగానికి చేరారు. శత్రు సైనికులు ఒక్కొక్క బ్రాహ్మణుని వద్దకు వచ్చి, కత్తి ఎత్తబోయి, ఆమ్మో బ్రాహ్మణుని చంపితే బ్రహ్మ హత్య పాతకం చుట్టుకుంటుంది అనుకుని, కిందికి చూసారు, గోవు ఉంది. గోవుని చంపితే గోహత్య పాతకం అనుకుని, వారి సైన్యాధ్యక్షునికి పరిస్థితి వివరించారు.

అపుడు శత్రు  సైన్యాధ్యక్షుడు, అవును ఎగ దీస్తే బ్రహ్మ హత్య, దిగ దీస్తే గోహత్య అనుకుని, తన సైన్యాన్ని వెనక్కి మళ్ళించాడుఆలా ఈ సామెత వచ్చింది.


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Friday 26 April 2024

అమ్మానాన్నలు - స్మార్ట్ ఫోన్ (27-Apr-24, Enlightenment Story)

అమ్మానాన్నలు - స్మార్ట్ ఫోన్

🌺🍀🌺🍀🌺🌺🍀🌺

రాత్రి భోజనాల తర్వాత ఒక టీచర్ ఆమె విద్యార్థులు రాసిన వ్యాసరచన పేపర్లను దిద్దడం ప్రారంభించింది. ఆమె పిల్లలు పడుకున్నారు. భర్త కుర్చీలో కూర్చొని తన స్మార్ట్ ఫోన్లో 'క్యాండీ క్రష్'లో లీనమైయున్నాడు. 

చివరి పేపర్ దిద్దాడానికి తీసి చదివిన ఆ టీచర్ నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపు వెక్కిళ్ళ శబ్దానికి భర్త తలతిప్పి చూసి ఆశ్చర్యపోయాడు.

ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది?" అడిగాడతను టెన్షన్తో. నిన్న నా సెకండ్ క్లాస్ విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చాను. "మీరు ఏం కావాలనుకుంటున్నారు" అనే అంశంపై ఏదైనా రాసుకుని రమ్మని. అయితే? ఇదిగో! 
ఈ చివరి పేపర్ దిద్దుదామని చదువుతుంటే ఏడుపును ఆపుకోవడం నా తరం కావడంలేదు."

భర్త ఆసక్తిగా "అంత ఏడిపించే విధంగా ఏం రాశాడు?"హెడ్డింగ్ ఇలా పెట్టాడునేనుస్మార్ట్ ఫోన్ అవ్వాలని నా కోరిక.

అమ్మానాన్నలు స్మార్ట్ ఫోన్ ను చాలా ప్రేమిస్తారు. వాళ్ళు స్మార్ట్ ఫోనును చాలా కేర్ గా, శ్రద్ధగా, ఇష్టంగా చూసుకుంటారు. నాకన్నా ఎక్కువగా. నాన్న ఆఫీసు నుండి అలసటతో వచ్చినప్పుడు, అతనికి స్మార్ట్ ఫోన్ రిలాక్స్ ను ఇస్తుంది. నాన్నకి స్మార్ట్ ఫోన్ కోసం సమయముంది. కానీ, నా కోసం లేదు. ఎందుకంటే నాతో ఆడుకోవడం మా నాన్నకు రిలాక్స్ ను ఇవ్వడంలేదు.

అమ్మానాన్నలు ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ రింగౌతుంటే ఒకటి రెండు రింగులు వచ్చేలోపే వాళ్ళు ఫోన్ చేతిలోకి తీసుకుని జవాబిస్తారు. కానీ నేను ఎన్నిసార్లు పిలిచినా దానికిచ్చే ప్రిఫరెన్స్ నాకివ్వరు. నేను ఏడుస్తూ వుంటే కూడా వాళ్ళు నాతో కాకుండా స్మార్ట్ ఫోన్లతో గడుపుతుంటారు. వాళ్ళు నాతో కన్నా స్మార్ట్ ఫోన్లతో ఆడుకోవడానికే ఎక్కువ ఇష్టపడుతారు. వాళ్ళు తమ స్మార్ట్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పినా వినిపించుకోరు. అది నాకు ముఖ్యమైన విషయమైనా సరే, అదే ఒకవేళ నాతో  మాట్లాడుతున్నప్పుడు రింగ్ వస్తే మాత్రం వెంటనే ఫోన్ కి జవాబిస్తారు. 

అమ్మానాన్నలు స్మార్ట్ ఫోన్ని కేర్ గా చూసుకుంటారు. ఎప్పుడూ తనతోనే ఉంచుకుంటారు. దానికి చాలా ప్రాధాన్యతనిస్తారు. దాన్ని చాలా ఇష్టపడుతారు. దానితో రిలాక్స్ అవుతుంటారు. దానికి తమ ఖాళీ సమయాన్ని కేటాయిస్తారు. దానిని ఎపుడు పనివాళ్ళకి అప్పగించరు. 

నేను ఒకరోజు మాట్లాడకపోయినా బాధపడరు కానీ స్మార్ట్ ఫోన్ ఒక్కగంట పనిచేయకపోతే చాలా కంగారుపడతారు. హడావిడి చేస్తారు. రాత్రి పడుకున్నప్పుడు కూడా ప్రక్కనే ఉంచుకుంటారు. ఉదయం లేవగానే దాన్నే  చేతిలోకి తీసుకుంటారు. కాబట్టి! నా కోరిక ఏమిటంటే నేను అమ్మా నాన్న  చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నాను.
భార్య చదువుతుంటే విన్న  భర్తకు మనసంతా పిండేసినట్లైంది. అతని కళ్ళలో కూడా కొంచెం తడి వస్తుండగా
"ఎవరు రాశారది? " అడిగాడు భార్యని.

"మన కొడుకు"* అంది భార్య కన్నీరు కారుతుండగా. 

వస్తువులను ఉపయోగించుకోవాలి.బంధాలను ప్రేమించాలి. అన్ని బంధాలకన్నా ఎక్కువగా వస్తువులపై బంధాన్ని ఏర్పరచుకుని ప్రేమించడం మొదలుపెడుతూవుంటే క్రమంగా అసలైన బంధాలు వెనక్కి నెట్టివేయబడతాయి.

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Thursday 25 April 2024

మౌనం మూడు రకాలు - మౌనం అనేది భగవంతుని భాష (26-Apr-24, Enlightenment Story)

మౌనం మూడు రకాలు - మౌనం అనేది భగవంతుని భాష 

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🌺🍀🌺

వాక్కును నియంత్రించడమే మౌనం. ఇదొక అద్భుతమైన తపస్సు. మాటలను వృథాగా వినియోగించకుండా అవసరం మేరకే వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురనీతి వివరిస్తోంది. అయిదు విధాల ‘శాంతి’ లలో మౌనం ముఖ్యమైనదిగా చెబుతారు.

మాట వెండి, మౌనం బంగారం’ అని సామెత.*‘మాట్లాడటం ద్వారా శక్తిని వృధా చేసుకునేకంటే మౌనంగా ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు’* అన్నారు స్వామి వివేకానంద._

మౌనం మూడు రకాలు


1. ఒకటవది: వాక్‌మౌనం - వాక్కును నిరోధించడమే వాక్‌మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు. ఇలాంటి మౌనం వల్ల పరుష వచనాలు పలకడం, అబద్ధాలాడటం, ఇతరులపై చాడీలు చెప్పడం, అసందర్భ ప్రలాపాలు అనే నాలుగు వాగ్దోషాలు హరిస్తాయి.

2. రెండోది: అక్షమౌనం అంటే ఇంద్రియాలను నిగ్రహించడం.

3. మూడోది: కాష్ఠమౌనం దీనినే ‘మానసిక మౌనం’ అంటారు. మౌనధారణలోనూ మనసు అనేక మార్గాల్లో పయనిస్తుంది. దాన్నీ అరికట్టినప్పుడే కాష్ఠమౌనం సాధ్యపడుతుంది.



మౌనం ఆరోగ్య వృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల దివ్యశక్తి ఆవిర్భవిస్తుంది. బాహ్య, అంతర సౌందర్యాలను పెంచుతుంది. మనోశక్తులు వికసిస్తాయి. ఎదుటివారిలో  పరివర్తన తెస్తుంది. ఆధ్యాత్మిక శక్తి ఉత్పన్నమై ఆత్మకు శాంతి లభిస్తుంది. సమయం సద్వినియోగ మవుతుంది. పతంజలి మహర్షి తన యోగ సిద్ధాంతంలో మౌనానికి ప్రాధాన్యమిచ్చారు.

మౌనాన్ని అవలంబించిన మహాత్ముల్లో కంచి పరమాచార్య, రమణ మహర్షి, శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వంటి వారెందరో ఉన్నారు. ధ్యానానికి మౌనమే పునాది. బహిర్గతంగానే కాదు, అంతర్గతంగానూ *మౌనం పాటించనిదే ధ్యానం చేయడం అసాధ్యం*. నిరంతర యోగసాధకులైన మహర్షులు మౌనంగా ధ్యానం కొనసాగిస్తారు.

రోజూ అరగంట మౌనంగా ఉంటే శారీరక, మానసిక ఆరోగ్యం సిద్ధించడంతో పాటు ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలు నెరవేరతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. మౌనంగా ఉండటమంటే ఇంట్లో పనులు చేస్తూ,  టీవీ కార్యక్రమాలు చూస్తూ, కంప్యూటర్‌ ముందు కూర్చుని అంతర్జాలం చూడటం కాదు. కళ్లు మూసుకుని మాటను, మనసును మౌనంలోకి జార్చేస్తే మనసు తేలిగ్గా ఉంటుంది. ఎంతో మంది అనుభవపూర్వకంగా చెబుతున్న విలువైన మాట ఇది.

ఆచి తూచి మాట్లాడటం చేతకానితనం కానేకాదు. తనపై తన ఆలోచనలపై తనకున్న పట్టును అది తెలియజేస్తుంది. ‘చేజారిన కాలం, పెదవి దాటిన పలుకు’ వెనక్కి రావు. అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలిసి తీరాలి.

ప్రతి రోజూ ఎన్నో రకాల ఆలోచనలు మనల్ని పట్టి పీడిస్తుంటాయి. వాటి ప్రభావం మన మాటలపై, చేతలపై పడుతుంది. అవి ఓ చక్రం తిరిగినట్టు తిరుగుతాయి. ఆ చక్రాన్ని ఆపే శక్తే… *'మౌనం’.*

ఏ సాధన అయినా మౌనం వల్లనే సాధ్యమవుతుంది. భగవంతుడి సాన్నిధ్యానికి చేర్చే అసలైన సాధనం మౌనమే.*మౌనం అనేది భగవంతుని భాష*



🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Wednesday 24 April 2024

వేదమంత్రాన్ని వింటే లాభమొస్తుందా? (25-Apr-24, Enlightenment Story)

 వేద మంత్రాన్ని వింటే లాభమొస్తుందా?

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🌺🍀🌺

పీఠాధిపతులు, అవధూతలు, సత్యమెరిగిన స్వాములు వేదం రాకపోయినా ఫర్వాలేదు,వింటే చాలు. మీకు లాభం చేకూరుతుంది అంటారు. మంత్రశాబ్దాన్ని వింటేనే ఏమి లాభం కలుగుతుంది అని అనుమానం మనకు రాకపోదు.*

మనకు చిన్నప్పుడు మన అమ్మ సన్నగా లాలి పాట పాడుతుంది. కొన్ని సార్లు కేవలం కొన్ని పదాలతో జోకొడుతుంది.ఆ పాటలోఉన్న పదాల అర్ధం ఆ చంటిపిల్లకు తెలియనవసరం లేదు. అది ఏ రాగమో అర్ధం అవ్వవలసిన అవసరం లేదు, కేవలం తల్లి ఆ పాట పాడితే నిద్ర వస్తుంది చంటి బిడ్డకి.



సనాతన ఋషులు తాము దర్శించిన సత్యాన్ని మనకి అటువంటి అమ్మలాలిపాట లాగా వేదాలలో నిక్షిప్తం చేశారు. సంస్కృత భాషలో ఉన్న వేదం తప్పు లేకుండా చదవగలిగితే,స్వరాలతో సహా పొల్లుపోకుండా గానం చేయగలిగితే, ఈ ప్రకృతే పరవశించిపోయి వింటుంది.

అడవిలోని మృగాలు కూడా ఆ ధ్వని తరంగాలకు ముగ్దులై బద్దులై పరవశిస్తాయి. క్రూర మృగాలు సైతం తమ సహజ ప్రవృత్తిని మార్చుకొని సాత్వికంగా ప్రవర్తిస్తాయి. ఇది నిరూపితమైనది.

మన పురాణాలలో ముని ఆశ్రమాల గురించిన పలు వర్ణనలలో ఈ విషయాన్ని చెప్పారు కూడా ! ఇక, బుద్ధిలేని జీవులే అలా బుద్ధికలిగి ప్రవర్తించినప్పుడు కేవలం వేదాన్ని వినడం చేత బుద్ధి జీవులలో విజ్ఞాన వీచికలు పరిమళించవా?*

వేదమంత్రాన్ని పలకడం, లేదా అలా వేదశబ్దం ధ్వనిస్తున్న ప్రదేశంలో ఉండడం ద్వారా మన చుట్టూ తయారయ్యే ఆ శబ్ద తరంగాలు మన పరిశరాలనీ, వాతావరణాన్నీ ప్రభావితం చేస్తాయి.

ఆ శబ్దం బ్రహ్మం అవుతుంది. ఉదాహరణకు మన చుట్టూ ఎన్నో తరంగాలు ఉంటూ ఉంటాయి. ఈ ఎలక్ట్రానిక్ యుగంలో మన చుట్టూ రేడియో తరంగాలు, AV/ఆడియో వీడియో తరంగాలు, కమ్యూనికేషన్ తరంగాలు, UV తరంగాలు ఉంటాయని తెలిసిన విషయమే.

లేకపోతె మనం రేడియోలు, టీవీలు , సెల్ ఫోనులు ఆపరేట్ చేయలేము కదా ! ఇలా మన చుట్టూ ఎప్పుడూ మనకు తెలియని శక్తి తరంగాలు వాటి వాటి నిర్దుష్ట ఫ్రీక్వెన్సీ (frequency)తో మనను చుట్టుముట్టి వుంటాయి.


ఎలా అయితే ఇటువంటి తరంగాలు ఉన్నాయో, మనకు తెలియని నెగటివ్ ఫీలింగ్స్, తప్పుడు ప్రభావం కలిగించే తరంగాలు కూడా మన చుట్టూ ఉంటాయి. అలాగే మంచిని ప్రేరేపించే తరంగాలు కూడా వుంటాయి.

ప్రతి మంత్రానికి స్వర, అనుస్వర ఉదాత్తలతో ఒక నిర్దుష్టమైన రీతిలో పలికే పద్ధతి వుంది.ఆ పద్ధతిలో ఆ మంత్రోచ్చారణ చేస్తే ఆ విధమైన తరంగాలు నా చుట్టూ ప్రకటితం అవుతాయి.

ఈ తరంగాలు మంచిని ప్రేరేపించే భావాలను పెంపొందించి చెడుకు ప్రేరేపించే ఆలోచనా తరంగాలను తొలగిస్తాయి. తద్వారా కేవలం మన కర్ణావయవం అనే రిసీవర్ ద్వారా కేవలం మంచికి సంబంధించిన తరంగాలు మన మెదడుకు అందుతాయి.

తద్వారా మన బ్రెయిన్లో grey matter పెంపొందుతుంది. మానసిక దౌర్భాల్యంమాయమై ఒకానొక శక్తి ప్రవేశిస్తుంది. మంత్రాన్ని కేవలం వినడం ద్వారా మన చుట్టూ ఉన్న నెగటివ్ సిగ్నల్స్ ను దూరం చేస్తాయి. అటువంటప్పుడు అదే మంత్రం మరిన్ని సార్లు మనమే కనుక చదవగలిగితే, ఆ ఎనర్జీ మనమే తయారు చేసుకోగలుగుతాము.

మరింత శక్తియుతంగా  ఆ పాజిటివ్ శక్తిని మనం గ్రహించగలుగుతాము. ఉదాహరణకి, ఒక గదిలో చెడువాసన వస్తోంది. అక్కడ గుగ్గిలంతో పొగ వేశారంటే, ఆ ప్రాంతమంతా చక్కని సువాసనతో నిండిపోవడంతో పాటు అక్కడున్న సూక్షమ క్రిములు కూడా బయటికి వెళ్లి , ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది కదా ! ఇది కూడా అలాగన్నమాట !!

 కాబట్టి వేదమంత్రాన్ని, మంత్ర పాఠాన్ని అర్థం తెలియకుండా, కేవలం విన్నప్పటికీ కూడా ఫలాన్ని అందిస్తుంది. పురాణాలలో ఈ కథని విన్నా చదివినా అనంతమైన ఫలం దక్కుతుంది. అంటాను భగవంతుని సాన్నిధ్యం లభిస్తుంది. అని చెబుతుంటారుకదా !

 అటువంటిది , ఆ భగవంతుని వ్యక్తీకరణని వివరించే వేదాన్ని వింటే ఫలం దక్కదా !! చక్కగా వేదం శ్రవణం చేయండి. ఏదైనా శుభకార్యక్రమాలు ఉన్నప్పుడు వేదం పండితులని ఆహ్వానించి వేదాశీర్వాదాము తీసుకోండి.




🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Saturday 20 April 2024

అద్దం - నిజమైనఅందం (22-Apr-24, Enlightenment Story)

 అద్దం - నిజమైన అందం

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🌺🍀🌺


ఒకానొకప్పుడు, ఒక ప్రయాణికుడు ప్రయాణంలో అలసిపోయి, కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి అనువైన ప్రదేశం కోసం వెతుకుతూండగా, అకస్మాత్తుగా అతని దృష్టి ఒక ఆశ్రమం పై పడింది.

అది గొప్ప తత్వవేత్త, సాధువు అయిన సోక్రటీస్ ఆశ్రమం.యాత్రికుడు ఆలోచించడం ప్రారంభించి, 
"నేను ఇక్కడ కొద్దిరోజులు ఉంటే అవకాశం దొరికితే చాలా బాగుంటుంది. నేను కూడా పరిజ్ఞానం ఉన్న ప్రసంగాలు, ఉపన్యాసాలు వినగలుగుతున్నాను."  అని అనుకున్నాడు.

ఈ ఆలోచనతో సోక్రటీస్ వద్దకు వెళ్ళాడు.  సోక్రటీస్ వెంటనే అంగీకరించి, సరిగ్గా తన గదికి ఎదురుగా ఒక గదిలో అతనికి బస ఏర్పాటు చేసాడు. ఒకరోజు ప్రయాణికుడు తన గది నుండి బయటకు వచ్చినప్పుడు, సోక్రటీస్ ఎదురుగా ఉన్న గదిలో అద్దంలో చూసుకుంటున్నాడు.



అతను దానిని పెద్దగా పట్టించుకోలేదు, ఎలాంటి స్పందనా లేకుండా వెళ్ళిపోయాడు. కానీ రెండో రోజు , మూడో రోజు కూడా మళ్లీ అదే జరగడం చూసి, “సోక్రటీస్ చాలా అందవిహీనంగా ఉంటాడు కదా, కానీరోజూ అద్దంలో ఎందుకు చూసుకొంటున్నాడు ?”  అని ఆలోచించడం మొదలుపెట్టాడు.

ఈ ఆలోచన ఒక సుడిగాలిలా అతనిని తొలిచివేయడం ప్రారంభించింది.  ఆఖరికి ఆగలేక నేరుగా సోక్రటీస్ గదిలోకి వెళ్లి ఇలా అడిగాడు. "దయచేసి తప్పుగా అనుకోవద్దు, నేనొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. రోజూ అద్దం ముందు మీరు అంతసేపు ఎందుకు నిలబడతారు? మీరేమో అలా ఉన్నా కూడా" అని తటపటాయించాడు.

సోక్రటీస్ అతని ప్రశ్నను అర్థం చేసుకుని, "అవును, నేను అందవికారంగా ఉంటాను, అందంగా ఉండను. అయినా ప్రతిరోజూ నేను అద్దంలో చూడడం వలన నా వికారస్వరూపం గురించిన ఎరుకతో ఉంటాను", అని అన్నాడు.

యాత్రికుడు - "మీ విహీనత గురించి ఎందుకు ఎరుకతో ఉండాలనుకుంటున్నారు? అది మీలో న్యూనతా భావాన్ని సృష్టించిందా?"  అని అడిగాడు.

సోక్రటీస్ - "లేదు! ఎందుకంటే నేను ప్రతికూలంగా ఆలోచించను. నా అందవిహీనత నాలో అవగాహనను పెంచుతుంది."

యాత్రికుడు - "అవగాహన? ఎలా!?"

సోక్రటీస్ - "నా విహీనతను ఉదారమైన, మంచి పనులతో పరిహరించాలని నాకు తెలుసు.ఉన్నతమైన ఆలోచనలు, మంచి పనులు మనిషి యొక్క అంతర్గత సౌందర్యాన్ని పెంచుతాయి.అంతర్గత సౌందర్యాన్ని మేల్కొల్పితే, శారీరక వికారాలు బాధించవు."

యాత్రికుడు.... సాధువైన సోక్రటీస్ ఆలోచనలను విని ఉప్పొంగిపోయాడు, అతని పాదాలకు నమస్కరించాడు.  లేచి గది నుండి బయటకు వెళుతుండగా, సోక్రటీస్ గొంతు అతనిని ఆపింది - "నాయనా! నీవు కూడా అద్దంలో చూసుకోవాలి."

 ప్రయాణికుడు నెమ్మదిగా, "అలాగే",అంటూ సందేహంగా అన్నాడు. యాత్రికుని సోక్రటీస్ చూస్తూ..."ఎందుకో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎందుకంటే మీరు చాలా అందంగా,ఆకర్షణీయంగా ఉన్నారు, అద్దం మీకు కూడా నేర్పుతుంది సుమీ.....!

మీరు చూడటానికి ఎంత అందంగా ఉన్నారో, అలాంటి అందమైన పనులు చేయమని అది మీకు గుర్తు చేస్తుంది." అని చెప్పాడు. లోపల, బయట కూడా అందంలో పరిపూర్ణత సాధించండి.  అంతర్గత సౌందర్యం లేకుండా బాహ్య సౌందర్యం వున్నా అర్థం లేనిది, అసంపూర్ణమైనది!

నిజమే, మనం కోరుకుంటే, జీవితంలోని అన్నికష్టాల మధ్య సానుకూల ఆలోచనలు, భావాలతో మనల్ని మనం ప్రేరేపించుకోవచ్చు.అదే మన అంతరంగ సౌందర్యాన్ని బహిర్గతం చేసే అసలైన రహస్యం"..🙏


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

సాధన అనగా నేమి??? సమచిత్తమే సాధన..!! (24-Apr-24, Enlightenment Story)

 సాధన అనగా నేమి??? సమచిత్తమే సాధన..!!

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🍀🌺🌺🍀

రమణ మహర్షి ఆశ్రమంలో ఒకసారి భక్తుల మధ్య వివాదం వచ్చింది. చాలా కాలంగా అక్కడికి వస్తున్న భక్తులకూ, అప్పుడప్పుడే ఆశ్రమాన్ని సందర్శిస్తున్న భక్తులకూ మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి...

ఈ నేపథ్యంలో భక్తుల్లో రెండు వర్గాలు బయల్దేరి, ఒకరంటే మరొకరికి పడని పరిస్థితి ఏర్పడింది.
పాతభక్తులు, కొత్తభక్తులు అంటూ విభజనను సృష్టించుకుని, రెండు వర్గాలుగా విడిపోయారు.

సమయం చిక్కినప్పుడల్లా ఒకరిపై మరొకరు అసహనం ప్రదర్శించడం, పరస్పరం దూషించుకోవడం సాగుతోంది.
 


ఇది రమణులు గమనించారు!!...

ఓ రోజు సాయంత్రం మహర్షి గిరి ప్రదక్షిణకు బయల్దేరారు, భక్తులు ఆయనను అనుసరిస్తున్నారు.
ఆశ్రమంలో ఎప్పటి నుంచో ఉంటున్న కొన్ని కుక్కలు, ఆశ్రమం గేటు బయట ఉన్న కుక్కల్ని చూసి మొరగసాగాయి. ఆ దృశ్యాన్ని చూసిన రమణులు ‘పాపం కుక్కలు కదూ! తామంతా ఒకటేనని తెలియక మూర్ఖత్వంతో పాతవి, కొత్తవిగా విడిపోయి అరుచుకుంటూ అలసి పోతున్నాయి’ అంటూ ముందుకు సాగారు.అంతే ఆ రోజు నుంచి ఆశ్రమంలో భక్తుల నోళ్లు మూతపడ్డాయి.

‘భజగోవిందం’ ప్రబోధంలో ఆదిశంకరాచార్యుల వారి శిష్యుడు మేధాతిథి ‘వేరొకరితో విభేదాలను పెంచుకోవటం; తమవారు, పరాయివారు- అంటూ పక్షపాత వైఖరి చూపడం సరికాదు.

*సర్వాంతర్యామి అయిన పరమాత్మను చేరుకోవాలంటే అందరిపై సమదృష్టిని చూపాలి’ అన్నారు*. రమణులు కూడా ‘సమచిత్తమే పారమార్థిక సాధన’ అంటూ చెప్పేవారు...!!



🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Friday 19 April 2024

రెండు గంటల నిరీక్షణ (20-Apr-24, Enlightenment Story)

 రెండు గంటల నిరీక్షణ

🌺🍀🌺🍀🌺🌺🍀

నాన్నగారికి ఆరోగ్యం సరిగ్గా లేదు. చాలా జ్వరంగా ఉంది. మా కుటుంబ వైద్యులు రామమూర్తి గారు కొన్ని మందులు రాసిచ్చి, “సంపూర్ణంగా విశ్రాంతి అవసరం. మంచం నుండి కదలడానికి వీల్లేదు” అని చెప్పి వెళ్ళిపోయారు.

ఆ సమయంలోనే శ్రీమఠం నుండి స్వామివారి ఆజ్ఞతో ఒకరు ఇంటికి వచ్చారు. “పరమాచార్య స్వామివారి దర్శనానికి హింది పంతుల్ని ( మానాన్న) రమ్మంటున్నారు” అని.

అవును అది పరమాచార్య స్వామివారి ఆదేశం. మనస్సు సిద్ధమయ్యింది కాని వెళ్ళడానికి శరీరం సహకరించడం లేదు. మా నాన్నగారి పరిస్థితి చూసి, అతను సానుభూతి తెలిపి వెళ్ళిపోయాడు. ఒక గంట తరువాత శ్రీమఠం నుండి గుర్రపు టాంగా వచ్చి మా ఇంటి ముందు నిలబడింది. బహుశా చాలా ముఖ్యమైన విషయం అయ్యుంటుంది. ఈ సమయంలో హింది పండితుడు ఉండాలి అని మహాస్వామి వారు అనుకుని ఉంటారు.



నాన్నగారు వెళ్ళాల్సిందే. నాలుగైదు రోజులుగా నాన్న అన్నంగంజి తప్ప ఏమి తీసుకోవడం లేదు. రసం అన్నం కూడా తినవద్దని డాక్టరు గారు ఖండితంగా చెప్పారు. అయిష్టంగానే కొంత గంజి తాగి శ్రీమఠం సేవకుని సహాయంతో టాంగా ఎక్కారు. మఠం చేరగానే చాలా కష్టంగా కిందకు దిగారు. అ సేవకుని సహాయంతో మహాస్వామివారి వద్దకు వెళ్ళారు.

నాన్నని కూచోమన్నట్టుగా స్వామివారు ఆదేశించారు. స్వామివారి దర్శనం కోసం చాలామంది భక్తులు వచ్చారు. ఎన్నో సూచనలు చేశారు, పత్రాలను చదివి పంపారు, ఆశీర్వాదాలు ఇస్తున్నారు;

అలా రెండుగంటలు గడిచిపోయింది. నాన్నకు ఆకలిగా అనిపించింది. తనలో తనే, “స్వామివారు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. నాకు ఆరోగ్యం కూడా బాలేదు. ఇక్కడకు వచ్చి ప్రయోజనం ఏమిటి?” అనుకున్నారు. అక్కడే ఉన్న స్వామివారి అంతేవాసులను చూసి మౌనంగా తన బాధను చెప్పుకున్నారు.

వెంటనే అతను, “హింది పండితునికి ఆరోగ్యం బాగోలేదు. చాలాసేపటి నుండి ఇక్కడే కూర్చున్నారు” అని చెప్పాడు.
మరునిముషంలోనే స్వామివారు ప్రసాదం ఇచ్చారు. వెంటనే నాన్నగారు స్వామి ఇచ్చిన విభూతిని నుదుటన రాసుకున్నారు. స్వామివారికి ప్రణామాలు సమర్పించి బయలుదేరుతుండగా శ్రీమఠం సేవకులు సహాయం చెయ్యడానికి రాగా, ”అవసరం లేదు. నేను నడవగలను” అని ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిచి వెళ్ళి టాంగా ఎక్కి కూర్చున్నారు.

ఇంటికి చేరగానే నాన్న గట్టిగా, “నాకు ఆకలేస్తోంది. చాలా ఆకలేస్తోంది. ఏమి చేశారు ఇంట్లో?” అని అడిగారు. “డాక్టరు మిమ్మల్ని కేవలం గంజి మాత్రమే తీసుకోమని చెప్పారు” అని అన్నాము.

“అతను చెప్పనీ. . . నాకు భోజనం పెట్టండి” అన్నారు. నాన్న ఆరోజు సుష్టుగా కమ్మని భోజనం చేశారు. సాయింత్రం నాన్నని పరీక్షీంచడానికి డాక్టర్ వచ్చారు. “అసలు జ్వరం లేదు. నేను ఇచ్చినది కాక ఇంకే ఔషధం తీసుకున్నారు?” అని అడిగారు.

“మీరు ఇచ్చినదే తీసుకున్నాను. లేదు.. లేదు.. మీరు ఏదో వేరే చేశారు”

అప్పుడు నాన్నగారు తను శ్రీమఠానికి వెళ్ళడం దాదాపు రెండుగంటలు స్వామివారి సన్నిధిలో ఊరికే కూర్చోవడం మొత్తం జరిగినదంతా డాక్టరుకు చెప్పారు. ఆయన ఆశ్చర్యపోతూ,

“అది సంగతి. నేను చెప్పలేదా మీరు ఇంకా ఏదో చేశారని.. నేను సరిగ్గానే ఊహించాను. రెండుగంటల పాటు స్వామివారి అనుగ్రహ వీక్షణం మీమీద పడి, మొత్తం మీ ఆనారోగ్యాన్ని పారద్రోలింది. పరమాచార్య స్వామివారు డాక్టర్లకే పెద్ద డాక్టర్. నా వైద్యం మీకు త్వరగా బాగుచేయదు కాబట్టి, వారి వైద్యాన్ని కృపాకటాక్ష వీక్షణాల ద్వారా మీమీద ప్రసరించడానికే మిమ్మల్ని మఠానికి రమ్మన్నారు” అని చెప్పారు.

ఏమి కరుణ!! ఎంతటి కరుణాసముద్రులు!! మహాస్వామివారు ఉన్నవైపు తిరిగి మా కుటుంబ సభ్యులమందరమూ చెయ్యెత్తి వేవేల నమస్కారాలు చేశాము.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

ఎగ దీస్తే బ్రహ్మ హత్య - దిగ దీస్తే గో హత్య అనే మాట ఎలా వచ్చింది? (29-Apr-24, Enlightenment Story)

  ఎగ దీస్తే బ్రహ్మ హత్య -  దిగ దీస్తే గో హత్య అనే మాట ఎలా వచ్చింది?     🌺🍀🌺🍀 🌺 🌺🍀🌺 🌺🍀🌺🍀 🌺 🌺🍀🌺 🌺🍀🌺🍀 🌺 🌺🍀🌺           ...