Wednesday 31 May 2023

శాశ్వత మరియు అశాశ్వతాలు (12-June-23, Enlightenment Story)

 *శాశ్వత మరియు అశాశ్వతాలు*

🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹

🌹 మనిషి జీవిస్తున్నప్పుడే నేర్చుకోవాలి♪. నేర్చుకుంటూ జీవించాలి. బతకడం జీవించడం కోసమే కాదు. జ్ఞాన సముపార్జన కోసం కూడా. జీవిస్తూ ఏం నేర్చుకుంటున్నాం అన్నది ముఖ్యం. మనల్ని అతి వేగంగా ఆకర్షించేవి అజ్ఞానం, మోహం. ఆ రెండింటినీ తప్పించుకుని ముందుకు వెళ్తేనే జ్ఞానోదయం అవుతుంది.

🌹 ఈ లోకంలో శాశ్వతమైనది ఏదనే విషయం ముందు తెలుసుకోవాలి. శాశ్వతమైనది తెలిస్తే మనల్ని ఎప్పట్నుంచో వెంటాడుతున్న మరణ భయం తొలగిపోతుంది. శాశ్వతమైనది తెలిస్తే ఏది అశాశ్వతమైనదో కూడా తెలుస్తుంది♪. ఈ రెండింటినీ పూర్తి అనుభూతిలోకి తెచ్చుకున్నవాడే నిజమైన మానవుడు. అతడే జ్ఞాని♪. అతడే యోగి.  శ్రీకృష్ణుడు చెప్పిన ఉత్తమమైన యోగి అతడే.

🌹 శాశ్వతంగా ఉండేది ఏదీ కళ్లకు కనిపించదు. అంతా అశాశ్వతంగా అనిపిస్తుంది♪. ఈవేళ ఉండి రేపు కనిపించకుండా పోయేవి ఎన్నో. మరి శాశ్వతంగా ఉండేది మనకు ఎలా తెలుస్తుంది♪? 

🌹 శాశ్వతంగా ఉండేది ఆత్మ. అది నీలోనే ఉంది. నువ్వు పుడతావు, మరణిస్తావు. కాని నీ ఆత్మకు చావు పుట్టుకలు లేవు. అది శాశ్వతంగా ఉంటుంది. దాన్ని ఎవరూ చంపలేరు. ఇది తెలుసుకుని జీవించేవాడే తనకు ఆప్తుడని పరమాత్మ భగవద్గీతలో విశదీకరించాడు.

🌹 దీన్ని ఎలా నమ్మాలి? అర్జునుడికి చాలా సందేహాలు కలిగాయి. నమ్మకం కుదరలేదు. కాని చెప్పినవాడు శ్రీకృష్ణుడు. ఏం చెయ్యాలి? చూస్తేనే గాని నమ్మదు మనసు. ఆత్మను మామూలు కళ్లతో చూసే అవకాశం లేదు. అది జ్ఞానంతోనే చూడగలం. అటువంటి జ్ఞాననేత్రం కావాలి. అది అందరికీ ఉంటుంది. కాని, మూసుకుని ఉంటుంది. దాన్ని తెరిపించాడు శ్రీకృష్ణుడు.

🌹 ఈ భూమ్మీదకు మనం వచ్చింది రెండు విషయాలు తెలుసుకోవడానికి. ఒకటి శాశ్వతమైనదాని గురించి, రెండోది అశాశ్వతమైనదాని గురించి. ఈ రెండూ తెలిస్తే సర్వమూ తెలిసినట్లే. శాశ్వతమైనది ఆత్మ. అశాశ్వతమైనది శరీరం. ఆత్మ కనిపించదు. శరీరం కనిపిస్తుంది. కనిపించనిది ఎప్పుడూ ఉండేది. కనిపించేది ఎప్పుడూ ఉండనిది. అదే గమ్మత్తు!

🌹జీవించడానికి తిండి, నిద్ర, గాలితోపాటు శుద్ధ జ్ఞానం కూడా కావాలి. ఏ కాలుష్యం లేని అసలు సిసలైన సత్యస్వరూప జ్ఞానం వల్లనే ఆత్మ ఉనికి తెలుస్తుంది. ఆత్మ తెలిస్తే, ఇక రెండోది తెలుసుకోవడానికి ఏమీ మిగలదు. శాశ్వతమైన ఆత్మలో జగత్తు ఉంది. ఆత్మకు పూచిన పువ్వు వంటిది ఈ ప్రపంచం. ఆత్మాన్వేషణే జీవితం. తెలిసో తెలియకో ప్రతి ఒక్కరూ చేసే పని తమ ఆత్మను తాము వెదుక్కోవడమే. ఇదే బతుకు!

శరీరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. శరీరం ఉపకరణం, ఉపాధి. దీన్ని ఆధారం చేసుకునే ఆత్మను చేరుకోవాలి.

🌹 శరీరం నేను కాదు. ఈ శరీరంలో నేను నివసిస్తున్నాను.

🌹అశాశ్వతమైన దానిలో శాశ్వతమైనవాడు ఉంటున్నాడు. వాడు సర్వ జీవుల్లో ఉంటున్నాడని తెలుసుకోవాలి.

🌹 ఎవరైతే మానవసేవను మాధవసేవగా భావిస్తారో, వారు శరీరాన్ని పరులకోసం వినియోగిస్తారు. పరోపకారమే పరమార్థంగా భావిస్తారు. 

🌹 శాశ్వతమైన ఆత్మకోసం అశాశ్వతమైనదాన్ని తృణప్రాయంగా భావిస్తారు. అటువంటివారే లోకానికి ఆదర్శప్రాయులై వెలుగొందుతారు!


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏సర్వేజనాసుఖినోభవంతు

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥


భోజనం చేసేటపుడు మీ ఇష్టాయిష్టములను చూడరాదు (11-June-23, Enlightenment Story)

 భోజనం చేసేటపుడు మీ ఇష్టాయిష్టములను చూడరాదు

🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹

ఎంత గొప్ప అతిధి వచ్చినా ఆ అతిధి కోసం పంక్తిలో కూర్చున్న వ్యక్తిని లేపి మరొకచోట కూర్చోమని అనరాదు. రాహువు రాక్షుసుడైనా మోహిని రూపంలోని శ్రీ మహావిష్ణువు అమృతం పోశాడు తప్ప పంక్తి నుంచి లేవమని అనలేదు.

అలా లేచి మరొకచోట కూర్చోమనడం పరమ దోషం. ఏ భేదము చెప్పి కూడా పంక్తిలో కూర్చున్న వాళ్ళని ఎంత బలవత్తరమైన కారణము మీదనైనా లేచి మరొకచోట కూర్చోమని అనకూడదు. పంక్తియందు ఒకసారి కూర్చుంటే వారికి వడ్డించనని కానీ, పెట్టనని కానీ మీరు అనడానికి వీలులేదు.

పంక్తిలో కూర్చున్న వానిని మీరు ఈశ్వర స్వరూపంగా భావించాలి. భేదమును చూపడం శాస్త్రమునందు మహా దోషము. అక్కడ దేవతల వరుసలో కూర్చున్నవాడు రాహువే అని శ్రీమన్నారాయనునికి తెలుసు. ఐనా అతనికి అమృతమును పోశాడు. ఇపుడు రాహువు అమృతమును త్రాగాడు.

అతడు త్రాగిన అమృతము క్రిందకి దిగిందంటే రాక్షస శరీరము అమృతత్వమును పొందేస్తుంది. అతనిది రాక్షస ప్రవృత్తి. మంచి ప్రవృత్తి కాదు. వెంటనే సుదర్శన చక్రము ప్రయోగించి.

*పరమాత్మ ఏక కాలమునందు ధర్మాధర్మములను ఆవిష్కరించాడు. *

అమృతంతో కూడినందువలన తల నిర్జీవం కాలేదు. మొండెం మాత్రం కింద పడిపోయింది. పంక్తియందు కూర్చున్నవాడికి అమృతం పోయడం ధర్మం. రాక్షసుడు బ్రతికి ఉంటే ప్రమాదం తెస్తాడు కాబట్టి నిర్జించడం ధర్మం.

*అమృతత్వాన్ని పొందాడు. శిరస్సు అమృతం తాగిందని బ్రహ్మగారు నవగ్రహాలలో ఒక గ్రహ స్థానమును ఇచ్చి రాహువును అంతరిక్షమునందు నిక్షేపించారు. *

ఆనాడు కనుసైగ చేసినందుకు గాను రాహువు సూర్య, చంద్రులను ఇప్పటికీ రూపంలో పట్టుకుంటూ ఉంటాడు.✍️

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

సర్వేజనాసుఖినోభవంతు🙏

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

మూడు జల్లెడ్ల పరీక్ష (Triple Filter Test) - (10-June-23, Enlightenment Story)

 మూడు జల్లెడ్ల పరీక్ష (Triple Filter Test) 

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

ఒక సారి చాణక్యుని దగ్గరకు అతని మిత్రుడు ఒకడు వచ్చి "నీకు తెలుసా, నీ మిత్రుడు గురించి. నేను ఒక విషయం విన్నాను” అని ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతున్న అతన్ని చాణక్యుడు ఆపి “నీవు నా మిత్రుడు గురించి చెప్పబోయే ముందు ఒక్క నిముషం సావధానంగా నీవు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడ పడదాం.

 దీన్ని నేను 'మూడు జల్లెడ్ల పరీక్ష (Triple Filter Test)' అంటాను" అని అడగటం మొదలు పెట్టాడు._

మొదటి జల్లెడ “నిజం”: నీవు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమైనదని నీకు తెలుసా ?” అని అడిగాడు. అందుకు ఆ స్నేహితుడు “లేదు ఎవరో అంటుండగా విన్నాను” అని అన్నాడు. అంటే నీవు చెప్పబోయే విషయం నిజమైనదే అని నీకు తెలీదన్న మాట” అని చాణిక్యుడు అన్నాడు.

*_సరే రెండో జల్లెడ  “మంచి" :_*నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించిన మంచి విషయమా ?” అని అడిగాడు చాణక్యుడు. “కాదు” అన్నాడు చాణక్యుని స్నేహితుడు. “అంటే నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలను కున్నావు. అది కుడా నీకు ఖచ్చితంగా నిజమని తెలీని విషయం". "సరే ఇంక మూడో జల్లెడకు వెళదాం” అన్నాడు చాణక్యుడు.

*మూడో జల్లెడ “ఉపయోగం” :*నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగమైనదా ?” అని చాణక్యుడు అడిగాడు. “లేదు” అన్నాడు ఆ మిత్రుడు. “అయితే నీవు చెప్పబోయే విషయం నిజమైనది, మంచిది, ఉపయోగకర మైనది కానపుడు నాకు చెప్పటం ఎందుకు ?” అని అన్నాడు చాణక్యుడు.

నీతి : మన గురించి, మన వాళ్ళ గురించి చెడు వార్తలను, విషయాలను మోసేవాళ్ళు చాలా మంది వుంటారు. ఒక విషయం (చాడి) వినే ముందు ఈ మూడు జల్లెడల పద్ధతి అనుసరిస్తే, మన బంధాలు నిలబడతాయి మంచి పెంపొందుతుంది. చాడీలు నివారించ బడతాయి.

*స్నేహానికి విలువ తెలిసిన వారికి మాత్రమే ఈకథ !*

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

సన్మార్గం (09-June-23, Enlightenment Story)

 సన్మార్గం

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

జీవితాన్ని ధర్మబద్ధంగా కొనసాగించడానికి సన్మార్గమే ఉత్తమ సాధనం. తోటివారికి సహాయం చేయడం, సంఘ శ్రేయస్సు కోసం పాటుపడటమే సన్మార్గం. స్వార్థంతో ప్రవర్తించి, ఇతరులకు కీడు చేయడమే దుర్మార్గం.

సన్మార్గంలో నడిచిన వ్యక్తి ఎప్పటికప్పుడు తానేమిటో, తన స్థాయి ఏమిటో తెలుసుకుంటాడు. ఆత్మవిమర్శ చేసుకొంటూ ఉన్నతమైన బాటలో ప్రయాణిస్తాడు.

ఈ సమాజం ఎలా అయినా ఉండనీ గాక, మనమెలా ఉన్నామన్నదే ముఖ్యం. ఏం చేస్తామన్నదే ముఖ్యం. కమలం బురద మధ్యలో జీవిస్తున్నా తన తేజస్సు కోల్పోదు. కోమలత్వాన్ని వీడదు. మనిషి కూడా కమలం లాగే బతకాలి.


సన్మార్గంలో సాగడం వల్లే మనిషి ఈ సమాజంలో అత్యుత్తమ గౌరవాన్ని పొందుతాడు. మానవత్వం వల్లే అందరికీ ఆదర్శప్రాయుడవుతాడు. అందుకే భగవంతుడు ప్రసాదించిన ఈ జన్మ ద్వారా అందరికీ సహాయం చేసే స్థాయికి మనిషి ఎదగాలి.

మరుజన్మ ఉన్నదో లేదో మనకు తెలియదు. గత జన్మ ఎలాంటిదో కూడా తెలియదు. ఈ జన్మలో లభించిన పవిత్రమైన మానవ జన్మను ప్రతి మనిషీ సార్థకం చేసుకోవాలి. పదిమందినీ ఉద్ధరించే ప్రయత్నం చేయాలి.

ఒకసారి సన్మార్గం వైపు ప్రయాణించిన మనిషి చెడుమార్గం వైపు మరి కన్నెత్తి చూడడు. సత్‌ కార్యాలు చేస్తూ ముందుకు సాగుతాడు. దారి దోపిడులు చేసే రత్నాకరుడనే బోయవాడు నారద మహాముని ఉపదేశం వల్ల పరివర్తన చెంది, రామనామ జపంతో వాల్మీకిగా ప్రసిద్ధి పొందాడు. ఆదికావ్యమైన రామాయణాన్ని లోకానికి అందించాడు.

బుద్ధుడు సిద్ధార్థుడిగా ఉన్నప్పుడు ఎన్నో రాజభోగాలను అనుభవించాడు. ఆ సిద్ధార్థుడే అన్నింటినీ వదులుకుని సన్మార్గాన్ని అవలంభించి జ్ఞానోదయం పొందాడు. మహా బోధకుడిగా మారి అమరుడయ్యాడు.

శ్రేష్ఠులైనవారు దేన్ని ధర్మంగా భావించి ఆచరిస్తారో సజ్జనులూ దాన్నే ఆచరిస్తారని బోధించాడు శ్రీకృష్ణుడు. జ్ఞానులు, మహాత్ములు సన్మార్గాన్ని అనుసరించారు, చరితార్థులయ్యారు. ప్రతి మనిషీ మహనీయుల మార్గాన్నే అనుసరించాలి. కీర్తి శిఖరాలు చేరుకోవాలి.

రావణాసురుడు గొప్ప శివభక్తుడు. స్త్రీ వ్యామోహం వల్ల దుర్మార్గంగా ప్రవర్తించి, చివరికి నాశనమయ్యాడు. *వివేకం కోల్పోయి బంధుమిత్రుల హితవచనాలు పెడచెవిన పెట్టినందువల్ల కౌరవ నాశనానికి కారకుడయ్యాడు దుర్యోధనుడు. *

ఏ మనిషైనా దుర్మార్గుడిగా మారడానికి ఎంతోకాలం పట్టదు. మంచివాడిగా, మానవోత్తముడిగా గుర్తింపు పొందడానికి చాలా కాలం పడుతుంది. తద్వారా వచ్చే కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది.

సన్మార్గమే మనిషికి సంపద. సన్మార్గంలో ప్రయాణించే మనిషికి ధనధాన్యాలు లేకపోయినా అన్ని సంపదలూ ఉన్నట్లే. సత్ప్రవర్తన లేనివారికి సంపదలు ఉన్నా అవి లేనట్లేనన్నది నీతికోవిదుల మాట.

చూసిన ప్రతిదాన్ని ఆశించడం, ఆశించినదానికోసం పాకులాడటం, కోరుకున్నది దొరక్కపోతే బాధపడటం... ఇవన్నీ మనిషి అశాంతికి కారణాలు. ఇవే మనిషిని దుర్మార్గం వైపు నడిపిస్తాయి. అందుకే మనిషి ఎప్పటికప్పుడు కోరికలను నియంత్రించుకుని స్థిరచిత్తం ఏర్పరచుకోవాలి.

*#సన్మార్గం మనిషికి సుఖశాంతులు ప్రసాదిస్తుంది. సన్మార్గంలో నడిచే వ్యక్తుల మనసులు కడిగిన ముత్యాల్లా నిర్మలంగా ఉంటాయి. వారు ఎవరితోనైనా మృదుమధురంగా మాట్లాడతారు. కలిమిలోను, లేమిలోను నిబద్ధత కలిగి ఉంటారు. మంచి పనుల ద్వారా అందరినీ ఆకట్టుకుంటారు. సన్మార్గంలో ప్రయాణించిన మనిషి,మనీషిగా ఎదుగుతాడు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకుంటాడు. మంచి బాటలో నడిచిన మనిషికి దైవానుగ్రహం తప్పక లభిస్తుంది. అందుకే సన్మార్గం అందరికీ అనుసరణీయం.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

అష్టావక్ర మహర్షి ! (08-June-23, Enlightenment Story)

 *అష్టావక్ర మహర్షి !*

🔥🌹🔥🌹🔥🌹🔥🌹

బాహ్య సౌందర్యం కన్న అంతః సౌందర్యం గొప్పదని తన నడవడికతో చెప్పకయే చెప్పిన మహిమాన్విత మూర్తి అష్టావక్రుడు. అష్టావక్రుడు అనే గొప్ప విద్యాశక్తిసంపన్నుడైన మహర్షి ఉండేవాడు. ఈతని తండ్రి ఏకపాదుడు అనే భ్రాహ్మణుడు.ఈయనకు "కహోలుడు" అని కూడా ఇంకొక పేరు.అతను నిరంతర తపోనిరతుడు.వేదవేత్త.ఉద్దాలకుడి చెల్లెలు సుజాత ను పెళ్ళిచేసుకున్నాడు.ఏకపాదుని దగ్గరకు ఎందరో బ్రహ్మచారులు వచ్చి అధ్యయనం చేస్తూ ఉండేవారు.శిష్యకోటితో కాలక్షేపం చేస్తూ భార్య సుజాత తో కలసి జీవించసాగాడు ఏకపాదుడు.సుజాత గర్భవతి అయ్యింది.అష్టావక్రుడు తల్లి గర్భములో ఉన్నప్పుడే తన తండ్రి ఏకపాదుడు తన శిష్యులచే నిరంతరము వేదాధ్యయనము చేయించటం విని తండ్రితో ఇలా పలికాడు. "తండ్రీ!నిరంతర వేదాధ్యయనముచే శిష్యులను మిగుల బాధించుచున్నారు.అందువలన వారి ఆరోగ్యము పాడగును!" - ఆమాటలకు ఏకపాదునికి కోపంవచ్చి " నా అధ్యాపనమును గురించి వక్రభాష్యం చేసావు (వక్రముగా పలుకటం) కావున నీవు అష్టవక్రములతో (ఎనిమిది వంకరలతో) పుట్టుము" - అని తల్లి గర్భమున ఉన్న శిశువును(తన కుమారుని) శపించాడు.

కొంత కాలానికి అష్టావక్రుడు పుట్టకముందే భార్య కోరిక మేరకు ధనార్జనకోసం జనక మహారాజు సభకు వెళ్ళాడు.ఆ సభలో వరుణుని కుమారుడైన "వంది" చేతిలో వాదనలో ఓడిపోయాడు.పందెం ప్రకారము ఓడినవారు జలమజ్జితులై ఉండాలి.నియమం ప్రకారం ఆ ఏకపాదుడు జలములందు ముంచివేయబడ్డాడు.

ఎనిమిది వంకరలతో పుట్టిన అష్టావక్రుడూ తన మేనమామ ఉద్దాలకుడి ఇంటిలో అతని కుమారుడైన శ్వేతకేతువుతో కలసి వేదాభ్యాసము చేసాడు.ఒక సందర్భములో శ్వేతకేతు మాటలకు కుపితుడై అష్టావక్రుడు వెంటనే తన తల్లి దగ్గరకు వెళ్ళి "నా తండ్రి ఎవరు? ఎక్కడ ఉన్నారు? " అని అడుగుతాడు. దానికి సుజాత "నీ తండ్రి ఏకపాదుడు.ధనార్జన కోసం జనకుని రాజ్యమునకు వెళ్ళారు" అని చెపుతుంది. తత్వజ్ఞాని ఐన అష్టావక్రుడు విషయం గ్రహించి శ్వేతకేతుతో కలిసి జనకుని రాజ్యమునకు వెళ్తాడు.తిన్నగా ఆస్థానము లోపలికి వెళ్ళబోతుంటే ద్వారపాలకులు అడ్డుపడి పిల్లలకు ప్రవేశార్హత లేదని చెపుతారు.వారితో అనేక శాస్త్ర విషయాలు చెప్పేసరికి మారు మాట్లాడకుండా అష్టావక్రునికి లోపలికి వెళ్ళటానికి దారినిస్తారు.

అష్టావక్రుడు తిన్నగా జనకమహారాజు దగ్గరకు వెళ్ళి "వంది"తో వాదిస్తానని చెపుతాడు.ఇంత చిన్న బాలుడవు వంది తో వాదకు కుదరదు అన్న జనక మహారాజుతో వాదించి తన శక్తి సామర్ధ్యాలు తెలియచేసాడు.అష్టావక్రుడు జనక మహారాజుతో చేసిన వేదాంత చర్చయే "అష్టావక్ర సమ్హిత".ఆత్మజ్ఞానాన్ని అందించే సంకీర్తనము,శాంతి,నిర్వేదము,జీవన్ముక్తి మొదలైన విషయాలపైన ఎన్నో వేదాంత విషయ వివరణలు ఈ గ్రంధములో ఉన్నాయి.జనకుడు వంది తో వాదనకు అంగీకరించాడు.వాద ప్రతివాదనలలో చివరకు వంది ని బాలుడైన అష్టావక్రుడు ఓడించాడు.జలమజ్జితుడైన తన తండ్రి ఏకపాదుని  విడిపించాడు.జనకుడు అష్టావక్రుని చేత అద్వైత వేదాంత సిద్ధాంత రహస్యములను తెలుసుకున్నాడు.తండ్రి అష్టావక్రుని పితృభక్తికి ఎంతో సంతోషించి నదిలో స్నానం చేయించి తన కుమారుని అష్టవంకరలు పోయేటట్లుచేశాడు.

సుందరాకారము పొందిన అష్టావక్రుడు వదాన్య మహర్షి కుమార్తె ఐన సుప్రభ ను వివాహమాడి పుత్రులను పొందాడు.ఆదర్శప్రాయమైన గృహస్థాశ్రమాన్ని సాగించాక అష్టావక్రుడు పుష్కర తీర్థములో తపస్సు చేసి మనస్సు పరమాత్మయందు లయం చేసి శ్రీ కృష్ణుని దర్శించి ఆయన పాదములపై పడి మరణించి గోలోకమునకు పోయి మోక్షమును పొందాడు.

అష్టావక్రుని గురించి అనేక గాధలున్నాయి.ఒకనాడు అష్టావక్రుడు జలమధ్యమున ఉండగా, ఈతని కురూపమును చూసి రంభాది అప్సరసలు నవ్వినందున, వారు దొంగలచే పట్టుబడునట్లు శపించాడు.అనంతరము వారు క్షమించమని వేడి నృత్యగీతములను అష్టావక్రుడికి వినిపించారు.అందుకు సంతోషించిన మహర్షి ఏమి కావాలి అని అడుగగా వారందరూ విష్ణుమూర్తితో పొందును కోరారు.వారి కోరిక విన్న అష్టావక్రుడు కృష్ణావతార కాలాన మీరు గోపికలై జన్మించి ఆతని పొందగలరు అని పలుకుతాడు. ఆయన అనుగ్రహం కారణంగా గోపికారూపులైన కృష్ణుని భార్యలు గాను,శాప కారణంగా కృష్ణ నిర్యాణానంతరము సముద్రము ద్వారకను ముంచేస్తుంది కాబట్టి, కృష్ణుని ఆజ్ఞ ప్రకారం అర్జునుడు కృషుని భార్యలైన వారిని సురక్షిత ప్రదేశానికి తీసుకువెళుతున్నప్పుడు వారు దొంగలచేత పట్టుబడి నగలు తదితర వస్తువులను సర్వము కోల్పోతారు.అంత ధీరుడైన అర్జునుడు దొంగల చేతిలో ఓడిపోయి ఏమీ చేయలేని స్థితికి చేరుతాడు.

పూర్వజన్మలో అష్టావక్రుడు దేవలుడు.ఇతడు మాలావతి ని వివాహము చేసుకొని సంతానము పొంది విరాగై తపస్సు చేస్తూ ఉండగా అతని తపస్సు కు వేడిపుట్టి ముల్లోకములను బాధించసాగింది.ఇంద్రుడు దేవలుని తపస్సు భగ్నం చేయాలని రంభను పంపితే ఆతను చలించలేదు.అందుకు రంభ కోపముతో మరుజన్మలో నీవు అష్టావక్రుడవై జన్మించమని శపించింది.తర్వాత వెంటనే పశ్చాత్తాపంతో శాపవిమోచనం కూడా తెలియచేసి స్వర్గలోకానికి వెళ్ళిపోయింది.ఆ దేవలుడే ఈ అష్టావక్రుడు.

తండ్రిని జలబంధము నుండి తరింపచేసిన తనయుడు.దివ్య మహిమోపేతుడు.అతి తేజస్వి.లోకపూజితుడు అష్టావక్రుడు.

సర్వేజనాసుఖినోభవంతు🙏

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Tuesday 30 May 2023

విష్ణుసహస్ర నామ స్తోత్రం విశిష్టత (07-June-23, Enlightenment Story)

 *విష్ణుసహస్ర నామ స్తోత్రం విశిష్టత*

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

రోజుకు కనీసం ఒక్క సారైనా విష్ణుసహస్ర నామ పారాయణం చేయండి.ఉత్తమ ఫలితాలు పొందండి..

మంత్రాల ఘనికి మూల మంత్రం శ్రీ విష్ణుసహస్రనామం

ఓం నమో నారాయణాయ .ఓం నమో భగవతే వాసుదేవాయ. ఫలితం మీకే స్పష్టంగా తెలుస్తుంది...

విష్ణు సహస్ర నామ స్తోత్రము పారాయణ చేసిన అశ్వ మేధ యాగం చేసినంత పుణ్యం కలుగును ఆయురారోగ్యము కలుగును, పాపములు తొలగును. 

స్తోత్రము లో ప్రతి నామము అద్భుతం.మన నిత్య జీవితంలోని అన్నీ సమస్యలకు పరిష్కరాలు ఇందులో వున్నాయి

విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు నిష్ఠతో పఠించే వారికి ఎలాంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి. కష్టనష్టాలు ఒక్కసారిగా మీదపడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో విష్ణు సహస్ర నామపారాయణం అన్నింటికీ విరుగుడులా పనిచేస్తుందని వారు సూచిస్తున్నారు. 

అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా కష్టాలు, వ్యాధులు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు శుభాలు చేకూరుతాయి. విష్ణు సహస్రనామ పఠనం వలన పుణ్యరాశి పెరుగుతుందనీ.. ఉత్తమగతులు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. ఇంకా ఇంటి దేవతా పూజతో, ఇష్టదేవతా పూజతో కూడా ఇబ్బందులను తొలగించుకోవచ్చునని వారు సూచిస్తున్నారు. 

అయితే విష్ణు సహస్రనామాన్ని అనునిత్యం ఏడాది పాటు పఠించడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయంటే..?

1. అదృష్టం

2. ఆర్థిక ఇబ్బందులు వుండవు 

3. గృహంలో ఆహ్లాదకరమైన వాతావరణం 

4. కోరిన కోరికలు నెరవేరుతాయి

5. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది

విష్ణు సహస్రనామాన్ని పఠించే ముందు శుచిగా స్నానమాచరించడం చేయాలి. ఆపై పూజగదిలో కూర్చుని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. లేకుంటే వినడమైనా చేయాలి. ఈ విష్ణు సహస్ర నామం నుంచి వెలువడే శబ్ధం దుష్ట ప్రభావాన్ని దూరం చేస్తుంది. అలాగే ఇంటి ముందు తులసిని పెంచడం ద్వారా మంచి ఫలితాలు వుంటాయి. అలాగే తులసీ మొక్క ముందు నేతి దీపం వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందిన వారవుతారు.

అభీష్టసిద్ధికి ఈ క్రింద సూచించిన శ్లోకములను 108 మార్లు జపించవలెను. పిల్లల క్షేమార్థము తల్లిదండ్రులు జపము చేయవచ్చును:

1. విద్యాభివృద్ధికి :-  (14వ శ్లోకం)

||సర్వగ సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్దనః ||వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ||

2. ఉదర రోగ నివృత్తికి:-  (16వ శ్లోకం)

||భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః || అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ||

3. ఉత్సాహమునకు:- (18వ శ్లోకం)

||వేద్యో వైద్య స్సదాయోగీ వీరహా మాధవో మధుః ||అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ||

4. మేధాసంపత్తికి:- (19వ శ్లోకం)

||మహాబుధ్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః ||అనిర్దేశ్య వపుః శ్రీమా నమేయాత్మా మహాద్రిధృక్ ||

5. కంటి చూపునకు:-  (24వ శ్లోకం)

|అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణః ||సహస్రమూర్థా విశ్వాత్మ సహస్రాక్ష స్సహస్రపాత్ ||

6. కోరికలిడేరుటకు:- (27వ శ్లోకం)

||అసంఖ్యేయో2ప్రమేయాత్మ విశిష్ట శ్శిష్ట క్రుచ్ఛిచిః |సిద్ధార్థ స్సిధ్ధసంకల్పః సిద్ధిద స్సిధ్ధిసాధనః ||

7. వివాహ ప్రాప్తికి:- (32వ శ్లోకం)

||భూతభవ్య భవన్నాధః పవనః పావనో2నలః |కామహా కామక్రుత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ||

8. అభివృద్ధికి:- (42వ శ్లోకం)

||వ్యవసాయో వ్యవస్థానః సంస్థాన స్స్థానదో ధ్రువః |పరర్థిః పరమ స్పష్ట: స్తుష్ట: పుష్ట శ్శుభేక్షణః ||

9. మరణ భీతి తొలగుటకు:- (44వ శ్లోకం)

||వైకుంఠ: పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః ప్రుథుః |హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః ||

10. కుటుంబ ధనాభివ్రుద్ధికి:-  (46వ శ్లోకం)

||విస్తారః స్థావర స్స్తాణుః ప్రమాణం బీజ మవ్యయం||అర్థో2నర్థో మహాకోశో మహాభోగో మహాధనః ||

11. జ్ఞానాభివ్రుద్ధికి:- (48వ శ్లోకం)

||యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతు స్సత్రం సతాం గతిః |సర్వదర్సీ నివృతాత్మ సర్వజ్ఞో జ్ఞాన ముత్తమం ||

12. క్షేమాభివ్రుధ్ధికి:-  (64వ శ్లోకం)

||అనివర్తీ నివృత్తాత్మ సంక్షేప్తా క్షేమక్రుచ్ఛివః |శ్రీవత్సవక్షా శ్శ్రీవాస శ్శ్రీపతిః శ్శ్రీమతాం వరః ||

13. నిరంతర దైవ చింతనకు:- (65వ శ్లోకం)

|శ్రీద శ్శ్రీశ శ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః |శ్రీధరః శ్రీకర శ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ||

14. దుఃఖ నివారణకు:-  (67వ శ్లోకం)

||ఉదీర్ణ స్సర్వత శ్చక్షు రనీశ శ్శాశ్వత స్థిరః |భూశయో భూషణో భూతి ర్విశోక శ్శోక నాశనః ||

15. జన్మ రాహిత్యమునకు:- (75వ శ్లోకం)

||సద్గతి స్సత్క్రుతి స్సత్తా సద్భూతి స్సత్పరాయణః |శూరసేనో యదుశ్రేష్ఠ స్సన్నివాస స్సుయామునః ||

16. విద్యా ప్రాప్తి కి :- (80వ శ్లోకం)

||అమానీ మానదో మాన్యో లోకఃస్వామీ త్రిలోకధృత్|||సుమేధా మేధజో ధన్యః సత్యమేథా ధరాధరః||

17. శత్రువుల జయించుటకు:-  (88వ శ్లోకం)

|సులభ స్సువ్రత సిద్ధ శ్శత్రుజి చ్ఛత్రు తాపనః !న్యగ్రోధో దుంబరో2శ్వత్ఠ శ్చాణూరాంధ్ర నిషూధనః|

18. భయ నాశనమునకు:-  (89వ శ్లోకం)

|సహస్రార్చి స్సప్తజిహ్వ స్సప్తైధా స్సప్తవాహనః|అమూర్తి రణఘో2చింత్యో భయక్రు ద్భయ నాశనః ||

19. సంతాన ప్రాప్తి కి :-  (90వ శ్లోకం)

|అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్|అధృత స్స్వధృత స్య్సాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్థనః||

20. మంగళ ప్రాప్తికి:-  (96వ శ్లోకం)

|సనాత్సనాతన తమః కపిలః కపి రవ్యయః |స్వస్తిద స్స్వస్తిక్రుత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ||

21. ఆపదలు తొలగుటకు, లోక కల్యాణమునకు:- (97 & 98వ శ్లోకం)

||అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః | శబ్దాదిగ శ్శబ్దసహ శ్శిశిర శ్శర్వరీకరః ||

||అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః |విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ||

22. దుస్వప్న నాశనమునకు:- (99వ శ్లోకం)

||ఉత్తారణో దుష్క్రుతిహా పుణ్యోదుస్వప్న నాశనః |వీరహా రక్షణ స్సంతో జీవనం పర్యవస్తితః ||

23. పాపక్షయమునకు:  (106వ శ్లోకం)

||ఆత్మయోని స్స్వయం జాతో వైఖాన స్సామగాయనః |దేవకీ నందన స్స్రష్టా క్షితీశః పాపనాసనః ||

24.సర్వ రోగ నివారణకు: (103వ శ్లోకం)

||ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః||తత్త్వం తత్త్వ విదేకాత్మా జన్మమృత్యు జరాతిగః||

25. సుఖ ప్రసవమునకు:-  (107వ శ్లోకం)

||శంఖభృత్ నన్దకీ చక్రీ శారంగధన్వా గదాధరః|||రథాంగపాణి రక్ష్యోభ్యః సర్వ ప్రహరణాయుధః||

||శ్రీ స్సర్వ ప్రహరణాయుధ ఓమ్ నమ ఇతి||

విష్ణు సహస్ర నామము మొత్తం చదివిన తదుపరి మీకు ఇందులో కావలసిన శ్లోకం 108 సార్లు పఠించవలెను.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

తిరుపతి చుట్టూ పక్కల ఉన్న, ప్రఖ్యాత లేదా కొంచెమే తెలిసిన గుళ్ళు (06-June-23, Enlightenment Story)

 తిరుపతి చుట్టూ పక్కల ఉన్న, ప్రఖ్యాత లేదా కొంచెమే తెలిసిన గుళ్ళు

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥



ముందుగా తిరుపతిని ఒక ఆధారం గా పెట్టుకుంటే ,ఇందులో ప్రతి గుడి ఎన్ని కి.మీ ఉందొ ఉజ్జాయింపుగా తెలుస్తుంది. ఇందులో మూడు దిక్కుల మూడు కోణాలుగా మీ యాత్ర కోన సాగించ వచ్చు.

మొదట తూర్పు దిక్కుగా శ్రీ కాళహస్తి ఉంటుంది. ఇది రమారమి ౩7 కి.మీ దూరం లోఉంది. దీన్ని వాయులింగం అంటారు. శివుని గుడి. ఎంతో పురాతన మైనది. ఇక్కడ రాహుకేతు పూజలు ప్రతి నిత్యం చేస్తారు. కనీసం గంట ప్రయాణం. అలా పోయి వచ్చేటప్పుడు మధ్యలో పక్క దారిలో వెళ్లి గుడిమల్లం లో పరశురామేశ్వర గుడి చూడవచ్చు.ఇది భారత దేశం లోనే ప్రాచీన దేవాలయం అని పేరు గన్నది.

ఇక దక్షిణ దిక్కులో మొదట తిరుచానూర్ పద్మావతి దేవాలయం. కేవలం ఐదు కి.మీ దూరం లోనే ఉంది. ఇక్కడ కొద్దిగా రద్దీ ఉంటుంది. లక్ష్మీ దేవి కదా, అందరికీ అవసరమే మరి. ఆపైన కొంచెం పక్క మార్గంగా, అప్పలాయ గుంట ప్రసన్న వేంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఇక్కడ పెళ్లి చేసుకున్న వేంకటేశ్వరుడు దర్శనమిస్తారు అంటారు. అభయముద్ర లో ఉంటాడు కనుక, శ్రేష్టమని కొంద రంటారు. మళ్ళీ అదేవరుసలో, మద్రాసు వెళ్ళే దారిలో, పుత్తూర్ పక్కన నారాయణ వనం లో, వేంకటేశ్వర స్వామి, ఇంకొంచెం ముందుకు వెళ్తే, నాగలాపురం లో మత్స్యావతార విష్ణు మూర్తి గుడి, ఉంటుంది. ఇంకొంచెం పైన శయన మూర్తిగా ఉన్న ఏకైక శిల్పం సురుటు పల్లి(ఊత్తుకోట-తమిళ నాడు) లో, పల్లి కొండేశ్వర శివాలయం ఉంది. ఈ గుడిలో గరళం తాగిన శివుడు, పార్వతి ఒడిలో, పడుకున్న శిల్పం( రాయి కాదు కనుక అభిషేకం ఉండదు) ఉంటుంది. ఇలాంటిది ఎక్కడా లేదని వినికిడి.

ఇక అక్కడి నుంచి కొద్దిగా వెనక్కి వచ్చి, తమిళ నాడు వేపు సాగిపోతే తిరుత్తని(70km), కంచి వస్తాయి.

ఇదే విధంగా తిరుపతి నుంచి పశ్చిమ దిశగా వెళ్తే కాట్పాడి, బెంగళూరు వస్తాయి. ఈ వేపు శ్రీనివాస మంగాపురం దగ్గరలో ఉన్న గుడి. ఇక్కడ కొండమీద ఉన్న తిరుమల వెంకటేశ్వరస్వామి కంటే, పెద్ద ఆకారంలో ,అలాంటి రూపంతో వేంకటేశ్వరుడు కనిపిస్తాడు. కొంచెం పక్కగా,ముక్కోటి లేదా తొండవాడ అనేచోట, చిన్న నదీ పాయ పక్కన, శివుడి గుడి ఉంది. అలానే ఒక 60 కి.మీ దూరంలో, కాణిపాక వినాయకుని గుడి, ఉంటుంది. దేవుళ్ళు సినిమా, చూపిన గుడి ఇదే. ఇక్కడ నుండి, సుమారు అంతే దూరం లో, తమిళ నాడు కాట్పాడి పక్కన, గోల్డెన్ టెంపుల్ అని, బంగారు అమ్మవారి గుడి ఉంది. దీన్నే లక్ష్మీనారాయణి గుడి అంటారు.

ఇవండీ సూక్ష్మంగా, తిరుపతి చుట్టూ పక్కల ఉన్న, ప్రఖ్యాత లేదా కొంచెమే తెలిసిన గుళ్ళు.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

నిజమైన సంతృప్తి ఎక్కడ? (05-June-23, Enlightenment Story)

 *నిజమైన సంతృప్తి ఎక్కడ?*

💥💥💥💥💥💥💥💥💥           

ఎందరో చక్రవర్తులు ఈ భూమిని పాలించారు. సుదీర్ఘకాలం పాలన చేశారు. ఎన్నో విజయాలు సాధించారు. ఎన్నో సుఖాలు అనుభవించారు. ఎన్నో అద్భుత నిర్మాణాలు చేశారు. కానీ ఏ ఒక్క మహారాజూ ‘పొందవలసినది పొందాను, అంతా అనుభవించాను’ అనే తృప్తితో గతించలేదు.

దేవతల నుంచి దివ్యాస్త్రాలను పొందిన మహావీరుల గురించి మన ఇతిహాసాలు చెబుతాయి. వీరు బాహ్య శత్రువులను జయించారే తప్ప, అంతఃశత్రువులను గెలవలేకపోయారు.

ఆ మహావీరులెవ్వరూ మానసిక ఉన్నతికోసం దైవ శక్తులను కోరలేదు. వారి తపస్సులో కేవలం విజయకాంక్ష తప్ప మరొకటి లేదు. ఈ దివ్యాస్త్రాలూ నిష్ఫలమైన సందర్భాలున్నాయి.

గొప్పగొప్ప అస్త్రాలే హనుమను ఏమీ చేయలేకపోయాయని రామాయణం చెబుతోంది. అర్జునుడు వరాలకోసం శ్రీకృష్ణుణ్ని ఆశ్రయించలేదు. అందుకే దివ్యజ్ఞానామృతాన్ని (భగవద్గీత) పొందగలిగాడు. 

కోరికల చిట్టాతో దైవాన్ని ప్రార్థిస్తే, ఆ చిట్టా పెరుగుతుందే కానీ దైవబలం పెరగదు.దేనివల్ల ఆనందాన్ని, శాంతిని, సంతృప్తిని పొందుతామో తెలియక, మనిషి ఇంద్రియాల చేతిలో మోసపోతున్నాడు.

వేటగాడు జింకను వేటాడినట్లే, వాంఛలు మనిషిని వేటాడుతున్నాయి. కల్పవృక్షం ప్రసాదించే భోగాలూ క్షణికానందాన్నే ఇస్తాయి. మనిషి ఎన్ని తీర్థాలను, దేవతలను సేవించినా, విషయవాంఛల నుంచి బయటపడనిదే ప్రయోజనం ఉండదు.

’విషయవాంఛలు’ అనే శత్రుసేన ఈ శరీరాన్ని ఆక్రమించింది. ఇంద్రియాలతో పొందే అనుభూతులే వాటి గజబలగం. కామ క్రోధాదులే వాటి ఆయుధాలు. అహంకారం వాటికి సేనాపతి. ఇంద్రియాలు వాటి పతాకం. దేహమనే రాజ్యంలో అంతరంగమనే రాజప్రాకారాన్ని ఇవి చుట్టుముట్టాయి.

’బుద్ధి’ అనే మంత్రిని చీకటి గదిలో బంధించాయి. మనసు అనే రాజును బానిసను చేశాయి. ఎంతటి పరాక్రమశాలి అయినా బాహ్యంగా కనపడే శత్రువులతో తలపడగలడు. కాని, కంటికి కనపడకుండా తనలోనే తిష్ఠవేసిన ప్రత్యర్థులతో పోరాడలేడు. ఇంద్రియ నిగ్రహం, బుద్ధి వికాసంతోనే ఇది సాధ్యమవుతుంది.

ఇంద్రియాలను అరణ్యంతో పోల్చారు పెద్దలు. అడవిని సులభంగా దాటాలంటే దాని గురించి తెలియాలి. అలాగే ఇంద్రియాల కిటుకు తెలిస్తే, ఇంద్రియారణ్యాన్ని సులభంగా దాటగలుగుతాం.

ఇంద్రియాలు మనసును ఎలా మాయచేస్తాయో, మనిషి సూక్ష్మదృష్టితో గమనించాలి. చర్మ సౌందర్యంతో మనసును మోహింపజేసే కళ్లు, వాటి వెనకనున్న రక్తమాంసాలను కప్పిపుచ్చుతుంది. సుగంధాలను అందించే ముక్కు, దుర్గంధమైన దేహంలోనే తాను కూడా ఉన్నాననే స్ఫురణను మరపిస్తుంది. రుచులను మనసుకు అలవరచే నాలుక, వాటి చాటున దాగిఉన్న రోగాలను దాచిపెడుతుంది. ఇక శ్రవణేంద్రియమైతే (చెవులు) మనిషిని సత్కార తిరస్కార మాటలతో మభ్యపెడుతుంది. ఇలా అన్ని ఇంద్రియాలూ మనిషిని తప్పుదోవ పట్టిస్తాయి.

మనిషిలోనే ఉంటూ, మనిషిని నడిపించే ఈ ఇంద్రియాలను మనసు స్వాధీనపరచుకోవాలి. వినటం, చూడటం, స్పృశించటం, గ్రహించటం… ఇలా మనం చేసే అన్ని పనులూ ఇంద్రియ కార్యకలాపాలే. ప్రతి ఇంద్రియానికీ దైవ ప్రవృత్తి, రాక్షస ప్రవృత్తి అనే రెండు స్వభావాలు ఉంటాయి.

సత్కర్మలు, సత్ప్రవర్తన, సత్‌ సాంగత్యం ఇంద్రియాల్లో దైవప్రవృత్తిని నింపుతాయి. అవి ఇంద్రియారణ్యం నుంచి బయటపడే మార్గం చూపిస్తాయి. బుద్ధి వికాసానికి తోడ్పడతాయి.

మనసును ఇంద్రియాలకు దూరంపెట్టి, బుద్ధికి చేరువ చేయాలి. అప్పుడే అంతరంగంలో తిష్ఠవేసిన విషయవాంఛలనే శత్రువులను జయించగలం. ఇంద్రుడు అనే ఇంద్రియాధిపతి (మనసు)కి, బృహస్పతి అనే బుద్ధి హితబోధ చేస్తే… ఆనందం, శాంతి, సంతృప్తి ఎక్కడ లభిస్తాయో మనిషి గ్రహించగలుగుతాడు.✍️

!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Monday 29 May 2023

సనాతన ధర్మం సమాచారం (04-June-23, Enlightenment Story)

 సనాతన ధర్మం సమాచారం 

💥💥💥💥💥💥💥💥💥

*ఏడుగురు అప్సరసల పేర్లు ఏవి ?*

 1.రంభ. 2. ఉర్వశి. 3.మేనక  4.తిలోత్తమ. 5.సుకేశి. 6. ఘ్రుతాచి 7. మంజుగోష .


 సప్త సంతానములు అంటే ఏమిటి ?

1. తటాక నిర్మాణం. 2. ధన నిక్షేపం. 3. అగ్రహార ప్రతిష్ట . 4. దేవాలయ ప్రతిష్ట . 5. ప్రభంధ రచన. 

6. స్వసంతానం (పుత్రుడు).

 

తొమ్మిది రకాల ఆత్మలు  ఏవి ?

 1. జీవాత్మ. 2. అంతరాత్మ. 3. పరమాత్మ.  4. నిర్మలాత్మ. 5. శుద్దాత్మ. 6. జ్ఞానత్మ  7. మహాధాత్మ . 8. భూతాత్మ . 9. సకలాత్మ.


 పదిరకాల పాలు ఏవి ?

 1. చనుబాలు. 2. ఆవుపాలు . 3. బర్రెపాలు 4. గొర్రె పాలు. 5. మేక పాలు. 6. గుర్రం పాలు.

 7. గాడిద పాలు. 8. ఒంటె పాలు. 9. ఏనుగు పాలు. 10. లేడి పాలు.


 యజ్ఞోపవీతం లొ ఎన్నిపోగులు ఉంటాయి?

 యజ్ఞోపవీతం లొ 9 పోగులు ఉంటాయి. ఆ తొమ్మిది పోగుల్లో 9 మంది దేవతలు నివసిస్తారు. వారు  

 1. బ్రహ్మ . 2. అగ్ని. 3. అనంతుడు. 4. చంద్రుడు . 5. పితృ దేవతలు . 6. ప్రజాపతి. 7. వాయువు .

 8. సూర్యుడు . 9. సూర్య దేవతలు .


 అష్టాదశ ఆయుర్వేద సంహితలు ఏవి ?

 1. చరక సంహిత. 2. శూశ్రుత సంహిత. 3. పరాశర సంహిత. 4. హరిత సంహిత. 5. అగ్నివేశ సంహిత. 6. చ్యవన సంహిత. 7. ఆత్రేయ సంహిత. 8. భోజ సంహిత. 9. బృగు సంహిత. 10. బెడ సంహిత. 11. అగస్త్య సంహిత. 12. వరాహ సంహిత. 13. అత్రి సంహిత. 14. నారయణ సంహిత. 15. చంద్ర సంహిత. 16. నారసింహ సంహిత. 17. శివ సంహిత. 18. సూర్య సంహిత.

 గృహ నిర్మాణం ఏ విధంగా చేపడితే సర్వ సుఖాలు పొందుతారు?

 1. ఈశాన్యం లొ పూజలు , పవిత్ర కార్యాలును నిర్వర్తించే విధంగా పూజగది ఉండాలి.

 2. ఆగ్నేయం లొ అగ్నికి సంబందించిన వంటావార్పు చేసుకొనే విధంగా వంటగది ఉండాలి.

 3. నైరుతిలో ఆయుధ సామగ్రి మొదలయిన వాటిని పెట్టుకోవడానికి ఒక గది ఉండాలి.

 4. వాయువ్యం లొ స్వతంత్రబిలాష చిహ్నములు .

 5. తూర్పు దిక్కున సూర్యునికి ప్రీతికరమైన పనులు.

 6. యమస్థానం అయిన దక్షిణం వైపు తలపెట్టి నిద్రించుట.

 7. కుభేర స్థానం అయిన ఉత్తరం వైపు చూస్తూ నిద్రలేచుట.

 8. వరుణ స్థానం అయిన పశ్చిమాన పాడిపశువులు పెంచుటకు తగిన స్థలం ఉండవలెను.

 ఈ విధంగా చేయుటవలన ఆయా దిక్కులలోని ఉన్న దేవతలు సంతృప్తి చెంది ఆ గృహములో నివసించేవారికి సర్వసుఖాలు, సర్వ సంపదలు ఇస్తారు.


 వివిద ఫలాల నైవేద్యం  -  ఫలితాలు

కొబ్బరి కాయ (పూర్ణ ఫలం) - భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యం గా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి.

అరటి పండు - భగవంతుడికి అరటిపండు నైవేద్యం గా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యం గా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్లు నైవేద్యం గా సమర్పిస్తే మద్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి.

నేరెడు పండు - శనీశ్వరునికి నేరెడు పండు నైవేద్యం గా పెట్టి  ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరొగ్య వంతులు అవుతారు.

ద్రాక్ష పండు - భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది.

మామిడి పండు -  మామిడి పండుని నైవేద్యం గా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యం గా పెట్టిన మామిడి పండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యం గా పెట్టి అందరికి పంచి తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు.

అంజూర పండు - భగవంతుడికి నైవేద్యం పెట్టిన అన్జురాపండు ను అందరికి పంచిన తరువాత తిన్నవారికి ఆనారోగ్య భాధలు అన్ని తొలగి ఆరొగ్య వంతులు అవుతారు.

సపోట పండు - సపోట పండు నైవేద్యం గా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంభంద విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి.

యాపిల్ పండు - భగవంతుడికి యపిల్ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు.

కమలా పండు  -  భగవంతుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచిపోయన పనులు సజావుగా పూర్తి అవుతాయి.

పనసపండు -  పనసపండు ని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనము, రోగావిముక్తి కలిగి సుఖంగా ఉంటారు.

పంచవిధ సూతకములు అంటే ఏమిటి ?

1.జన్మ సూతకము. 2. మృత సుతకము. 3. రజః సూతకం . 4. అంటు (రొగ ) సూతకం . 5. శవదర్శన సూతకం . 

దేవాలయాల వద్ద గృహ నిర్మాణం చేయడం దోషమా ?

శివాలయానికి నూరు బారుల దూరం లొపల, విష్ణువాలయముకు వెనక ఇరవై బారుల దూరం లొపల, శక్తి ఆలయముకు సమీపం లొను గృహనిర్మాణం చేయకూడదు . దీనికి వ్యతిరేఖంగా గృహ నిర్మాణం జరిగితే సఖల సంపదలు నశించి కష్టాలపాలు అవుతారు. గుడి దగ్గర ఉన్న ఇళ్ళకు ఏ వైపునైనా , ఏ మాత్రమైనా గుడి నీడ పడిందంటే దరిద్రం, ప్రాణనష్టం వంటి అనేక కష్టనష్టాలు ఎదుర్కోక తప్పదు.

తాంబూలం సేవించేప్పుడు తమలపాకు తొడిమ, చివర్లు ఎందుకు తుంచాలి ?

తాంబులం వేసుకునే ముందు తమలపాకుల తొడిమలు, చివరలు తుంచివేయాలి. ఎందుకంటే తొడిమను తినడం వ్యాదికారకం అవుతుంది. చిగుర్లు పాపానికి ప్రతీకలు అని అంటారు. కనుక తమలపాకు తొడిమలు , చివరలు తుంచిన తర్వాతే తాంబులం వేసుకొవడం ఆరొగ్య ప్రధమం . అలాగే తమలపాకులో ఉండే ఈనెలు బుద్దిని మందగింప చేస్తాయి. అందుకే తమలపాకును నమిలి మొదటగా నోటిలో ఊరిన రసాన్ని ఉమ్మివేయాలి. తొడిమలు, చివరలు తున్చివేసినా ఇంకా అవి తమలపాకులో శేషించి ఉంటాయి కనుక 

 శ్రీ గోవింద రాజస్వామి వారి సన్నిధిలో కుంచం ఉంటుంది ఎందుకు ?

 తిరుపతి శ్రీ గొవింద రాజస్వామి వారి సన్నిదిలో కుంచం ఉండటం నిజమే . దీనికి కారణం ఈ విధంగా చెబుతారు. తిరుమల స్వామి శ్రీ వెంకటేశ్వరస్వామి  కుబేరుని వద్ద అప్పు చేసాడట . దానిని తీర్చుట కొరకు ద్రవ్యాన్ని కుంచం తో కొలిసి ఇచ్చేవారట స్వామివారు. స్వామివారి పక్షాన గొవింద రాజస్వామి ఈ కార్యమును సాగించారని ఒక కధ ప్రచారం లొ ఉంది. ఆ కుంచం తన తలక్రింద ఉంచుకున్నాడు అని ప్రతీతి.

నవగ్రహాలకు సంభందించిన సమిధలు ఏవి ?

1. సూర్యుడు - జిల్లెడు. 2. చంద్రుడు - మొదుగ .3. అంగారకుడు - చండ్ర. 4. బుదుడు - ఉత్తరేణి .

 5. బృహస్పతి - రావి . 6. శుక్రుడు - అత్తి .7. శని - జమ్మి . 8. రాహువు - దర్భ. 9. కేతువు - గరిక .

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

నమస్కార ఫలం (03-June-23, Enlightenment Story)

  *నమస్కార ఫలం*

💥💥💥💥💥💥💥💥💥

ఒక భక్తుడు  దేవునికి ఇలా  నివేదించుకుంటున్నాడు. *స్వామీ నేను చేసిన రెండు తప్పులను క్షమించి కాచు” అని సాష్టాంగపడి నమస్కార పూర్వకంగా అంటున్నాడు*

రెండు తప్పులు ఏమిటి అంటే :             

నేను గత జన్మలో నీకు నమస్కారం చెయ్యలేదు, చేసి ఉన్నట్లయితే నాకు ఈ జన్మ ప్రాప్తించేది కాదు. కాబట్టి ఈ జన్మలో నీకు భక్తి పూర్వకంగా నమస్కరించుకుంటున్నాను.

రెండవ తప్పు: నేను మరొక జన్మలో నీకు నమస్కారం చెయ్యలేను.ఎందుకంటే ఈ జన్మలో నమస్కరిస్తున్నాను కాబట్టి నాకు మరు జన్మ లేదు. 

కాబట్టి

ఉత్తరోత్తరా జన్మల ప్రశ్నే లేదు, కావున నా ఈ రెండు మహాపరాధాలను క్షమించి కాచుకో అని అర్ధిస్తున్నాడు. మన భక్తి కూడా ఇలా వుండాలి, మనమూ చేస్తున్నాము రోజూ నమస్కారం.

అదొక సాధారణ క్రియగా మారింది తప్ప త్రికరణ శుద్ధిగా చేస్తున్నామా? మనం త్రికరణ శుద్ధిగా నమస్కరించినప్పుడు మనము కూడా  ఆ భక్తుని స్థితికి చేరుకుంటాము, కదా...!!

శివభుజంగ స్తోత్రంలో శంకరులు ఇలా అంటారు. నేను పశువు సమానుడను, నువ్వు పశుపతివి, పశువు అయితే కాచవా అంటే నీ వాహనం నంది.

*కావున నువ్వు నన్ను కాచి కాపాడాలి. కాదు నేను పశువు కన్నా హీనుడవందువా నన్ను కాస్తేనే నీకు దరిద్రజన పోషక అన్న నామం సార్ధకమవుతుంది*

నేను అపరాధాల చక్రవర్తిని, నన్ను కాచి నీ నామం స్థిరం చేసుకో, పోనీ పాపులను నువ్వు కాపాడవా అంటే అత్యంత హేయమైన పనులు చేసిన చంద్రుడిని నువ్వు నెత్తిన పెట్టుకున్నావు.

తన భార్యలందరినీ ఒక్కమాదిరి చూసుకుంటానని మాటిచ్చి తప్పి, స్వయంగా తన గురు పత్నినే అపహరించిన చంద్రుడు అత్యంత ఘోరమైన తప్పులు చేసిన వాడు.

అతడినే నువ్వు రక్షించ గలిగినప్పుడు నన్ను బ్రోచి కాపాడు మహేశ్వరా అని వేడుకుంటాడు...

మనం కూడా త్రికరణ శుద్ధిగా ఆయనకు సర్వస్య శరణాగతి చేసి ఆయనను వేడుకుంటే తప్పక కాపాడతాడు, రక్షిస్తాడు, ఉద్ధరిస్తాడు.✍️

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Saturday 27 May 2023

మన దేశం మరియు నగరాల అసలు అందమైన పేర్లు (02-June-23, Enlightenment Story)

 మన దేశం మరియు నగరాల అసలు మరియు అందమైన పేర్లు ఏమిటో మీకు తెలుసా..?💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

1. హిందుస్థాన్, ఇండియా లేదా భారత్ అసలు పేరు - ఆర్యవర్త!

*2. కాన్పూర్ * - అసలు పేరు కన్హాపూర్.

*3. ఢిల్లీ *- అసలు పేరు ఇంద్రప్రస్థ.

*4. హైదరాబాద్ * - అసలు పేరు భాగ్యనగర్.

*5. అలహాబాద్ * - అసలు పేరు ప్రయాగ్.

*6. ఔరంగాబాద్ * - అసలు పేరు శంభాజీ నగర్.

*7. భోపాల్ * - అసలు పేరు - భోజ్‌పాల్!

*8. లక్నో * - అసలు పేరు లక్ష్మణపురి.

9. అహ్మదాబాద్ - అసలు పేరు కర్ణావతి.

10. ఫైజాబాద్ - అసలు పేరు అవధ్.

11. అలీఘర్ - అసలు పేరు హరిగఢ్.

*12. మీరాజ్ - అసలు పేరు - శివప్రదేశ్!

*13. ముజఫర్‌నగర్ * అసలు పేరు లక్ష్మీ నగర్.

*14. షామ్లీ * అసలు పేరు శ్యామాలి.

*15. రోహ్తక్ * అసలు పేరు రోహితాస్పూర్.

*16. పోర్బందర్ *అసలు పేరు సుదామపురి.

*17. పాట్నా *అసలు పేరు పాటలీపుత్ర.

*18. నాందేడ్ * అసలు పేరు నందిగ్రామ్.

*19. అజంగఢ్ * అసలు పేరు ఆర్యగఢ్.

*20. అజ్మీర్ *అసలు పేరు అజయమేరు.

*21. ఉజ్జయిని *అసలు పేరు అవంతిక.

*22. జంషెడ్‌పూర్ *అసలు పేరు కాళీ మతి!

*23. విశాఖపట్నం *అసలు పేరు విజత్రపశ్మ.

*24. గౌహతి * అసలు పేరు ప్రాగ్జ్యోతిష్‌పురా.

*25. సుల్తాన్‌గంజ్ *అసలు పేరు చంపానగరి.

*26. బుర్హాన్‌పూర్ *అసలు పేరు బ్రహ్మపూర్.

*27. ఇండోర్ *అసలు పేరు ఇందూర్.

*28. నశ్రులగంజ్ *అసలు పేరు - భిరుండా!

*29. సోనిపట్ *అసలు పేరు స్వర్ణప్రస్థ.

*30. పానిపట్ *అసలు పేరు పర్ణప్రస్థ.

*31. బాగ్‌పత్ *అసలు పేరు - బాగ్‌ప్రస్థ!

32. ఉస్మానాబాద్అసలు పేరు ధరాశివ్ (మహారాష్ట్రలో).

*33. డియోరియా *అసలు పేరు దేవ్‌పురి.  (ఉత్తరప్రదేశ్‌లో)

*34. సుల్తాన్‌పూర్ *అసలు పేరు - కుష్భవన్‌పూర్

*35. లఖింపూర్ *అసలు పేరు లక్ష్మీపూర్.  (ఉత్తరప్రదేశ్‌లో)

*36. మొరెనా *అసలు పేరు మయూర్వన్.

*37. జబల్పూర్ *అసలు పేరు జబలిపురం

*38. గుల్మార్గ్ *అసలు పేరు గౌరీమార్గ్

39. బారాముల్లా - అసలు పేరు వర్హముల

*40. సోపోర్ *అసలు పేరు సుయ్యపూర్

41. ముల్తాన్అసలు పేరు ములాస్థాన్

*42. ఇస్లామాబాద్ *అసలు పేరు తక్షశిల

*43. పెషావర్ *అసలు పేరు పుర్షపుర

*44. స్కర్డు *అసలు పేరు స్కంద

45. శ్రీనగర్అసలు పేరు సూర్య నగరం

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥


మంత్ర శాస్త్రము (01-June-23, Enlightenment Story)

*మంత్ర శాస్త్రము*

💥💥💥💥💥💥💥💥💥  

ఒక ఊర్లో ఒక శాస్త్రి గారు వుండేవారు ఆయన పరమ నిష్ఠాగరిష్టుడు. వాళ్ళ తాత ముత్తాతల నుంచి వస్తున్న శివ పంచాయతనం వుండేది. శాస్త్రి గారు రోజూ నమకచమకములతో అభిషేకము చేసి శ్రద్దగా పూజ చేస్తూ వుండేవారు.

ఒకరోజు వాళ్ళ ఇంటి ఆవిడ గారెలు చేసి, వాళ్ళ పాలేరు కు నాలుగు పెట్టినది. వాడు కమ్మగా తిని, అమ్మా ఇంక నాలుగు వడలు పెట్టు అమ్మా అన్నాడు. ఇంటి ఆవిడ “లేవురా అయిపోయినాయి” అన్నది.

అదేంటి అమ్మగారు ఇంట్లో ఇంకా 23 గారెలు పెట్టుకొని లేవు అంటారు అని అన్నాడు.ఆవిడ వంటింట్లోకి వెళ్లి లెక్క పెడితే సరిగ్గా 23గారెలు వున్నాయి. నీకెలా తెలుసురా అని అడిగినది.తెలుసులెండి అని వాడు అన్నాడు. ఈ విషయాన్ని తన భర్తకు తెలిపినది ఆ మహా ఇల్లాలు. శాస్త్రి గారు పాలేరును నిలదీసినాడు ..నీకు ఎలా తెలుసు అని. తెలుసు లెండిగురువు గారు అన్నాడు. వదల లేదు శాస్త్రి గారు.

అదొక విద్య లెండి నాకు మా అయ్య నుంచి వచ్చినది,నాకు ఒక యక్షిణి చెవులో చెబుతుంది ఇదంతా అన్నాడు.ఆ రోజు రాత్రికి శాస్త్రి గారికి నిద్ర పట్టలేదు. ప్రక్కరోజు పాలేరును అడిగాడు. ఒరేయ్ ఇన్ని రోజుల నుంచి నేను పూజ చేస్తున్నాను, నాకు ఏ విద్యరాలేదు, ఏ శక్తి రాలేదు, నీకు ఈ విద్య ఎలా వచ్చినది? ఆ మంత్రము ఏమిటో నాకు చెప్పరా అని అడిగినాడు.

విధి లేక పాలేరు ఆ మంత్రాన్ని (కర్ణ పిశాచి) మంత్రమును గురువు గారికి చెప్పినాడు. ప్రక్కరోజు గురువు గారు శ్రద్దగా ఆ మంత్రాన్నిపఠించినాడు. కర్ణ పిశాచి ఇంటి బయట నుంచి పలికినది.శాస్త్రి గారూ అని పిలిచినది. ఏమి కావాలి అని అడిగినది.

గురువు గారు ఇంట్లో నుంచి ఎవరూ అని అడిగినాడు. నేను కర్ణ పిశాచిని (యక్షిణి) మీ ఇంట్లోకిరావాలంటే ఆ పూజా మందిరములోని దేవతామూర్తులను బయట పడెయ్యండి, నేను లోపలి వస్తాను అని అన్నది. శాస్త్రి గారి గుండె గుభేలు మన్నది. అప్పుడు అర్ధమైనది. ఒరేయ్ మా ఇంట్లో పూజా మందిరములోని దేవతా మూర్తులు ఎంత శక్తివంతమైనవో, వాటి వలనే గదా ఈ పిశాచము లోనికి రాలేదు. 

ఇలా ఎన్ని రోజుల నుంచి నన్ను నా కుటుంబాన్నిదుష్ట శక్తుల నుంచి కాపాడు తున్నాయో గదా,ఇన్నాళ్ళు నాకు తెలియ లేదు, పెద్దలు ఇచ్చిన నిజమైన ఆస్తి ఇదే కదా అని, నీవూ వద్దు, నీమంత్రము వద్దు అని ఆ పిశాచాన్ని వెళ్లి పొమ్మన్నాడు. తన పూజా మందిరములోకి వెళ్లి ఆ పరమ శివుని కాళ్ళ మీద పడి కృతజ్ఞతతో “ ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ నమః” అని చెంపలు వేసుకొన్నాడు. మంత్ర విద్య వున్నది నమ్మకము శ్రద్ధ అవసరము దేనికైనా.

పూజా మందిరములో వున్న విగ్రహాలు పాతవైనా, అరిగి పోయినా మీ తాత ముత్తాతలు పూజించినవి అవి. వాటిల్లో ఎంతో శక్తి దాగి వుంటుంది. వాటిల్ని పారేయకండి. భక్తితో ఒక్కపుష్పం పెట్టండి. అవి చైతన్య మౌతాయి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుతాయి.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

ఆలయాలలో దానం చేయవలసిన వస్తువులు (31-May-23, Enlightenment Story)

 ఆలయాలలో దానం చేయవలసిన వస్తువులు

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

👉ఎక్కడైనా కొత్తగా దేవాలయం నిర్మిస్తుంటే.. ఆ ఆలయానికి ఏమి సాయం చేస్తే బాగుంటుందని ఆస్తికులు ఒక్కోసారి సందిగ్ధంలో పడుతుంటారు. దేవాలయానికి ఏ వస్తువు ఇస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందో సూటిగా వివరించి చెబుతుంది విష్ణు ధర్మోత్తర పురాణం తృతీయ ఖండం మూడు వందల నలభై ఒకటో అధ్యాయం. 

👉దేవాలయం అనేది ఒక పుణ్య వ్యవస్థ. దాని నిర్మాణ నిర్వహణలకు అందరూ సహకరిస్తేనే ఆ వ్యవస్థ చక్కగా కొనసాగుతూ ఉంటుంది. దర్శనానికి వెళ్ళిన వారికి శాంతిని ప్రసాదించేదిగానూ ఉంటుంది. అందుకే ఎవరికి చేతనైనంతలో వారు దేవాలయాలకు సహాయ సహకారాలను అందిస్తూ అవసరమైన వాటిని దానం చేయాలంటున్నాయి పురాణాలు.

👉ఆలయ గోడలకు సున్నం కొట్టించడం,

👉ఆలయ ప్రాంగణాన్ని చక్కగా ఊడ్చి ముగ్గులు పెట్టి అందంగా తీర్చిదిద్దటంలాంటి

👉శ్రమదానాలకు శ్రీమహావిష్ణులోక ప్రాప్తి లాంటి పుణ్యఫలాలను చెప్పాయి పురాణాలు.

👉అలాగే ఆలయానికి శంఖాన్ని దానం చేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.

👉ఆ తరువాత మానవజన్మ ఎత్తాల్సి వచ్చినా కీర్తిమంతుడే అవుతాడు.

👉గంటను దానం చేస్తే మహా గొప్ప కీర్తిని పొందుతాడు.

👉గజ్జలను, మువ్వలను ఇచ్చినవాడు సౌభాగ్యాన్ని పొందుతాడు.

👉చల్లదనం కోసం ఆలయ ప్రాంగణంలో పందిళ్ళు నిర్మిస్తే కీర్తి పొందటానికి,

👉ధర్మబుద్ధి కలగటానికి కారణమవుతుంది.

👉పైన ఎగిరే పతాకాలను ఇచ్చినవాడు సకలపాపాల నుంచి విముక్తుడై వాయులోకాన్ని పొందుతాడు. ఆ పతాకాలు ఆలయానికి ఎంత శోభను కూర్చుతుంటే అంత యశస్సును దాత పొందుతాడు.

👉చాందినీలు ఏర్పాటు చేసిన వాడు గొప్ప సుఖాలకు పాత్రుడవుతాడు.

👉ఆలయంలో వేదికను నిర్మించి ఇచ్చినవాడు పృథ్వీపతి అవుతాడు. 

👉మనోహరమైన కుంభాన్ని ఇచ్చినవాడు వరుణలోకాన్ని,

👉నాలుగు కలశాలను దానం ఇచ్చినవాడు నాలుగు సముద్రాల పర్యంతం ఉన్న భూమి మీద, అంతసుఖాన్ని అనుభవిస్తాడు.

👉కమండలువును ఆలయానికిస్తే గోదాన ఫలితం దక్కుతుంది.

👉వట్టివేళ్ళతో తయారు చేసిన చాపల లాంటివి ఇస్తే సర్వపాపాలు నశిస్తాయి.

👉ఆలయానికి సమకూరిన గోవులను మేపటానికి గోపాలకుడిని ఇచ్చినా పాపవిముక్తే ఫలితం.

👉చామరాలను దానం చేస్తే గొప్ప ధనప్రాప్తి కలుగుతుంది.

👉దేవుడికి ఆసనాన్ని సమకూరిస్తే సర్వత్రా ఉత్తమ స్థానం లభిస్తుంది.

👉పాదపీఠ ప్రదానం ఉత్తమగతికి సోపానం.

👉ధ్వజ సమర్పణం లోకంలో గొప్పకీర్తిని పొందటానికి వీలు కల్పిస్తుంది.

👉దేవుడికి ముఖ లేపనాలను అంటే ముఖానికి అలంకిరంచే గంధ ద్రవ్యాలను ఇచ్చినవాడు ఉత్తమరూప సంపత్తిని పొందుతాడు.

👉దర్పణం (అద్దం) దానం చేసినా మంచిరూపం లభిస్తుంది.

👉దేవుడి పరిచర్యల కోసం చిన్న చిన్న పాత్రలను ఇస్తే సర్వకామ సమృద్ధమైన యజ్ఞం చేసినంత ఫలం దక్కుతుంది.

👉ధ్యానం, సశ్యాలు, బీజాలు, బంగారం, వెండి, ఇతర లోహాలు ఇచ్చినవాడు అనంతరం పుణ్య ఫలితాన్ని పొందుతాడు.

👉వెండి మంచి రూపానికి, బంగారం సర్వకోరికలు సిద్ధించటానికి దానం చేస్తుంటారు.

👉పాడి ఆవును ఇస్తే గోలోకప్రాప్తి,

👉బండిని లాగేఎద్దునిస్తే అంతకు పదింతలు పుణ్యఫలం లభిస్తాయి.

👉మేకలు, గొర్రెలు, బర్రెలు, దున్నలు, ఒంటెలు, కంచరగాడిదలు లాంటివి ప్రదానం చేస్తే మామూలు ద్రవ్య దాన ఫలం కన్నా వేయింతల ఫలం లభిస్తుంది.

👉వన్యమృగాలు, పక్షులదానం అగ్నిష్ఠోమయాగ ఫలితాన్ని ఇస్తుంది.

👉పచ్చని పతాకాలతో కూడిన గరుడ ధ్వజాన్నిస్తే ఇంద్రలోకప్రాప్తి కలుగుతాయి.

👉నీలపతాకాలతో కూడిన తాలధ్వజం సమర్పిస్తే ఉత్తమలోకాలు ప్రాప్తిస్తాయి.

👉ఆలయానికి మహాద్వార తోరణాలను ఇచ్చినవాడికి ఉత్తమలోకాల వాకిళ్ళు తెరచి సిద్ధంగా ఉంటాయి.

👉శయన, ఆసనదాతకు వైకుంఠంలో శాశ్వత స్థితి ఫలం, ఉత్తరీయాన్ని సమర్పిస్తే సర్వకామ ఫలప్రాప్తి,

👉దేవాలయంలో శిల్పాలు, చిత్రాలు లాంటివి కావలసిన పదార్థాలను వాద్య పరికరాలను ప్రదానం చేసినవాడు దేవసేనలో స్థానాన్ని పొందుతాడని విష్ణు ధర్మోత్తర పురాణం పేర్కొంటోంది.

👉దేవుడిని ఆశ్రయించి ఉండేవాడికి ఏ కొద్దిపాటి ఇచ్చినా దైవానుగ్రహపాప్తికి కారణమవుతుంది.

👉ఈ వరుసలోనే ధాన్యాలు, సశ్యాలు, రసాలు, శాకాలు, ఇచ్చిన వారికి పుణ్యంతో పాటు శోకరహితస్థితి కలుగుతుంది.

👉వంట పాత్రలను ప్రదానం చేసినా పుణ్యఫలమే.

👉పుష్పవృక్ష, తోటల ప్రదానం గ్రామాధిపత్యానికి,

👉జలాశయ నిర్మాణం, లాంటివన్నీ భగవత్‌కృపను పొందటానికి కారణాలవుతాయని విష్ణుధర్మోత్తర పురాణం పేర్కొంటోంది.

👉దేవాలయం ఒక పవిత్ర స్థానం. భక్తులు అక్కడ మనశ్శాంతిని పొందేందుకు వీలుంటోంది. అంతటి ఉత్తమ వ్యవస్థకు ఎవరికి చేతనైనంతలోవారు సహకరిస్తే ఆ పవిత్ర ఉత్తమ వ్యవస్థ చిరకాలం నిలిచి ఉంటుందన్న లక్ష్యంతోనే ఇలా దేవాలయాలు దాన విశేషాలను పురాణాలు పేర్కొంటున్నాయన్నది అంతరార్థం.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

హృదయ సాక్షి (30-May-23, Enlightenment Story)

 *హృదయ సాక్షి*

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

ఆచార్య సద్బోధన:

"సత్యంవద, ధర్మంచర" అని శృతి బోధించింది.

సత్యము చెప్పు, ధర్మంగా ఉండు. ఏమిటీ ధర్మ మార్గము?

మన హృదయ సాక్షిగా ప్రవర్తించడమే నిజమైన ధర్మము.హృదయం (Conscience ) లో ఆవిర్భవించిన భావాలు వాక్కులో ఉచ్ఛరించాలి, వాక్కులో ఉచ్ఛరించినది హస్తము తో ఆచరించాలి, ఇదియే నిజమైన ధర్మము.

సత్యము, ధర్మము, ప్రేమ, ఇవన్నీ హృదయానికి సంబంధించిన గుణములు.

క్రోధము, ద్వేషము, అసూయ, ఇవన్నీ మనస్సునకు సంబంధించిన గుణములు.

కనుక మనస్సును అనుసరింపకుండ హృదయాన్ని అనుసరించడమే నిజమైన సాధన.

అంతే కాని, జపమాల త్రిప్పు కోవడం సాధన కాదు.ఇట్టి సాధనలు తాత్కాలిక మైన తృప్తినే ఇస్తాయి. కాని, శాశ్వత మైన ఆనందాన్ని అనుభవించాలంటే హృదయాన్ని అనుసరించాలి!

హృదయ మనగా, అశాశ్వతమైన గుండె కాదు,  ఇది దివ్యమైన చైతన్యమే! ఇది దేహానికి మాత్రమే పరిమితము కాదు. లోపల వెలుపల సర్వత్రా  ఎప్పుడు ఉంటుంది,

దీనినే శృతి…

 "అంతర్బహిశ్చ  తత్సర్వవ్యాప్య  నారాయణ స్థితః"  అన్నది.✍️

!!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!!

!!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!!

!!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!!

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

బూడిద గుమ్మడికాయ విశిష్టత (29-May-23, Enlightenment Story)

 ✨ బూడిద గుమ్మడికాయ విశిష్టత

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

కాలభైరవ స్వరూపమైన బూడిద గుమ్మడికాయను శుక్రవారం  రోజు గానీ.. ఆదివారం రోజు గానీ  ఇంటికి ఎందుకు కట్టాలి...!!

ఒకవేళ మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టకపోతే వెంటనే సూర్యోదయ సమయంలో ఒక తెల్లగుమ్మడికాయ తీసుకొని దానికి పసుపు,కుంకుమ రాసి దాన్ని ఇంటి ముందు ఉట్టిలో వేలాడదీయండి.

ముందు రోజు సాయంత్రం తెచ్చుకొని తరువాత రోజు సూర్యోదయ సమయంలో దాన్ని ఇంటి ముందు అలంకరించండి. రెండు అగరబత్తీలు వెలిగించి దానికి ధూపం చూపించండి.

ఇంటి ముందు గుమ్మడికాయ ఉండటం వలన ఇంట్లోకి వచ్చేటటువంటి నకారాత్మక శక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీని అది రాకుండా అడ్డం పడుతుంది.మన ఇంటి మీద చూపించేటటువంటి చెడు ప్రభావాన్ని అది లాక్కుంటుంది .

ఒకవేళ మీరు తరచుగా బూడిద గుమ్మడికాయలు కడుతున్నప్పుడల్లా కొద్ది రోజులకే కుల్లిపోతున్నాయంటే మీ ఇంటి మీద ఎక్కువగా నరఘోష, నరద్రుష్టి, నరపీడ ఉందని గుర్తుంచుకోండి. మీకు తగలవలసినటువంటి ఆ దోషాన్ని ఆ గుమ్మడికాయ లాక్కొని చెడిపోతుందని గమనించాలి.

వెంటనే ఆ పాడైపోయినటువంటి గుమ్మడికాయను పారేసి వేరొక గుమ్మడికాయని కట్టాలి. ఇంట్లో అద్దెకు నివసిస్తున్న వారైనా కూడా ఇంటి ద్వారబంధానికి పైన ఈ యొక్క గుమ్మడికాయను ఖచ్చితంగా కట్టుకోవాలి.

గుమ్మడికాయ ఇంటికి ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు. ఇంటి ముందుకు వచ్చేటటువంటి దోషాలు అంటే నరఘోష,నరపీడ,నరదృష్టి, నరశాప నకారాత్మక శక్తిని అంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు ఉంది కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకండి.

పాడైపోయినప్పుడల్లా కొత్తది కట్టేయాలి.ఇప్పటివరకు అసలు గుమ్మడికాయను కట్టకపోతే వెంటనే కొత్త గుమ్మడికాయను తీసుకువచ్చి కట్టేయండి.  ఇలా శుక్రవారం  రోజు గానీ.. ఆదివారం రోజు గానీ కట్టాలి.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Friday 26 May 2023

ప్రపంచ మొదటి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ (28-May-23, Enlightenment Story)

 Bank Training Centre

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

ప్రపంచపు మొదటి బ్యాంకింగ్  వ్యవస్థ గురించి విద్యార్థులకు క్లాసు పూర్తి చేసిన తర్వాత ఒకసారి శర్మగారు బ్యాంకింగ్ సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే అడగమని చెప్పారు. ఒక విద్యార్థి లేచి ప్రపంచంలో పురాతనమైన బ్యాంకింగ్ వ్యవస్థ బ్రిటిష్ బ్యాంకింగ్ వ్యవస్థ ఏనా అని అడుగుతాడు. 

దానికి చిరునవ్వుతో శర్మగారు ఇలా సమాధానం చెప్పారు. ప్రపంచపు తొలి బ్యాంకింగ్ వ్యవస్థ భారతదేశం లోనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో మన తిరుపతి నగరమే దానికి మూలస్థానం

The First Banking Transaction :

కలియుగ ప్రారంభంలో వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు.సుమారు 5000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ప్రపంచ మొదటి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ గా చెప్పుకోవచ్చు.  

The First Banker:

శ్రీనివాసడికి అప్పిచ్చిన కుబేరుడిని మించిన బ్యాంకర్ ఎవరున్నారు. 

The First Promissory Note :

కుబేరుడికి శ్రీనివాసుడు రాసిన ప్రామిసరీ నోట్ ప్రపంచంలోని 

The First Bill of Exchange:

మొట్టమొదటి బిల్ ఆఫ్ ఎక్సేంజ్ అని చెప్పుకోవచ్చు.

The Good loan repayment

 శ్రీనివాసునికి ఉన్న వడ్డీ కాసులవాడు అనే పేరు  అప్పటికే  ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థని ఋజువు చేస్తుంది. తను సంపాదించి క్రమం తప్పకుండా లోన్  రిపేమెంట్ చేస్తున్న ఆ వెంకటేశ్వర స్వామి అప్పు తీసుకున్న వారందరికీ ఆదర్శవంతుడు. ఇలా ఈనాడు మనం చెప్పుకుంటున్న చెలామణి లో ఉన్న ఎన్నో పథకాలు ఆ కాలంలోనే అమలు జరిగాయి. 

The First lease Agreement:

వరాహ స్వామి దగ్గర స్థలం లీజుకి తీసుకుని 

The First Mortgage:

ఆ లీజ్ హోల్డ్ రైట్స్ మీద శ్రీనివాసుడు కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు. 

The First Income source certificate:

తనకి రాబోయే ఆదాయం హామీగా చూపించాడు. అంటే అసైన్మెంట్ ఆఫ్ ఫ్యూచర్ ఇన్కమ్ అన్నమాట.  కుబేరుడిని మించిన బ్యాంకరు, శ్రీనివాసుని మించిన హై క్రెడిట్ రేటింగ్ బారోయరు ప్రపంచంలో ఎక్కడ ఉంటారు? 

ఇలా బ్యాంకింగ్ సంబంధించిన ఎన్నో విషయాలు మనకి తెలియజేసే తిరుపతిని ప్రతి బ్యాంకు ఉద్యోగి తప్పకుండా తెలుసుకోవాలి అని శర్మ గారు తన సమాధానం పూర్తి చేయగానే విద్యార్థులందరూ ఆశ్చర్యంగా, వేద కాలం నాటి బ్యాంకింగ్ వ్యవస్థ - ఈనాటి బ్యాంకింగ్ వ్యవస్థ ఒకటే కదా అని గోవిందా గోవిందా అంటూ గోవింద నామస్మరణ చేశారు. 

*గోవింద నామస్మరణతో క్లాస్ అంతా ప్రతిధ్వనించింది*

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Thursday 25 May 2023

మధురై మీనాక్షీ అమ్మవారి అద్భుతమైన లీల - పీటర్ పాదుకలు (27-May-23, Enlightenment Story)

 *మధురై మీనాక్షీ అమ్మవారి అద్భుతమైన లీల*

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

బ్రిటీష్ కాలంలో తమిళనాడులో మధురై జిల్లాకి పీటర్ అనే వ్యక్తి కలెక్టర్ గా ఉండేవారు. ఆయన కార్యాలయానికీ ఇంటికీ మధ్యలోనే మీనాక్షీ అమ్మవారి గుడి ఉండేది. పీటర్ ప్రతిదినం తన కార్యాలయానికి అమ్మవారి దేవాలయం ముందునుండి తన గుర్రంమీద వెళ్ళేవారు. అలా గుడి ముందునుండి వెళుతున్న సమయంలో పీటర్ తన కాళ్ళకున్న చెప్పులు తీసి గుర్రం దిగి నడచి వెళ్ళేవారు భక్తిగా.

ఒక రోజు రాత్రి ఉరుములు మెరుపులతో పెద్ద గాలితో వర్షం కురుస్తోంది. పీటర్ తన ఇంట్లో పడుకుని ఉండగా పెద్ద శబ్దం వినిపించింది.ఉలిక్కిపడి లేవగానే, ఎదురుగా ఒక స్త్రీ వంటినిండా బంగారు ఆభరణాలతో నిలుచుని ఉంది. పీటర్, ఎవరమ్మా నువ్వు అని అడుగుతుండగానే ఆ స్త్రీ బయటకు వెళ్ళిపోతూ, రా రా అని పీటర్ ను బయటకు పిలిచి, కనీసం కాళ్ళకు పాదరక్షలు కూడా లేకుండా ఆ జోరు వర్షంలోనే వడి వడిగా నడుస్తూ కొంతదూరంలో అదృశ్యమవడం, 

ఇంటి నుంచి బయటకు వచ్చిన పీటర్ గమనించి వెనుతిరిగిన మరుక్షణంలోనే, అతని నివాసం ఒక్కసారిగా కుప్పకూలిపోవడం ఒకేసారి జరిగింది. నిర్ఘాంత పోయిన పీటర్ కొద్దిసేపటికి తేరుకుని, ఆ అర్ధరాత్రి వచ్చి తనను బయటకు పిలిచి ఈ ఘోర ఆపద నుండి కాపాడినది, సాక్షాత్తూ ఆ మధుర మీనాక్షీ అమ్మవారే అని గ్రహించి, చేతులెత్తి నమస్కరించిన కలెక్టర్ పీటర్.

ఆ మరునాడు భక్తితో ఆలయానికి వెళ్ళి అర్చకులను సంప్రదించి, రాత్రి జరిగిన ఆ ఉదంతాన్ని వారికి తెలియ చేస్తూ, అయ్యా రాత్రి నాకు దర్శనమిచ్చిన మీనాక్షీ అమ్మవారి కాళ్ళకు పాదరక్షలు లేవని గమనించాను. నేను అమ్మవారికి బంగారు పాదరక్షలు బహుమతిగా ఇవ్వదలిచాను. మీరు అంగీకరించి నాకు ఈ అవకాశాన్ని ఇవ్వగలరు అని వారి అంగీకారంతో.

80 వజ్రాలు 

412 కెంపులు

72 పచ్చలు తో

వజ్ర వైఢూర్య సహితమైన అత్యంత విలువైన స్వర్ణ పాదుకలను ఆ మధుర మీనాక్షీ తల్లికి సమర్పించారు కలెక్టర్ పీటర్. పీటర్ పాదుకలుగా పిలువబడే ఆ పాదుకలను ఇప్పటికీ అమ్మవారి ఆలయంలో ప్రతి ఏటా జరిగే "చిత్ర ఫెస్టివల్" సందర్భాన అమ్మవారి ఉత్సవ మూర్తి పాదాలకు అలంకరించి ఊరేగింపు నిర్వహిస్తారు. ఆనాడు సత్య తార్కాణంగా జరిగిన ఈ సన్నివేశం, అన్య మతస్థుడైనా, భగవంతునిపై ఆయనకున్న భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిపోయింది.

ఈ ఆల్బంలో మధుర మీనాక్షీ అమ్మవారి సంపూర్ణ క్షేత్ర దర్శనం , ఆలయ చరిత్ర మరియు స్థలపురాణం ఉన్నాయి .


*ఓం శ్రీ మాత్రే నమః -  అమ్మవారి అనుగ్రహం పొందుదాం*

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

Wednesday 24 May 2023

ముముక్షత్వం - మోక్షానికి దారి (26-May-23, Enlightenment Story)

 ముముక్షత్వం - మోక్షానికి దారి 

💥💥💥💥💥💥💥💥💥💥💥

విడుదల అంటే- విముక్తి, మోక్షం, స్వేచ్ఛ. జైలు నుంచి ఖైదీ బయటికి వచ్చి స్వేచ్ఛగా జీవించడం. ఆధ్యాత్మికపరంగా జీవుడు దేహబంధం నుంచి, సంసారబంధం నుంచి విడుదల కావడం. బంధాల నుంచి తొలగాలనే దాన్నే 'ముముక్షత్వం' అంటారు. ఇది మోక్షానికి దారి.

ప్రకృతిలోని సమస్త జీవరాశి సృష్టి ప్రసాదించిన మేరకు సహజత్వాన్ని వీడకుండా ఆహార సంపాదన, ఆత్మరక్షణ, సంతానోత్పత్తి జరుపుకొంటాయి. వాటికదే ప్రకృతి ధర్మం.

అన్ని జీవరాశుల్లోను ఉన్నతమైన సంస్కారవంతమైన జీవి నరుడు. ప్రకృతి ప్రసాదించిన చిత్తం, మనసు, బుద్ధి, జ్ఞానం, అహంకారం, విచక్షణ కలిగిన ఉత్కృష్టమైన జీవి. వీటితోపాటు నవ్వు, రాగద్వేషాలు, కామ-క్రోధాలు, ఈర్ష్య అసూయలు, జాలి, సిగ్గు, అనుమానం, అసహ్యం, కులం, శీలం, జాతి అనే బంధాలను; భక్తి, రక్తి, వైరాగ్యం, ముక్తి అనే పారమార్థిక సంపదనూ సృష్టికర్త ప్రసాదించాడు. ఇంతటి ధన్యజీవి అయిన మానవుడు నేడు ఎంతవరకు జీవన్ముక్తుడు కాగలగుతున్నాడన్నది ప్రశ్నార్థకమే!

గతంలో యోగులు, రుషులు, వేదాంతులు, పురాణ పురుషులు, సత్య, ధర్మాల్ని పాటిస్తూ ఎరుకతో మరుజన్మ లేని స్థితిని పొందినట్లు మన శాస్త్ర పురాణ ఇతిహాసాలు ఘోషిస్తున్నాయి. తమ జ్ఞానసంపదతో ఇంద్రియ నిగ్రహంతో, చిత్త వృత్తుల్ని నిరోధిస్తూ, అరిషడ్వర్గాల్ని జయించి పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలను సక్రమరీతిలో సాధించి చరితార్థులైనారు.

ప్రకృతిలో మార్పు సహజం. దానికి ఈ కలికాలం కూడా మినహాయింపు కాదు. జనాభా పెరిగింది. ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిపోయింది. పోటీతత్వం ఇంతలంతలై జీవన సమస్య భారమైంది. నేటి మానవుడు భౌతికపరంగా, విజ్ఞానపరంగా అభివృద్ధి సాధించినప్పటికీ- మానసిక శాంతి లేక కొట్టుమిట్టాడుతున్నాడు. ఒంటరిగా, కంటినిండా నిద్రలేక, సంపాదనే ధ్యేయంగా అహరహం శ్రమిస్తూ యాంత్రిక జీవనం సాగిస్తున్నాడు.

ఈ సుడిగుండాల నుంచి మానవుడు బయటపడి మానసిక స్వేచ్ఛతో తిరగలేడా? అంటే తప్పక విడుదల కాగలడు! ముందుగా మనిషి సంపాదన తప్పు కాదని, సంసారం తన ధర్మమని, అతి మాత్రం కూడదని, ఇవేవీ శాశ్వతం కాదని, పుట్టిన ప్రతిజీవీ గిట్టక తప్పదని మామూలు లోకజ్ఞానంతోనైనా గ్రహించాలి. అయితే వచ్చిన చిక్కల్లా అతిగా సంసారబంధాలు పెంచుకోవడం, తానెప్పటికీ శాశ్వతుడననుకోవడం- అనుకొని అక్రమాలు చేసి కూడబెట్టడం కూడదని తెలుసుకోవాలి. ఈ ఇరుక్కున్న బంధాల నుంచి మానసికంగా బయటపడటమే విడుదల, ముక్తి, మోక్షం.

భవబంధనాల నుంచి విడుదల కావడం అంత తేలికైన పనికాకపోయినా అసాధ్యం మాత్రం కాదు. 'గృహాశ్రమ' జీవనంలో ఉంటూనే, తామరాకుపై నీటిబొట్టులా, అంటీ అంటని రీతిలో విరాగత్వం పొందవచ్చు. అక్కరలేనివి కూడబెట్టే పద్ధతికి స్వస్తి పలికి ఆత్మతృప్తితో జీవించడం ఉత్తమం. గీతాచార్యుడు సెలవిచ్చిన భక్తి, జ్ఞాన, కర్మ, యోగమార్గాలు ముక్తికి సోపానాలు. అందులో యోగమార్గమైన ధ్యానం ద్వారా చిత్తవృత్తుల్ని నిరోధించి, ఇంద్రియ ప్రేరేపితమైన కోర్కెల్ని అదుపుచేస్తే ఈ బంధాలనుంచి విడుదలై మానసిక స్వేచ్ఛతో ఇక్కడే స్వర్గసౌఖ్యాలు పొందవచ్చు. నరకం, స్వర్గం రెండూ మన బుర్రలోనివే. సాధన ద్వారా అరిషడ్వర్గాలను జయించి మానవులంతా స్వేచ్ఛాజీవులై బ్రహ్మనంద భరితులు కావాలి. తద్వారా మానవతకు మహోన్నత స్థానం కల్పించాలని ఆశిద్దాం.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Tuesday 23 May 2023

తొమ్మిది ఋణాలు (25-May-23, Enlightenment Story)

తొమ్మిది ఋణాలు

🌷🙏🌷🌷🙏🌷🌷

మానవులు ఎల్లప్పుడూ పితృఋణం, మాతృఋణం, పుత్రికాఋణం, స్త్రీఋణం, సోదరఋణం, దైవఋణం, ఋషిరుణం, దానఋణం, గురుఋణం ఈ తొమ్మిది ఋణాలను తెలిసి కానీ తెలియక కానీ తీర్చకపోతే ఎల్లప్పుడూ ఋణబాధలు వేధిస్తూ ఉంటాయి. ఉన్నత స్థితి కలుగదు.

1. తల్లి ఋణం :- తల్లితో విభేదాలుంటాయి. వీరు తల్లిని బాధించకూడదు. పేదవారికి పాలు, బియ్యం, దానం చేయుట వల్ల మేలు జరుగుతుంది.

2. పితృఋణం :- తల్లితండ్రులు గతించినచో వారికి చేయవలసిన కర్మలను సకాలంలో ఆచరించక పోవటం వల్ల విద్య, ఉద్యోగం. వ్యాపార అభివృద్ధి ఉండదు.

3. పుత్రికాఋణం :- పుత్రికను బాధించటం, కూతురు ఆస్తిని అనుభవించటం వల్ల అవమానాలు, ధననష్టం, ఒంటరి జీవితం కలుగుతాయి.

4. స్త్రీ ఋణాలు :- పరస్త్రీలను వ్యామోహించి బాధించటం, సంగమించటం, వారిని వదిలివెయ్యటం, తరచు గుర్తుచేసి దుర్మార్గంగా బాధించటం, భార్యను బాధించటం, కొట్టడం, ఆమెను పస్తులుంచటం, ఆమెను బయటకు గెంటివేయుట, నిందలు ప్రచారం చేయుట, పరస్త్రీలను బల్కారించటం, కామవాంఛలకు గురిచేయటం, మధ్య వయసునుండి అకాల మరణ భయం, దారిద్ర్యం కలుగుతాయి. గర్భవతులను కూడా బాధించరాదు.

5. సోదర ఋణం :- తన రక్త సంబంధీకుల ధనం వాడుకోవటం వారిని బాధించటం, వారి ఆస్తులను సక్రమంగా పంచక తాననుభవించుట మోసం చేయుట వీటివల్ల కొంత కాలానికి తన పిల్లలు దరిద్రం అనుభవిస్తారు. మనఃశ్శాంతి ఉండదు. జీవిత చరమాంకంలో దీనస్థితి కలుగుతుంది. వంశక్షయం కలుగుతుంది.

6. దైవ ఋణం :- దైవాన్ని నిందించుట, జంతుహింస చేయుట, దేవాలయ ఆస్తులను అనుభవించుట వీటివల్ల సంతాననష్టం ఉంటుంది. అంగవైకల్యం కలిగిన సంతానం కలుగుతారు. శారీరక బలహీనత కలుగుతుంది.

7. ఋషి ఋణం :- తమ వంశఋషిని సేవించ లేకపోవటం, సాధు సన్యాసుల పట్ల తెలిసో తెలియక అమర్యాదగా ప్రవర్తించుట, ఋషిప్రోక్తమైన మంత్రాలను అవహేళన చేయుట వల్ల కలుగుతుంది. దీనివల్ల మూర్ఖత్వం, ఆవేశం, సౌఖ్యలేమి కలుగుతుంది.

8. దాన ఋణం :- ఒకరికి దానం చేస్తానని చేయక పోవుట, దానం చేసి ప్రతిఫలం కోరుట, చేసిన దానిని తిరిగి తీసుకొనుట వల్ల ఈ ఋణం ఏర్పడుతుంది. ఇటువంటి వారు తరచు వివాదాలకు గురవుతూ ఉంటారు. వ్యసన పీడ కలుగుతూ అపకీర్తి కలుగుతుంది.

9. గురు ఋణం :- గురువులను దూషించుట, అంతకు సమానమైన వారిని నిందించుట. దీనివల్ల మిత్రభేదం, ఉపాధి కోల్పోవుట, ఋణ బాధలు కలుగుతాయి.

ప్రతినిత్యము తల్లితండ్రుల సేవ చేయుట వల్ల సమస్త గ్రహబాధలు తొలగిపోతాయి.🙏

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Monday 22 May 2023

పరివర్తన (24-May-23, Enlightenment Story)

 💥 పరివర్తన💥

🌸🌿🌸 🌿🌸🌿 🌸🌿🌸🌸🌿🌸 🌿🌸🌿 🌸🌿🌸

ఓ దొంగ ఓ రోజు పట్టపగలు రాజభవనంలో కాపలాదారుల కళ్ళు కప్పి దొంగతనం చేశాడు. ఏదో అలికిడి అయి అప్రమత్తమైన కాపలాదార్లు పారిపోతున్న దొంగను చూసి వెంబడించారు. 

ఆ దొంగ పరిగెడుతూ ఇక వాళ్ళ నుండి తప్పించుకోవడం కష్టమని తెలిసి ఆ దొంగిలించిన సొత్తును వాళ్ళ కంట పడకుండా విసిరేసి పోతూ ఊరి చివర స్మశానంలో ఉన్న బూడిదను వంటి నిండా పూసుకుని ఓ చెట్టుక్రింద సాధువేషంలో కూర్చున్నాడు.

రాజభటులు వచ్చి దొంగ ఎక్కడా కనబడక పోయేసరికి తప్పించుకుని పారిపోయి ఉంటాడని అనుకుని అక్కడ చెట్టు క్రింద ఉన్న సాధువును చూసి ధ్యానమగ్నుడై ఉన్నాడని తలచి అతనికి మ్రొక్కారు.

ఈ వార్త ఊరంతా ప్రాకి ఊరిబయట ఓ సాధు పుంగవుడు ఉన్నాడని తెలిసి జనం అంతా తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుని మ్రొక్కుతూ ఫలపుష్పాదులు సమర్పించుకోసాగారు. 

అప్పుడా దొంగ.. “ఆహా..! నేను సాధువు వేషంలో ఉంటేనే ప్రజలు నన్ను ఇంతగా ఆరాధిస్తున్నారు. అలాంటిది నేను నిజంగా సాధువునైతే భగవంతుడి కృప నాకు లభిస్తుంది.” అని అనుకుని ఆ నాటినుండీ ఆ దొంగ నిజమైన సాధువుగా మారిపోయాడు. 

చూశారా..! వేషధారణ ఎంత మార్పు తీసుకువచ్చిందో. జీవన వాసనా ప్రభావం అటువంటిది. అందుకే..శంకర భగవత్పాదులు తమ భజగోవిందం లో ఇలా అంటున్నారు.

!!సత్సంగత్వే నిస్సంగత్వం !! నిస్సంగత్వే నిర్మోహత్వం!!

!!నిర్మోహత్వే నిశ్చలత్వం !! నిశ్చలతత్త్వై జీవన్ముక్తిః !!

సత్సాంగత్యం వల్ల అసంగత్వం ఏర్పడి మోహం, భ్రాంతి తొలగిపోతాయి. అప్పుడే మనసు నిశ్చలమై ముక్తి లభిస్తుంది. భగవశ్చింతనవల్ల సద్భక్తుల సహవాసం లభించింది. ఆ సహవాసం ముక్తికి సోపానమై, జన్మ చరితార్ధమవుతుంది. సత్కర్మాచరణ, సత్యనిష్ఠ, సాధుసత్పురుషుల సాంగత్యం వల్ల మోహం నశించి ఆత్మ నిరంతరం చైతన్యాత్మలో సంగమిస్తుంది. పెడదారి పట్టిన మనస్సును సరిదిద్దే గొప్ప అవకాశం సత్సంగత్వం. సత్సాంగత్వం వల్ల మోహం, భ్రాంతి నశిస్తాయి. మనస్సు నిర్మోహమై, నిశ్చలమవుతుంది. అంతఃకరణ శుద్ధమై, పరమాత్మకు నిలయమవుతుంది. అప్పుడే జీవన్ముక్తి.

ఇనుముకు మట్టి అంటితే తుప్పు పడుతుంది. అదే ఇనుము నిప్పులలో కాలిస్తే తిరిగి మెరుస్తుంది. సత్ సహవాసం నిప్పులాంటిది. మనలోని మాలిన్యాలను ప్రక్షాళనం చేసి మనస్సును, చిత్తాన్ని, అంతరంగాన్ని పరిశుద్ధం చేస్తుంది. క్రమేపి ఆత్మతత్త్వాన్ని అర్ధం చేసుకొని, అద్వైతానందానుభూతిని పొందవచ్చు.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

అందుకే నాలుగు గోడలమధ్య కూర్చోకుండా సత్సంగంలలో పాల్గొంటే జ్ఞానసిద్ధి మోక్ష ప్రాప్తి లభిస్తుంది🙏

🌹 సర్వేజనాః సుఖినోభవంతు🌹

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

ఎగ దీస్తే బ్రహ్మ హత్య - దిగ దీస్తే గో హత్య అనే మాట ఎలా వచ్చింది? (29-Apr-24, Enlightenment Story)

  ఎగ దీస్తే బ్రహ్మ హత్య -  దిగ దీస్తే గో హత్య అనే మాట ఎలా వచ్చింది?     🌺🍀🌺🍀 🌺 🌺🍀🌺 🌺🍀🌺🍀 🌺 🌺🍀🌺 🌺🍀🌺🍀 🌺 🌺🍀🌺           ...