Monday 30 October 2023

అట్లతద్ది (31-Oct-23, Enlightenment Story)

సౌభాగ్య‌దాయిని *అట్ల‌త‌ద్ది*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

అట్లతద్ది ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ. ‘తదియ’ నే ‘తద్దె’ అంటారు. ఉండ్రాళ్ల తద్దె , అట్ల తద్దె అనేవి అలా వచ్చినవే. ఆశ్వయుజ బహుళ తదియనాడు దీనిని జరుపుకుంటారు. దీనినే ఉయ్యాల పండుగ అనీ , గోరింటాకు పండుగ అనీ అంటారు. ఉండ్రాళ్ళ తద్ది మాదిరే ఈ పండుగకు ముందు రోజు కన్నెపిల్లలు , ముత్తయిదువులు గోరింటాకు అందంగా అలంకరించుకుంటారు. మరునాడు వేకువ జామునే లేచి తలస్నానం చేసి , పూజా మందిరంలో పీఠమును పనుపు , కుంకుమతో అలంకరించి దానిపై బియ్యం పోసి చదునుగా చేస్తారు. దానిపై తమలపాకు ఉంచి పసుపుతో చేసిన గౌరీ దేవిని పూజిస్తారు. గంధం , పసుపు , పువ్వులతో పూజిస్తారు. ఆ తర్వాత దేవికి అట్లు , ఇతర పదార్థాలు నైవేద్యంగా పెడతారు. అనంతరం శక్తి కొద్దీ ముగ్గురుకానీ , ఐదుగురు కానీ ముత్తయిదువులకు వాయినాలు ఇవ్వటం ఆనవాయితీ. ఇలా చేసినందువల్ల గౌరీదేవి అనుగ్రహంతో సుఖాలు , సౌభాగ్యం కలకాలం నిలవడంతో పాటు పుణ్యం వస్తుందని చెబుతారు. ఇది అట్లతద్దె జరుపుకోవటంలో ముఖ్య ఉద్దేశ్యం. 

అట్లతద్దినాడు తెల్లవారు జామున పిల్లలు అన్నం , గోంగూర పచ్చడి , పెరుగుతో కడుపునిండా తింటారు. అట్లతద్దోయ్‌ ఆరట్లోయ్‌ , ముద్ద పప్పోయ్‌ మూడట్లోయ్‌ అంటూ పాడుతూ ఇరుగు పొరుగు స్నేహితులందరితో  కలిసి ఆటలు ఆడతారు. ఉయ్యాలలూగుతారు. ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. పెద్దలు మాత్రం పగలంతా ఉపవసించి రాత్రి చంద్రోదయం అయిన తర్వాత మళ్ళీ పూజ చేసి అట్లను గౌరీదేవికి నివేదించి ఆరగిస్తారు.

*అట్లతద్ది కథ*

అట్లతద్దికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఒక రాజు కూతురు, మంత్రి కూతురు ,సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసి , మెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆ రోజు అట్లతద్ది. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నులయ్యారు. ఇంతలో రాజుగారి కుమార్తె ఆకలితో సొమ్మసిల్లి పడిపోయింది. రాజకుమారుడు తన చెల్లెలి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు.

ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి అదిగో చంద్రోదయమైంది. అమ్మా కొంచెం పండ్లు తిని సేదతీరి పూజ చేసుకో’ అన్నాడు. రాజ కుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ పూజ నియమం ఏమిటంటే చంద్రోదయం చూసి అప్పుడు షోడషోపచారాలతో ఉమాదేవిని పూజించిన తర్వాతే ఆహారం తీసుకోవాలి. అందుకే ఈ వ్రతానికి ‘చంద్రోదయ ఉమావ్రతం’ అని పేరు వచ్చింది. అయితే రాజకుమారి సోదరుని మాటలు నమ్మి వ్రత భంగం చేసింది. ఇది జరిగిన కొద్ది కాలానికి రాకుమారికి పెళ్లయింది.

కొంతమంది దుష్టుల మోసం వల్ల ఆమెకు ముసలి భర్త లభించాడు. ఆమె ఎంతో బాధపడింది. వ్రతం చేస్తే మంచి భర్త రావాలి గాని ఇలా ఎందుకు జరిగిందని వాపోయింది. పార్వతీ పరమేశ్వరులను అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థించింది. వారు ఆమె సోదరుడు ఆమెపై ప్రేమతో చేసినదంతా చెప్పారు. అయితే మర్నాడు ఆశ్వయుజ బహుళ తదియ అని ఆ రోజు చంద్రోదయ ఉమా వ్రతం చేస్తే ఆమె సమస్య తీరుతుందని చెప్పారు. ఆమె యధావిధిగా పూజ చేసి అక్షతలు భర్త మీద చల్లగానే ఆయన యవ్వనవంతుడయ్యాడు. కన్నె పిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సౌభాగ్యంతో తులతూగుతారు.

అట్లతద్ది అంతరార్థం

త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొంద గోరి మొదటి సారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన వల్ల చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి     వ్రతం చేసిన వారికి వస్తుందని , ఆయన అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని , కుటుంబంలో సుఖశాంతులు వర్థిల్లుతా యని శాస్త్ర వచనం.

ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం దాగి ఉంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహా ప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులూ రావని నమ్మకం.

రుతుచక్రం సరిగా ఉండేలా చేసి కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలూ ఉండవు. మినపపిండి , బియ్యపు పిండిని కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువుకు , బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భ దోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. బియ్యం , మినప్పప్పు కలిపి చేసిన అట్లను అమ్మవారికి నివేదించటంలో సమస్త గ్రహాలు కూడా శాంతించి జీవితాన్ని సుఖవంతంగా ఉండేటట్లుగా అనుగ్రహిస్తుందని నమ్మకం. అమ్మవారి నైవేద్యం ఆరోగ్యాన్ని , శక్తిని కలిగిస్తుంది.

ఆశ్వయుజ బహుళ తదియ నాడు వచ్చే అట్లతద్ది స్త్రీలకు ఎంతో శుభప్రదమయినది. పిల్లలు , పెద్దలు అందరికీ ప్రమోదాన్ని కలిగించే పర్వదినం. ఈరోజున తెల్లవారు జామున మేల్కొని గౌరీదేవి పూజ చేయాలి. చంద్రదర్శనం అనంతరం శుచియై తిరిగి గౌరీదేవి పూజ చేసి , ఆమెకు 11 అట్లు నైవేద్యంగా పెట్టాలి. తరువాత ముత్తయిదువులకు అలంకారం చేసి 11 అట్లు , 11 ఫలాలు వాయనంగా సమర్పించాలి. అట్లతద్ది నోము కథ చెప్పుకుని , శిరస్సుపై అక్షతలు వేసుకోవాలి. అనంతరం భోజనం చేయాలి. 11 రకాల ఫలాలను తినడం , 11 తాంబూలం వేసుకోవడం , 11 ఊయల ఊగడం ఈ పండుగలో విశేషం. గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు. కనుకనే ఈ పండుగకు ‘అట్లతద్ది’ అనే పేరు వచ్చింది. పదేళ్లు ఈ వ్రతాన్ని నిర్వహించి , ఉద్యాపనం చెప్పుకున్న స్త్రీలకు సంసారంలోని సర్వసుఖాలు లభిస్తాయి.

సృష్టి స్థితి లయలకు కారకులయిన బ్రహ్మ , విష్ణు , పరమేశ్వరుల భార్యలు సరస్వతి , లక్ష్మి , పార్వతులకు నెల పొడవునా ఉత్సాహంగా పూజలు జరిపే మాసం ఆశ్వీయుజం. అమ్మవారికి ఆటపాటలంటే ఇష్టం. కాబట్టి ఇంకా రజస్వలలు కాని ఆడపిల్లలు ఆడినా , పాడినా వాళ్లంతా అమ్మవారి సేవ చేస్తున్నట్టే అని చెబుతున్నాయి పురాణాలు.

*అట్లతదియ రోజున అనుకూల దాంపత్యం కొరకు పఠించవలసిన అర్థనారీశ్వర స్తోత్రం*

!! చాంపేయ గౌరార్థ శరీరకాయై  !!  కర్పూర గౌరార్థ శరీరకాయ !!

!! ధమిల్ల కాయైచ జటాధరాయ  !! నమశ్శివాయై చ నమశ్శివాయ  !!

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

ధర్మమే జయిస్తుంది (01-Nov-23, Enlightenment Story)

 *ధర్మమే జయిస్తుంది*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

అవంతి అనే నగరాన్ని విజయసింహ అనే రాజు పరిపాలించుచున్నాడు. ఆ ఊరిలోనే కాంతివర్మ అనే వజ్రాల వ్యాపారి ఉన్నాడు. అతడు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి వజ్రాలు అమ్మి తిరిగి తన ఊరు చేరుకొనేవాడు. ఒకనాడు కాంతివర్మ తన గుర్రం ఎక్కి ప్రక్క ఊరు బయలుదేరాడు. దారిలో పెద్ద అడవి దాటి వెళ్ళాలి. అడవి మధ్యకు రాగానే తను ఎక్కిన గుర్రం కాలులో ముల్లు గుచ్చుకొని అది నడవలేక కూలబడిపోయింది. ఇంతలో ముగ్గురు దొంగలు కాంతివర్మ మీద పడి అతనిని బాగా కొట్టి అతని వద్ద ఉన్న వజ్రాలు దోచుకున్నారు. దొంగలు కొట్టిన దెబ్బలకు కాంతివర్మ సృహ తప్పి పడిపోయాడు. దొంగలు కొద్ది దూరంలో ఉన్న తమ నివాసమైన గుహ వద్దకు వెళ్లి దొంగిలించిన సొమ్మును ముగ్గురం సమానంగా పంచుకుందాం అనుకొన్నారు. భోజనం చేసి పంచుకొందాం అనుకొని మూడోవాడిని ఊర్లోకి వెళ్లి భోజనం తెమ్మని పంపించారు.

ఇద్దరు దొంగలు మూడోవాడుంటే మనకు వాటా తగ్గుతుంది. వాడిని చంపేస్తే మనకే చెరిసగం వస్తుంది, అని అతనిని చంపటానికి నిర్ణయించుకున్నారు. భోజనానికి వెళ్ళినవాడు ఇద్దర్నీ చంపితే మొత్తం నాకే గదా అని ఆలోచించి ఆహారంలో విషం కలిపి తీసుకొచ్చాడు. ఇద్దరూ గుహలో దాక్కుని మూడో వాడు రాగానే వాడి మీద దాడి చేసి అతన్ని చంపేసి ఆనందంగా వాడు తెచ్చిన ఆహారాన్ని తిని వాళ్ళు కూడా చనిపోయారు. అక్కడ చివరకు మిగిలింది కాంతివర్మ వజ్రాల సంచి మాత్రమే.

తెల్లవారిన తర్వాత కాంతివర్మ కుమారులు తండ్రిని వెతుకుటకు ప్రయాణమయ్యారు. అడవి మధ్యకు చేరుకోగానే సృహ తప్పిన తమ తండ్రినీ, గుర్రాన్నీ గుర్తించారు. చుట్టు పక్కలా ఎవరైనా ఉన్నారేమో అని వెతగగా గుహముందు దొంగలు చచ్చి పడి ఉన్నారు. వారి పక్కనే తన తండ్రిగారి వజ్రాల మూటలు అక్కడే ఉన్నవి. ఆ వజ్రాలతో తండ్రిని గుర్రాన్ని తీసుకొని ఇంటికి వచ్చారు. చివరికి ఎవరి కష్టార్జితం వారి వద్దకే చేరింది.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Sunday 29 October 2023

పుష్పగిరి (30-Oct-23, Enlightenment Story)

 *పుష్పగిరి*

🍁🍁🍁🍁

చాలా కాలం కిందట ఒక గ్రామంలో నిష్టాపరుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు దివ్య క్షేత్రాలు దర్శించుకువద్దామనీ, పుణ్య నదులన్నిటి లోనూ మునిగి తరించుదామని ఎంతో ఆసక్తిగా వుండేది. ఐతే, పుట్టుపేద కావటంచేత చేయిసాగక, కోరిక నెరవేరింది కాదు.

ఇంతలో ఆ బ్రాహ్మణుడికి కాలం సమీపించగా, ఒక్కగానొక్క కుమారుడైన చైనుల్ని చేరబిలిచి, "నాయనా ! ఎంత యత్నించినా నా జీవితంలో తీర్థయాత్రలు సేవించుకోవటం గాని, పుణ్యనదులలో స్నానం చేయటంగాని పడలేదు. ఈ కోరిక అలానే నిలిచిపోయింది. కాబట్టి, నీకైనా సావకాశం చిక్కినట్టయితే, నా అస్తికలను వీలైనన్ని పుణ్యనదులలో కలప వలిసింది. ముఖ్యంగా పవిత్రమైన గంగా నదిలో కలప వలిసింది. ఈ ఒక్క పని నీవు చేశావంటే నా ఆత్మ సంతృప్తి పడుతుంది. నాకు ముక్తిమార్గం యేర్పడుతుంది” అంటూ తన తుది కోరిక వెల్లడించి దేహయాత్ర చాలించాడు.



చైనులు పితృభక్తి కలవాడు. అందుచేత అతడు 'అప్పో సొప్పో చేసి ఐనా సరే, తండ్రి కోరిక నెరవేర్చి తీరాలె. కొడుకుననిపించుకుంటూ, ఈ మాత్రం పని చేయలేకపోతే, నాజన్మ యేం జన్మ !' అనే సంకల్పంతో బయల్దేరిపోయి, ఎన్ని కష్టాలకైనా ఓర్చి కాశీ క్షేత్రం దర్శించుకుని తండ్రి అస్తికలు గంగా నదిలో కలపాలని, నిశ్చయించుకున్నాడు.

ఆ కాలంలో ఇప్పటిలాగా రైల్లా, విమానాలా, ఇట్టె వెళ్లి అట్టె రావటానికి ! కాలి నడకని పోవాలి. కీకారణ్యాలు దాటాలి. కష్టసుఖాలు ఒంటపట్టించుకోవాలి. ఇన్ని జరిగినా, బయల్దేరిన మనిషి మళ్లీ ఇల్లు చేరుకునేవరకూ నమ్మకం లేకపోయె ! అందుకనే - *కాశీకి వెళ్లినవాడూ కాటికి పోయినవాడూ తిరిగిరారు*అనే సామెత కూడా యేర్పడినట్టుంది.

చైనులు పాదచారి అయి బయల్దేరాడు. రోజుకొక గ్రామం చొప్పున సంచారం చేస్తూ, దారిలో తగిలిన క్షేత్రాలన్నీ దర్శిస్తూ, పరలోకాన ఉండే తండ్రికి గతులు కల్పిస్తూ వెళుతున్నాడు. పోయి పోయి అతడు కడప జిల్లాలో కాలు పెట్టాడు. అక్కడ పినాకినీ నది ప్రవహిస్తున్నది. ‘సరే, ఇందులో కూడా స్నానం చేసిపోదాం' అనుకుని, అస్తికలమూట ఆ దగ్గరనే పెట్టి చైనులు నదిలో దిగాడు.

అతడు స్నానం చేసికొని, సంధ్య వార్చుకుని వచ్చి, మళ్లీ మూట బుజాన వేసుకు పోదామనుకొన్నాడు. తీరా చూడగా, ప్రవహించే పినాకినీ నది పొంగువచ్చి ఆ మూటంతా తడిసిపోయివున్నది. సరే, తడిగుడ్డ ఆరబెట్టి మళ్లీ కట్టుకుందామనే ఉద్దేశంతో మూట విప్పాడు.

ఆ మూట విప్పేసరికి, అస్తికలు మాయమై, , వాటికి బదులు అమోఘంగా పరిమళిస్తున్న తెల్లటి మల్లెపువ్వులు కనుపండువుగా కనిపించినై! ఇవి చూచి చైనులు ఆశ్చర్యంతో చకితుడయాడు. ఆహా, పినాకిని జలం ఎంతటి మహిమ కలది ! కాశీలో వుండే గంగాజల మహత్యం ఎటువంటిదో నేను ఎరుగను. కాని, పినాకిని మహిమ కళ్లారా ప్రత్యక్షంగా చూడగలిగాను. నా తండ్రికి తరణోపాయం కలిగింది. ఆయన ముక్తి పొందేశాడు. నా విధి నేను నెరవేర్చుకొన్న వాడినయాను. ఇక నేను కాశీకి పోనక్కరలేదు. ఇక్కడనే ధన్యుడనయాను” అనుకుంటూ అపరిమితానందభరితుడై, తండ్రిని స్మరిస్తూ ఆ పువ్వులను పినాకినీ ప్రవాహంలో కలిపి వేసి ఇంటిముఖం పట్టాడు.

ఏమి చిత్రమో కాని, చైనులు స్నానం చేసిన తావు ఒక మడుగుగా యేర్పడింది. ఆ మడుగు నీలాటి రేవుకి సదుపాయంగా ఉండటంచేత స్త్రీలందరూ అక్కడ స్నానాలు చేసి, నీళ్లుపట్టుకునేవాళ్లు. పశువులు కూడా వచ్చి దాహం తాగేవి.

ఒకరోజున ఒక ముసలివాడు పశువులకు నీళ్లెట్టడానికని ఆ రేవుకి వచ్చాడు. బక్కచిక్కివున్న ఆ పశువులు మడుగులో నీళ్లు తాగి ఇవతలకు వచ్చేసరికల్లా మిస మిసలాడుతూ బలంగానూ పడుచుగానూ కనపడినై. ఈ వింత చూచి తాతకు ఆశ్చర్యం కలిగింది. తన పశువులు పడుచువైనాయనే సంతోషంతో తనుకూడా మడుగులో దిగి స్నానం చేశాడు. స్నానం చేసి గట్టు పైకి వచ్చేసరికల్లా తాతకు ముసిలిరూపం పోయి, పడుచువాడయాడు.

సరీగా అదే సమయానికి ఆ ముసలి వాని భార్య నెత్తిని కూటికుండ పెట్టుకుని ఆ దారిన పొలానికి పోతూవుంది. అలా పోతూవున్న ఆమెను అతడు పలుకరించే సరికి, ఎవడో తుంటరి తనతో సరాగాలాడుతున్నాడనుకొని, ఎదిరించి సమాధానం చెప్పసాగింది.

"నేను నీ భర్తను, ఫలాన ముసిలివాడనే,” అని ఎంత చెప్పినా ఆమె నమ్మక పోయేసరికి వాడు ఆమెను బరబర చెయ్యి పట్టుకు లాగి మడుగులో ముంచాడు. ఏముంది? పైకి వచ్చేసరికల్లా ఆమె రూపవతి, యౌవనవతి ఐ కూర్చుంది. తీరా ముసిలివాడూ అతని భార్యా కలిసి ఇంటికి వెళ్లేటప్పటికి, వాళ్ల బిడ్డలు తలి దండ్రుల్ని ఆనవాలు పట్టలేకపోయారు. తరువాత క్రమంగా నిజానిజాలు బయల్పడి పినాకిని జలమహిమ అందరకూ వెల్లడి ఐంది. అప్పటినించీ ఆ మడుగులో స్నానం చేసి, ప్రజలు అమరత్వం పొందటం ప్రారంభమైంది.

కొద్ది కాలానికల్లా ఈ వర్తమానం త్రిలోక సంచారి ఐనటువంటి నారదమహర్షి చెవుల బడింది. ఎవరికైనా మేలు జరుగుతూ వుంటే ఓర్వలేని నారదుడు, ఇంతమంది ప్రజలు అమరత్వం పొందుతూవుంటే చూచి సహించగలడా? ఉహుం. కనుక, ఈ మడుగుకి ఏవిధంగా కట్టడి చేయటమా!" అని ఆలోచించి తిన్నగా బ్రహ్మదేముని వద్దకు వెళ్లి సంగతి సందర్భాలు చెప్పాడు.

ఐతే, భూలోకంలో ఇటువంటి మడుగు ఎలా పుట్టింది?' అని దివ్య దృష్టితో చూచాడు బ్రహ్మ. పూర్వకాలమందు, తన తల్లి దాస్యవిముక్తికోసం దేవలోకంనించి గరుత్మంతుడు అమృతభాండాన్ని తీసుకు పోతూవుండగా దేవేంద్రుడు ఎదిరించాడు. అప్పుడు ఇద్దరి మధ్యనా ఘోరయుద్ధం జరిగింది. ఆ పోరాటంలో అమృతబిందువు ఒకటి చింది, భూలోకంలో ఇప్పుడు ఆ మడుగు ఉండే చోటున పడి నట్టు గ్రహించాడు.

నారదుడు నూరిపోసిన మీదట, అమరత్వం యిచ్చే ఇటువంటి మడుగు భూలోకంలో ఉండకూడదు అని బ్రహ్మకు కూడా అనిపించింది. వెంటనే బ్రహ్మ, హనుమంతుని రప్పించి, “హనూ ! ఒక పర్వతం తెచ్చి పడవేసి, పినాకినిలో ఉండే ఆ మడుగును కప్పెట్టివేసెయ్యి" అన్నాడు.

చెప్పటమే తడవుగా ఆంజనేయుడు బ్రహ్మాండమైన పర్వతం ఒకటి తెచ్చి దభీమని ఆ మడుగులో పడవేశాడు.

కాని, ఆ పినాకినీ జల మహిమ యేమిటో కాని, హనుమంతుడు పడవేసిన పర్వతం మడుగును కప్పి వేయటానికి బదులు బెండు లాగా నీటిపైన తేలి ఆడుతూవుంది.

ఈ చిత్రం చూచి బ్రహ్మకు కంగారుపుట్టింది. అతనికేమీ తోచక నారదుణ్ణి వెంటబెట్టుకుని, సరాసరి శివుని వద్దకు వెళ్లాడు. శివునికి కూడా ఈ విషయంలో ఏమీ పాలుపోక, ఆ ముగ్గురూ కలిసి వైకుంఠంలోవుండే విష్ణుమూర్తి వద్దకుపోయి జరిగిన వైనాలన్నీ పూసగుచ్చినట్టు ఆ జగన్నాటక సూత్రధారుడికి వినికిడి చేశారు.

విష్ణుమూర్తి చిరునవ్వుతో అంతా విని, “నాకూ, శివునికి యెప్పుడూ ఇటువంటివే చిక్కులు తగులుతూవుంటై. తిన్నగా ఉండడు కదా ఈ నారదుడు!" అని చెప్పి, బ్రహ్మనూ నారదుణ్ణి పంపి వేశాడు.

తరువాత శివకేశవులు మానవరూపంతో భూలోకానికి దిగివచ్చి, ఆ మడుగు పైన తేలి ఆడుతూవున్న పర్వతాన్ని ఒక వైపున శివుడూ, రెండోవైపున కేశవుడూ అదిమిపట్టి అణిచివేశారు.

అప్పుడు వారి ప్రభావంవల్ల ఆ పర్వతం భూమి పైన అణిగి వుండి, మడుగు మూసుకపోయింది.

ఆ బ్రాహ్మడి అస్తికలను పువ్వులుగా మార్చగల మహిమ గలిగింది- పినాకినీ నది జలం. అటువంటి నీటిలో ఆంజ నేయుడు పర్వతం తెచ్చి పడవేశాడు. ఈ రెండు కారణాలవల్ల ఆ పర్వతానికి

'పుష్ప గిరి' అనే పేరు వచ్చిందంటారు. శివకేశవులు ఇద్దరూ దిగివచ్చి ఆ పర్వతాన్ని అణచటంచేత, కొండకు రెండు పక్కలా ఆ ఇద్దరి ఆలయాలూ వెలిసి, అది ఈనాడు ఒక దివ్య క్షేత్రమై ఉన్నది.

ఇక్కడ యేటా గొప్ప ఉత్సవాలు జరుగుతై. లక్షలాది జనం స్వాముల దర్శనానికి వస్తుంటారు. ఇది చెప్పదగిన పుణ్య క్షేత్రం గనకనే పుష్పగిరి స్వాములవారు ఇక్కడ మఠం ఏర్పరచుకొన్నారు.

పుష్పగిరి కడపకు పది మైళ్ళ దూరం లోనే ఉన్నది. కాబట్టి ఈ సారి మీరు ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు తప్పక ఈ క్షేత్రం దర్శించి రండి!

ఎంతో పురాతన చరిత్ర కలిగిన పుష్పగిరిలో వైద్యనాధేశ్వరుడు, ఉండడం బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు కొలువై ఉన్న పుష్పగిరికి ప్రదక్షిణ చేస్తే ఆయువు, ఆరోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతూ సకల దోషాలు నివృత్తి అవుతాయని

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Saturday 28 October 2023

వేద పరిరక్షణ – మన కర్తవ్యం

*వేద పరిరక్షణ – మన కర్తవ్యం*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

ఒకసారి చెన్నపురిలో స్వామి వారికి కనకాభిషేకం జరిగింది. భక్తుల కోరిక మేరకు ఆయన కంచి నుండి చెన్నైకు ఒక దేవస్థాన కుంభాభిషేకానికి విచ్చేశారు. అప్పుడు ఆయన వచ్చిన కార్యం గురించి ఇచ్చిన అనుగ్రహభాషణం సంగ్రహంగా:

“నేను ఒక పల్లెటూరులో హాయిగా నా పూజలు జపాలు, ధ్యానాలు చేసుకుంటూ మఠం నడుపుకుంటూ వున్నాను. నేనిక్కడకు మీరిచ్చే కానుకల కోసమో, కనకంతో అభిషేకం మీద మక్కువతోనో రాలేదు. చిన్న మఠం నడుపుకోవడానికి నాకు పల్లెటూరులో వచ్చే విరాళాలు చాలును. మీ అందరి సంతోషం కోసం నన్ను పిలిచారు. కానీ దీనితో పాటు నా వ్యాపారం కూడా కొంత వుంది అందుకు రాక తప్పలేదు.

వేదం, దాని అనుష్టానం అడుగంటుతోంది. దాని ప్రాముఖ్యత తెలియజేయడానికి అటువైపు బ్రాహ్మణులను ఉద్యుక్తులను చెయ్యాలని నా కర్తవ్యం. ఆరిపోతున్న ఈ దీపాన్ని పునరుద్ధరించాలని నా తాపత్రయం. ఇటువంటి మహానగరాల్లో నా మాటలు వినడానికి వేలల్లో, లక్షల్లో వచ్చారు. ఏ ఒక్కడు, ఏ పది మందో నా మాట విని ఆచరించినా నా కార్యం సఫలీకృతమవుతుంది. నాలుగు తీపి మాటలు చెప్పడానికి కాదు నేనోచ్చింది, ఏది సరైన మార్గమో తెలియచేసి పాటించగలిగేలా చెయ్యాలని వచ్చాను. దీనివలన మీలో చాలామందికి మనస్తాపం కలిగించిన వాడనవ్వవచ్చు.

మీలో ఎందరో బ్రాహ్మణులు మీ వైదిక విధులను వదిలేసి ఆధునిక జీవన సరళికి అలవాటు పడ్డారు. కానీ మీరు ఈ విజ్ఞానాన్ని చూస్తూ వదులుకోవడాన్ని నేను హర్షించాను. మీ పిల్లలకు 8వ ఏట నుండి 18 ఏళ్ళు వచ్చేవరకు రోజుకొక్క గంట వేదం నేర్పించండి. వాటి ప్రయోగం నేర్పించండి. అదే నాకు నిజమైన కనకాభిషేకం. ఎక్కడో విదేశాలలో ఒక యూనివర్సిటీ లో మంచి కోర్స్ వుందంటే మీరు వెనుకాడక శ్రమకోర్చి వెళ్లి నేర్చుకుంటున్నారు. వేదాభ్యాసం శ్రమతో వ్యవహారం అని వదలవద్దు. అది శ్రమైనా దాని వలన మీకు కలిగే శ్రేయస్సు అపారం. ఎందరో విదేశీయులు మన వేదాంతాన్ని, వేదసారాన్ని తెలుసుకోవడం కోసం మన దేశాన్ని ఆశ్రయిస్తున్నారు. మనమే మన వేదాన్ని అపహాస్యం చేసుకోవడం ఎంతవరకు సబబో ఆలోచించండి. వేదం ప్రపంచ శాంతికి ఉద్దేశించబడింది. మనది వేదభూమి. కలిలో కల్కి అవతరించబోయేది దక్షిణదేశంలో ఒక సనాతన బ్రాహ్మణుని ఇంటిలోనే. ఎవడైతే వేదమతదూషణ, ఖండన చేస్తారో వారిని అంతమొందిస్తాడు. నేడు సంఘంలో కట్టుబాట్లు లేకుండా పోయాయి. విచ్చలవిడితనం ఎక్కువయిపోయింది. ఈ కట్టుబాట్లు మనిషిని దిద్దడానికే కానీ అతడిని ఇబ్బంది పెట్టడానికి కాదు. 

ఆది శంకరాలు ఆయన దేహత్యాగం చేసేముందు అందరినీ ఉద్దేశించి ఆయన బోధనా సారాంశంగా ఐదు శ్లోకాలను చెప్పారు. అందులో మొదటిది “వేదం నిత్యం అధియతం”. ఇప్పుడు నా కర్తవ్యం కూడా అదే. అన్ని చోట్లకు వెళ్లి వాళ్లకు ఇదే ఉపదేశిస్తున్నాను. ఇన్ని వేలమందిలో కనీసం ఒక పదుగురైనా నా మీద గౌరవంతో నేను చెప్పినట్టు చేయ్యకపోతారా అని. పట్టణీకరణ వలన ఎన్నో సదుపాయాలు వచ్చినా వాటితో ఎన్నో అనర్ధాలు కూడా వచ్చాయి. స్వధర్మాన్ని నిరసిస్తున్నారు. మీరు కొద్దిగానైనా పూర్వపు పద్ధతులను అనుసరిస్తానంటేనే నేను మరల వస్తాను. ఒక ఉద్యోగం చేస్తున్న ఒక లాయరు ఒక విధమైన వస్త్రధారణతో ఉండట్లేదా, అలాగే ఒక ప్యూను. అలాగే బ్రాహ్మణుడు కూడా పంచకచ్చ, శిఖా వుంచుకోవాలి. ఇప్పటికే ఎన్నో ఇబ్బందుల్లో వున్నారు, నేను వచ్చి మళ్ళీ మీ లోపాలను గుర్తు చెయ్యాలా? మీ మనోల్లసానికి కచేరీలు చేసేవారు ఎందరో వున్నారు. నేనిక్కడకు కచేరి చెయ్యడానికి రాలేదు ధర్మం ప్రభోధించడానికి వచ్చాను. నేను ఎవరిమీదా అజమాయిషీ చేయ్యగోరట్లేదు. మీ చెవులు కొంత సమయం నాకు కేటాయించమని కోరుతున్నాను. ఇప్పటికే ఎంతో నష్టపోయాము. ఇంకా పోయినదాని గురించి శోకించడం కన్నా మిగిలి వున్న కొద్దిపాటి సంస్కారాన్ని ఉద్ధరించాలి. పురాతనమైనది అంతా గొప్ప అని చెప్పను అలాగని నవ్యమైనది అంతా రోత అని చెప్పను. అన్నింటిలో మంచిని గ్రహించాలి. భక్తి, జ్ఞానం, సంస్కారం గురించి కొంత చెప్పాను. కానీ ఇవన్నీ ఒక విత్తునుండి వచ్చినవే. అదే వేదం, వేదసంస్కారం, సనాతన ధర్మం. దాన్ని వదిలి మిగతావాటిని పట్టుకున్నా లాభం లేదు. 

ప్రతి బ్రాహ్మణుడు వేదం నేర్చుకోవాలి. తన కుమారునికి వేదం నేర్పాలి. ఇది చెయ్యలేకపోయినా వేదఘోష ఆగకుండా వేదాభ్యాసం చేసేవారిని ప్రోత్సహించాలి. అవి పోషణకోసం ఎదురుచూస్తున్నాయి. వేదం నేర్పెవారికి, నేర్చుకునేవారికి సరైన ఆర్ధిక చేయూతనివ్వాలి. ఇంకా వేదపాఠశాలలు నెలకొల్పాలి. సరైన విధానంలో పరీక్షలు జరగాలి. చదువుకునేప్పుడు, ఉత్తీర్ణత అయ్యాక వారికి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలి. కొన్ని ట్రస్ట్లు మొదలయ్యాయి. మీరు నేరుగా చెయ్యలేకపోతే వీరి ద్వారా ప్రోత్సహించండి. ప్రతి ఒక్కరు నాకోసం ప్రతి నెలలో మీ జన్మ నక్షత్రంలో ఒక్క రూపాయి కిడ్డి బ్యాంకు లో వెయ్యండి (ఇప్పుడు మనం వందగా అన్వయించుకోవచ్చు). సంవత్సరాంతానికి ఇది 12/- (మనం 1200 అనుకుందాం) అవుతాయి. దాన్ని వేదపరిరక్షణ నిధికి జమ చెయ్యండి. మీరు నాకు స్వయంగా ఇస్తున్నారనుకోండి. తప్పేమీ లేదు నేనే అడుగుతున్నాను కదా!!. మీకు మఠం నుండి ఆశీర్వచనాలు, ప్రసాదం అందుతాయి.

🌹🌹 అపార కరుణా సింధుం జ్ఞానదం 🌹🌹శాంతరూపినంమ్ 🌹🌹

శ్రీ చంద్ర శేఖర గురుం ప్రణమామి ముదావహం.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

శరత్ పూర్ణిమ విశిష్టత (29-Oct-23, Enlightenment Story)

 🌝🌹శరత్ పూర్ణిమ విశిష్టత🌹🌝

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

ఆశ్వీయుజ పూర్ణిమకే శరత్ పూర్ణిమ అని పేరు. ఇది అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైన రోజు. మామూలు ప్రజలు అమ్మవారి ఆరాధన దేవి నవరాత్రులు 9 రోజులు చేస్తే, దేవీ ఉపాసకులు అమ్మవారి ఆరాధన ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు చేస్తారు.


ఏడాదిలో ఈ పూర్ణిమ నాడు మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తాడు. అందువలన ఈ రోజు చంద్రుడిని పూజించాలి. ఈ శరత్ పూర్ణిమ రోజున చంద్రకిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది. అవి శారీరిక, మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. అందువలన చంద్రకాంతిలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణ చేయడం, ఆవుపాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి రాత్రంతా చంద్రకాంతిలో ఉంచి, ఉదయాన్నే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. చంద్రకాంతి నుంచి ఈ పౌర్ణమి రోజున అమృతం కురుస్తుందని శాస్త్రం చెప్తోంది. చంద్రకాంతిలో ఉంచిన పరమాన్నం చంద్రకిరణాల లో ఉన్న ఓషిధీతత్త్వాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. మరునాడు ఉదయం ఆ పరమాన్నాన్ని కుటుంబసభ్యులందరూ నైవేధ్యంగా స్వీకరించాలి🌹🙏🌹

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Friday 27 October 2023

ప్రతిభే పెట్టుబడి (28-Oct-23, Enlightenment Story)

*ప్రతిభే పెట్టుబడి*

 🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋

వారణాసిలో బ్రహ్మదత్తుడు రాజ్యం చేస్తుండగా బోధిసత్వుడు ఆనంద్ అనే పేరుతో పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయన బుద్దిమంతుడే కాకుండా శకునశాస్త్రజ్ఞుడుకూడా.

ఒకనాడాయన రాజుగారి వద్దకు వెళ్తూ తోవలో చచ్చిన ఎలుకని చూసి నక్షత్ర స్థానం గుణించి 'తెలివితేటలు కల యువకుడైతే యీ చచ్చిన ఎలుకని తీసుకుపోయి దీనినే పెట్టుబడిగా వ్యాపారము చేసి వివాహము చేసుకోవచ్చును' అన్నాడు. ఆ మాటలు పేదవాడయిన ఒక మంచి తెలివైన బాలుడు విన్నాడు. 

ఆనంద్ తెలిసి తప్పుమాట్లాడడని తలచి ఆ ఎలుకను తీసుకెళ్ళి పిల్లిని పెంచే ఒక కొట్టువానికి కాణికి (కాణి రూపాయలో 64 వ వంతు) అమ్మి దానితో బెల్లంకొని, మంచినీటిని పట్టుకొని అడవి నుంచి పువ్వులు తెచ్చి అమ్మేవారికి చిన్న బెల్లం ముక్కపెట్టి మంచి నీళ్ళు ఇచ్చాడు. 

వాళ్ళతనికి కొన్ని పూలు ఇచ్చి పోయారు. అతను వాటిని అంగడిలో అమ్మి ఆ డబ్బులతో మరింత బెల్లంకొని మరునాడు కూడా వారికి బెల్లం ముక్క మంచి నీళ్ళు ఇచ్చాడు. వాళ్ళీసారి కొన్ని పూలదండలు, పూలమొక్కలు యిచ్చారు. ఈ ప్రకారంగా అతను ఎనిమిది కార్షాపణములు త్వరగానే సంపాదించాడు. ఇలా ఉండగా ఒకనాడు పెనుగాలి వీచి వానకురిసింది. ఆ గాలికి రాజోద్యానములో ఎండుకొమ్మలు ఆకులు రాలి అక్కడంతా చిందరవందరగా తయారయ్యింది. తోటమాలికి ఏం చేయాలో అర్థంకాలేదు. అదంతా బాగుచేయడం అతనికి తలకిమించినపని. అదిగమనించి యువకుడతనివద్దకు వెళ్ళి రాలిపడిన కర్రలూ కంపా నాకిచ్చేస్తాను అంటే నేను తోట బాగుచేయిస్తాను అన్నాడు. తోటమాలి వెంటనే అంగీకరించాడు.

ఆ యువకుడు పిల్లలాడుకునే చోటుకిపోయి బెల్లం ముక్క పెడతాను అని ఆశచూపి వాళ్ళని తోటలోకి తీసుకుపోయి తుక్కుపోగుచేయించి బయట పోయించాడు. ఆ సమయంలో కుండలని కాల్చేందుకు కర్రలకోసం పోతున్న ఒక కుమ్మరి 26 కార్షాపణములు, కొన్నిచెట్లు యువకుడికిచ్చి ఆ కుప్పని తరలించుకుపోయాడు. 

అప్పుడా యువకుడికొక ఉపాయంతోచింది. నగరద్వారానికి దగ్గరలో గడ్డికోసుకొని వచ్చేవారికి కుండలతో నీరిచ్చి వారి దాహం తీర్చాడు. నువ్వు మాకు మేలుచేశావు. మేము నీకేంచేయమంటావు? అని అడిగారు. సమయం వచ్చినప్పుడు అడుగుతాను. అప్పుడు మీరు నాకు సాయం చేద్దురుగాని అన్నాడు. ఆ యువకుడు మెల్లగా కొందరు వర్తకులతో స్నేహం చేశాడు. ఒకనాడొక వర్తకుడు రేపు 500 గుర్రాలతో అశ్వవర్తకుడు నగరానికి వస్తాడు. అని యువకుడికి చెప్పాడు. అతను వెంటనే గడ్డి తెచ్చేవాళ్ళ దగ్గరకెళ్ళి రేపు మీరునాకు ఒక్కొక్కరూ ఒక గడ్డిమోపు చొప్పున వెయ్యాలి. నా మోపులమ్ముడయ్యే వరకూ మీరెవరూ మీ గడ్డిమోపులమ్మకూడదు. ఇదే మీరు నాకు చేయవలసిన సాయం అన్నాడు. వాళ్ళంగీకరించారు.

మరునాడు గుర్రాల వర్తకుడు వచ్చాడు. ఆ గుర్రాలకి గడ్డి కావాలి. కాని, ఆ యువకుడి దగ్గర తప్ప నగరంలో మరెక్కడా గడ్డి దొరకలేదు. అందుచేత తన 500 గుర్రాలకి అతనివద్దనున్న 500 గడ్డిమోపులని 1000 నాణాలిచ్చి కొనవలసివచ్చింది. ఇది జరిగిన కొద్ది రోజులకే మరొక వర్తకుడు యువకుడితో 'రేవులోకి ఒక గొప్ప నావ వచ్చింది' అని చెప్పాడు. ఆ మాటలతో యువకుడికొక ఉపాయము తట్టింది. అతను చక్కగా అలంకరించబడిన బండి నొకదానిని గంటకింత అని అద్దెకు తీసుకొని ఒక నావను కొని దగ్గరలో ఒక మంటపం నిర్మించి లోపల తాను కూర్చొని తన పరివారంతో 'బయటినుండి వర్తకులు వచ్చినప్పుడు వరసగా మీ ముగ్గురు వారిని నా దగ్గరకు తీసుకురండి'. అన్నాడు. 

రేవులోకి నౌక వచ్చిందని విని వారణాసి నుండి 100 మంది వర్తకులు సరుకులు కొనడానికి వచ్చారు. కాని... అంతకు ముందే సరుకంతా యువకుడు నియమించిన ముగ్గురూ వారినతని వద్దకు వెళ్ళబోయారు. యువకుడు నియమించిన ముగ్గురూ వారినతని వద్దకు తీసుకువెళ్ళారు. బేరసారాల పిమ్మట వర్తకులొక్కక్కరూ నౌకలో భాగమునకు వెయ్యిచొప్పున సరుకుకి వెయ్యిచొప్పునా నాణాలిచ్చారు. ఈ విధంగా ఆ యువకుడు రెండు లక్షలతో వారణాసికి తిరిగి వచ్చాడు . మర్నాడతను లక్ష నాణాలతో కృతజ్ఞతలు తెలిపేందుకు ఆనంద్ వద్దకు వెళ్ళాడు. అప్పుడు ఆనంద్ 'నాయనా! నీకీ ధనమెలా వచ్చింది?' అని అడిగాడు. మీరిచ్చిన ఉపదేశమువలననే వచ్చింది. ఆరు మాసములలో యిదంతయూ నాకు లభించింది'. అన్నాడు యువకుడు వినయంగా.

వివరంగా చెప్పు అన్నాడు ఆనంద్. చచ్చిపోయిన ఎలుక, ఆనంద్ మాటలు మొదలుకొని జరిగినదంతా వివరంగా చెప్పాడా యువకుడు. అది విన్న ఆనంద్ ఇతన్ని యితరుల చేతిలో పడనివ్వకూడదు అనుకూడదు అనుకున్నాడు. అంతలోనే అతనికి తన పుత్రిక జ్ఞాపకం వచ్చింది. ఆమె పెళ్ళికెదిగి ఉంది. యువకడు అవివాహితుడు, ఇంకేంకావాలి? అతనికి తన పుత్రికనిచ్చి తొందరలో వివాహం చేసేశాడు. పుత్రికతోపాటు తన సర్వసంపదని అతనికిచ్చాడు. 

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Thursday 26 October 2023

బృందావనం (27-Oct-23, Enlightenment Story)

 🙏🌹నిజంగా జరిగిన కథ🌹🙏

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

మధురా "బృందావనం" లో కొన్నేళ్ల క్రితం నిజంగా జరిగిన సంఘటన, ఇది! ఇప్పటికీ ఆ ఆనవాళ్లు' ఇంకా ఉన్నాయి !!

ఒక పండితుడు ,తన పూరి గుడిసె లాంటి ఇంటి ముందు అరుగు పై కూర్చుండి,నిత్యం భక్తులకు పురాణం వినిపిస్తూ ఉండేవాడు,! క్రమం తప్పకుండా భక్తితో,భక్తుల నుండి ఏమీ ఆశించకుండా వినిపిస్తూ ఉంటే, ఆ ప్రాంతం వారు, చాలామంది వచ్చి శ్రద్ధగా వింటూ తన్మయం చెందే వాళ్ళు!!

అప్పుడప్పుడూ ,ఆయన తాను చెబుతున్న పురాణం మద్యలో అపి, లోనికి వెళ్ళి వస్తూ , మా పిల్లవాడికి స్నానం చేయించానని, భోజనం పెట్టానని, పడుకో బెట్టాను అనీ దుస్తులు ధరింప జేశానని చెప్పేవాడు,ఇలా రోజూ జరుగుతూ వుండేది...! కానీ గుడిసె లో పిల్లవాడి అలికిడి, అల్లరి, మాట ఏదికూడా ఎవరికీ వినపడేది కాదు,ఇలా ఏళ్లు గడిచాయి,

ఒకరోజు ఆయన దేహం చాలించాడు, గ్రామస్తులు చాలా బాధ పడ్డారు,అయ్యో ! ఎంత మంచి వాడు! ఎంతో భక్తిశ్రద్ధలతో ఎవరిని ఏమీ అడగకుండా అద్భుతంగా భగవద్ కథలు వినిపించి మనలను తరింపజేశాడే ! మరల ఎవరు ఇంత గొప్పగా చెబుతారు,అంటూ విచారపడుతూ అందరూ అనుకోని ఆయన అంత్యక్రియలు జరిపే సన్నాహాలు చేయడం ప్రారంభించారు !!

మా అబ్బాయి అని చెప్పాడు కదా అంటూ ఆ పిల్లాడి కోసం వారు లోనికి వెళ్లి చూస్తే ఎవరూ కనపడలేదు వారికి!! ఒక రోజు ఎదురు చూశారు! పిల్లాడి జాడ లేదు !చివరకు వాళ్ళే అతడి కళేబరాన్ని యమునానది ఒడ్డుకు తీసుకెళ్ళి మంచి గంధపు కట్టెలతో చితిని ఏర్పాటు చేశారు!! ఇక నిప్పు పెట్టడానికి వాళ్ళలో ప్రతీ వాడు,నేను పెడతాను అంటే..నేను పెడతాను అంటూ పోటీలు పడ్డారు !

ఎందుకంటే, మహా పుణ్యాత్ముడయిన ఆయనకు చేసే ఈ పని వల్ల కర్మ చేసేవారికి ఎంతో పుణ్యం వస్తుంది కదా ! ఇలా వాళ్ళు పేచీ పడుతూ ఉంటే, దూరం నుండి ఒక పిలుపు వినవచ్చింది వారికి !

ఆగండి.... !! ఆగండి.... !!అంటూ

అందరూ చూస్తుండగా దూరంగా ఒక పదహారేళ్ళ బాలుడు పరుగు పరుగున అటే వస్తూ కనిపించాడు. నేను మిమ్మల్ని ఒకటి కోరుకుంటున్నాను, చనిపోయిన ఈ పెద్దాయన నా తండ్రి ! నన్ను ఒక పని మీద పొరుగూరు పంపించాడు!! అది చూసుకొని రావడంలో నాకు కొంత ఆలస్యం జరిగింది, !!నన్ను క్షమించి, దయచేసి నా తండ్రికి అగ్ని సంస్కారం చేసే భాగ్యాన్ని అనుగ్రహించండి !! అని విచార వదనంతో అంటుంటే వారికి చాలా ఆనందం కలిగింది,

చూశారా! రక్త సంబంధము బలం ఎలా ఉంటుందో...?? ఆయనకు తన కన్న కొడుకు చేత ఈ పని చేయించుకునే అదృష్టం ఉండగా, ఇతరులకూ ఆ అవకాశం ఉంటుందా...?? అనుకుని సరే అన్నారు!

ఆ పిల్లవాడు చక్కగా వేద మంత్రాలు పఠిస్తూ,అంత్యేష్టి కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నాడు!! చక్కని పాండిత్యం అందమైన ఉచ్చారణతో పనసలు చదువుతూ ఉంటే, అక్కడకొచ్చిన వేద పండితులు,పురోహితులు కూడా ఆశ్చర్య పోతున్నారు! ఏమా వర్చస్సు?! ఏమా శాస్త్ర పరిజ్ఞానం...??

ఇంతవరకూ ఎవరూ, కనీ వినీ ఎరుగని శాస్త్ర విధి ప్రకారం చేస్తూ చివరకు చుట్టూ ప్రదక్షణ నమస్కారం చేస్తూ దుఖిస్తూు,చితికి నిప్పు అంటించాడు !!

నాయనా ! ఇక నీవు వెనుదిరిగి చూడకుండా దూరం వెళ్లు అన్నారు ఊరి పెద్దవాళ్ళు! ఆ పిల్లవాడు అలాగే అన్నట్టుగా తల ఊపి, నేరుగా వెళ్తూ దాదాపుగా ఒక 20 గజాల దూరం వెళ్ళాక, కనిపించకుండా అంతర్ధానం కావడం వారు అందరూ కళ్ళారా చూశారు, అప్పుడు తెలిసి పోయింది వారికి, ఆ వచ్చినవాడు "కృష్ణయ్య" అని

ఇన్నాళ్లూ విన్న భాగవత కథల పుణ్యమా అని, శ్రీకృష్ణుని ఒక బాలుని రూపంలో ప్రత్యక్షంగా దర్శించే మహా భాగ్యం లభించింది కదా అంటూ, ఆ బాలుడు నడచిన నేలపై గల ధూళిని ప్రసాదంగా, మహదైశ్వర్యముగా స్వీకరించారు వారంతా! ఇప్పటికీ ఆ ప్రదేశాన్ని పరమ పావనంగా పవిత్రంగా భావిస్తూ పూజిస్తూ ఉన్నారు బృందావనవాసులు!

శ్రీకృష్ణుడు అదృశ్య రూపంలో కొలువై నెలవై , భక్తుల పాలిట కల్పతరువుగా అచట ఉంటున్నాడనుటకు నిదర్శనం ఈ వాస్తవ గాథ !!

మా అబ్బాయికి నిద్ర, అహారం, స్నానం ఏర్పాట్లు చేసి వస్తానని చెబుతూ శ్రీకృష్ణ భగవానుని తన కుమారునిగా భావిస్తూ అదే ధ్యాసతో అంతిమ శ్వాసను విడిచిన ఆ మహానుభావునికి కృష్ణుడు, కొడుకు రూపంలో వచ్చి, స్వయంగా కన్న తండ్రి కి కొడుకు చేస్తున్నట్టుగా , శాస్త్ర రీతిలో పద్ధతిగా చేశాడు.అలా పరందాముడే స్వయంగా, అంతిమ క్రియలు చేయడం వాళ్ళు గమనించారు,భక్తుడు ఈ భవ బంధాలను కోరుకోకుండా, నేరుగా భగవంతునితో సంబంధబాంధవ్యాలు పెట్టుకొని పంచుకుంటూ, పెంచుకుంటూ ముక్తిని పొందాడు !

ఈ రోజుల్లో కడుపున పుట్టిన కొడుకులు కూడా దూరంగా ఉంటూ తండ్రి ఆర్తితో పిలిచే పిలుపు కు అందక పోవచ్చు!!లేదా ఖాతరు చేయకుండా పోవచ్చు,,!! కానీ పరమాత్ముడు మాత్రం తనను నమ్మిన భక్తుడిని ,సదా సంరక్షిస్తూ, అతడి యోగక్షేమాలు స్వయంగా చూస్తుంటాడు!!

ఇలా భగవంతునికి భక్తునికి ఉండే సంబంధం మాటలకు, ఊహకు, చేతలకు , అందదు!! భావాగ్రాహి జనార్దనా !" అంటే భక్తుని అంతరంగం లో కదిలే భావాలను జనార్ధనుడు సదా గ్రహిస్తూ, ఉంటాడు..!! ఆ ప్రేమానుబంధం అనిర్వచనీయం ! అద్భుతం కూడా !! అలాంటి బ్రహ్మానంద భక్తి సామ్రాజ్యము ఆ బృందావనం! ఆ అందాల ఆనందాల అనుబంధాల బృందావన వనసీమలో ఒక రేణువుగా మారితే ఎంత బాగా ఉండేది కదూ !

నిత్యం అచట సంచరించే సాక్షాత్తూ రాధాకృష్ణుల మృదువైన పాదములు సుతి మెత్తగా తాకుతూ ఉండగా, కలిగే పరమానందాన్ని,అఖండ ఐశ్వర్య విభూతి వైభవాన్ని అందించమని నల్లనయ్య ను కోరుకుందాం!!

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥



అంతఃకరణ శుద్ధి ఎట్లా వస్తుంది (26-Oct-23, Enlightenment Story)

అంతఃకరణ శుద్ధి ఎట్లా వస్తుంది... ? 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 

భగవంతుని కోసం నిరంతరం పరితపించటాన్నే తపస్సు అంటారు. మనోవాక్కాయకర్మల యందు అధ్యాత్మిక చింతనతో తపించటాన్నే తపస్సు అంటారు. ప్రతి మానవుడు పారమార్థిక ఆత్మనిగ్రహ ప్రయత్నాన్ని ఒక తపస్సుగా గ్రహిస్తాడు. అలా తపస్సు చేయటం చేత మల విక్షేప ఆవరణాలు అనే త్రివిధ దోషాలు తొలగిపోతాయి. 

  •  శ్రవణం చేత మల దోషం తొలగుతుంది. 
  •  మననం చేత విక్షేప దోషం తొలగుతుంది. 
  •  నిరంతర ధ్యానమనే నిది ధ్యాస చేత ఆవరణ దోషం తొలగుతుంది. 
  • ఈ విధంగా మనస్సుని, శరీరాన్ని శుద్ధి చేసుకొన్న వారికి పాపాలు క్షీణిస్తాయి. 
  • వాసనాక్షయం జరుగుతుంది. 
  • పూర్వ జన్మ వాసనలు క్రమేపీ తొలగుతాయి.ఆ విధంగా మనస్సు పాపవాసనాక్షయం చేకూర్చుకోగానే ప్రశాంతత నొందిన మనస్సు చేకూరుతుంది.
  • శారీరకమైన ఆవేదనల్నీ, ఇంద్రియలోలత్వాన్ని బుద్ధిపూర్వకంగా నిగ్రహించు కోవటంవల్ల మానవునికి ప్రశాంతత ఏర్పడుతుంది. 

కాన శారీరకంగాను, మానసికంగాను, తపస్సనేధనాన్ని పొందాలి. తపస్సు చేయాలంటే ప్రతి మానవుడు తాను జీవించే విధానంలో, తన పరిసరాల్లో ఆ వాతావరణాన్ని పెంపొందించుకోవాలి. ఉన్న ఇల్లే తనకు, తపస్సుకు కూడా అనుకూలంగా కుదిరేటట్లు మార్చుకోవాలి. తాను మారాలి. ఎందుకు ? 

మోక్షాకాంక్ష ఉండబట్టి. మానవుడై పుట్టిన ప్రతివాడిని భగవంతుడు తనను చేరమని, చేరటానికి దారితెలుసుకోమని (నిర్దేశించాడు, ఉద్దేశించాడు) ఏర్పరిచాడు. మానవుడు దాన్ని మర్చిపోయి జీవిస్తున్నాడు. అలా కాకుండా మానవుడు త్రికరణ శుద్ధిగా తపస్సంపన్నుడు కావాలి. దేనికి? ఆనందం కోసం - 

మానవుడు కర్మేంద్రియాలను అరికట్టినా మనస్సు మాత్రం విషయాలన్నిటినీ తలపోస్తూ బహిర్ముఖంగా సంచరిస్తూ గడుపుతుంది. ఆనందం ఎక్కడ ఉంది? ఆనందం ఆత్మలోనే ఉంది. ఆత్మానందమే నిజమైన సచ్చిదానందం. నిషిద్ధమైన కర్మల్ని ఆచరించకుండా ఉంటే మనో మాలిన్యమనే పాపం పేరుకోకుండా ఉంటుంది. పాపం చెయ్యకుండా ఉండటమే కాదు, మానసికమైన వ్యభిచారం కూడా లేకుండా చూసుకోవాలి. 

మనిషి మాత్రం ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు. కాని మనస్సు పరిపరివిధాల వ్యభిచరిస్తూ ఉంటుంది. మానవుడు కర్మేంద్రియాలను అరికట్టినా మనస్సు మాత్రం విషయాలన్నిటినీ తలపోస్తూ బహిర్ముఖంగా సంచరిస్తూ గడుపుతుంది. ఈ ఆధునిక కాలంలో మానవులందరిలోను జరుగుతోంది.ఈ నిత్య ఈ మానసిక వ్యభిచారం!దాన్ని అన్ని విధాల అరికట్టాలి.దాన్ని అరికట్టటానికి ఆత్మతో మనస్సు అనురక్తమై జీవించే విధానాన్ని అలవడేటట్లు చెయ్యాలి. దానివల్ల అంతఃకరణశుద్ధి ఏర్పడుతుంది. 

దీనికి వివేకం, వైరాగ్యం తోడయితే లక్ష్యం సిద్ధిస్తుంది. అయితే పాపాలు నశించి, ప్రశాంతత చేకూరి, సాధకుడు మోక్షంకోసం జీవించాలంటే అనురాగం కూడా నశించినవాడై ఉండాలన్నారు. విషయాల్ని దూరం చేసినంత మాత్రం చేత రాగం నశించదు. విషయంతోపాటు దానియందలి అనురాగం కూడా దూరం కావాలి అంటే మనస్సుకి ఆత్మ అనే భగవంతునితో అనుసంధానం చేకూరిస్తేనే రాగం కూడా నశిస్తుంది. 

 సాధకుడు అభిమానం, అహంకారం వంటి వాటికి తనలో స్థానం ఏర్పరుచుకొంటే ప్రత్యేకమైన కోరికలకు అది నిలయం అవుతుంది. కావున సాధకుడు అభిమానం, అహంకారం అనే వాటికి స్థానం లేకుండా చేసుకొంటూ వెళ్ళాలి. అప్పుడు కోరికలకు స్థానం లేకుండా పోతుంది. మనస్సుకి నిస్సంకల్ప స్థితి చేకూరుతుంది. 

అదే మోక్షాన్ని కాంక్షించటానికి తగిన స్థితి.సాధనలో మెలకువలో నిద్రను, నిద్రలో మెలకువను అనుభవించాలి. ఎవరి అనుభూతిని వాళ్ళే పొందాలి. ఎవరి నిగ్రహానికి తగిన విధంగా వాళ్ళవాళ్ళకు తగిన అనుభవం సాధనలో చేకూరుతూనే ఉంటుంది. ఏ కొద్దిపాటి శ్రద్ధాసక్తులు కలిగిన వాళ్ళుయినా దీన్ని అనుభూతి పొందుతారు. 

ఆ నమ్మకంతో, ఆ పట్టుదలతో, నిరంతర తపనతో, ఆత్మ జ్ఞానంకోసం సాధన చెయ్యాలి.✍️ . 

 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🌷🙏🌷 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏 🍀🌺🍀🌺🍀🌺🍀

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥


Tuesday 24 October 2023

ఇసుక తక్కెడ - పేడ తక్కెడ (25-Oct-23, Enlightenment Story)

 ఇసుక తక్కెడ - పేడ తక్కెడ

 🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁     

ఎటువైపు చూసినా మోసమే వుండి అంతా లొసగులు అబద్దాలతో నిండిపోయి, ఏమీ అర్ధంగాక గందరగోళానికి గురయినప్పుడు.ఈ వ్యవహారమంతా ‘ఇసుక తక్కెడ-పేడతక్కెడ’ లాగుందే అని అంటూ వుంటారు.

అసలు ఈ జాతీయం ఎలా వచ్చింది *ఇసుక తక్కెడేంది, పేడతక్కెడేంది* అని ఆరా తీస్తే మనకు ఒక గమ్మత్తయిన కథ కనబడుతుంది.

ఒక ఊరిలో ఇద్దరు దొంగలు వుండేవాళ్ళు. ఒకని ఇళ్ళేమో ఉత్తరం వైపు, మరొకని ఇళ్ళేమో దక్షిణం వైపు. వాడు దొంగని వీనికి తెలీదు. వీడు దొంగని వానికి తెలీదు. ఇద్దరూ ఎదుటి వాళ్ళను మాటలతో బోల్తా కొట్టించి మోసం చేయడంలో ఆరితేరినవాళ్లే.

ఒకసారి వాళ్ళలో ఒకడు ఒక కావడి తీసుకొని దానికి రెండువైపులా రెండు ఇసుక కుండలు పెట్టి, అవి కనబడకుండా చిరిగిపోయిన బట్టలు కట్టి భుజానికి తగిలిచ్చుకొని ఎవరిని మోసం చేద్దామా అని వెదుక్కుంటూ పోసాగాడు.

సరిగ్గా అదే సమయానికి ఇంకొకడు కూడా ఒక కావడి తీసుకొని రెండు వైపులా రెండు పేడతో నింపిన కుండలు పెట్టి, అవి కనబడకుండా ఒక పాత మసిబట్ట కట్టి భుజానికి తగిలిచ్చుకొని మోసం చేయడానికి ఎవరు దొరుకుతారా అని వెదుక్కుంటూ బైలు దేరాడు.

వాళ్ళిద్దరూ అనుకోకుండా ఒక సత్రం వద్ద కలుసుకున్నారు. వాని మొహం వీడు గానీ, వీని మొహం వాడు గానీ ఎప్పుడూ చూళ్ళేదు. దాంతో ఇద్దరూ ఎదుటోడు చాలా మంచోడు అని అనుకున్నారు. ఒకరితో ఒకరు మాటల్లో పడ్డారు.

మధ్యలో ఇసుక దొంగ "అన్నా..అన్నా... ఎక్కడికి పోతావున్నావు. ఏముంది నీ కావడిలో” అన్నాడు.

అప్పుడు వాడు. "ఆ... ఏం లేదు. నేను పెద్ద రత్నాల వ్యాపారిని. ఈ రెండు కుండలనిండా మేలు జాతి రత్నాలు వున్నాయి. దారిలో దొంగల భయం ఎక్కువ గదా... అందుకని కుండలకు పాత బట్టలు కట్టినాను. మా పాప పెళ్ళీడు కొచ్చింది. ఈ రత్నాలు అమ్మి బంగారం కొని పాపకు నగలు చేపియ్యాల" అన్నాడు.

ఆ మాటలు వినగానే ఇసుక దొంగ "అబ్బ... వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు వీడు కనబడ్డాడు. ఎట్లాగయినా వీన్ని మోసం చేయాలి" అనుకున్నాడు.

అంతలో పేడ దొంగ "అవును... నువ్వేమి చేస్తా వుంటావు. నీ కుండల్లో ఏమున్నాయి" అన్నాడు. 

దానికా ఇసుక దొంగ చిరునవ్వుతో "అన్నా... నేను  నీ లాగే వ్యాపారినే. కాకపోతే నగల వ్యాపారిని. మంచి మేలు జాతి రత్నాలు కొని వాటిని బంగారంలో పొదిగి విలువైన హారాలు తయారు చేసి అమ్ముతుంటాను. ఈ రెండు కుండలనిండా బంగారం వుంది. దాన్ని అమ్మి విలువయిన రత్నాలు కొనాలని పోతున్నాను" అన్నాడు.

ఆ మాటలు వినగానే పేడదొంగ "అబ్బ.... దొరికినాడురా కావలసినోడు. వీన్ని ఎట్లాగయినా మోసం చేసి వీని దగ్గరున్న బంగారం కొట్టేయ్యాలి" అనుకున్నాడు.

వెంటనే "అరెరే... మనిద్దరినీ ఆ దేవుడు ఒక్క చోట కావాలనే కలిపినట్టున్నాడు. నీకు కావలసిన బంగారం నా దగ్గరుంది. నాకు కావలసిన మేలు జాతి రత్నాలు నీ దగ్గరున్నాయి. మనం ఒకరి కావడి మరొకరు మార్చుకుంటే సరి" అన్నాడు. 

ఆ మాటలకు ఇసుకదొంగ లోపల్లోపల "పడిందిరా పిట్ట" అని నవ్వుకుంటూ "అలాగే నువ్వెలా చెప్తే నేనలాగే" అన్నాడు.

నీ కావడిలో ఏముందో చూపించు అంటే అవతలి వాడు కూడా నీ కావడిలో ఏముందో నువ్వూ చూపించు అంటారు గదా... అందుకని ఇద్దరు గూడా మారు మాట్లాడకుండా.. ఎదుటివాన్ని మోసం చేస్తున్నాం అనుకుంటూ సంబరంగా ఒకరి కావడి మరొకరు మార్చుకున్నారు.

మార్చుకున్నాక క్షణం గూడా ఆలస్యం చేయకుండా ఇసుకదొంగ "అన్నా... జాగ్రత్త. దారిలో దొంగలుంటారు. నీ దగ్గరున్నది బంగారం అని తెలిస్తే అంతే..!    చీకటి పడకముందే తొందరగా ఇంటికి చేరుకో” అన్నాడు.

దానికి వాడు "తమ్ముడూ నువ్వు కూడా రత్నాలను జాగ్రత్తగా ఇంటికి తీసుకొని పో" అంటూ వాడు బైలు దేరాడు.

ఇద్దరూ సంబరంగా పరుగు పరుగున ఇంటికి చేరుకొని కావడి మీద వున్న బట్ట తీసి చూస్తే ఇంకేముంది ఇసుక దొంగ చేతికి పేడ అంటుకుంది. పేడ దొంగ చేతికి ఇసుక వచ్చింది. "అమ్మో నేనే పెద్ద దొంగను అనుకుంటే, అవతలోడు నా కన్నా నాలుగాకులు ఎక్కువే చదివినట్లున్నాడే" అనుకుంటూ ఇద్దరూ గమ్మున నోరుమూసుకున్నారు. 

ఇదీ కథ.!


మిత్రులారా.. .కథ విన్నారుగా... ఈ కథ నుంచే అంతా మోసం అనే అర్థంలో... "ఇసుక తక్కెడ - పేడ తక్కెడ" అనే జాతీయం వచ్చింది.

\

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃


Monday 23 October 2023

అమ్మవారు అనుగ్రహం (24-Oct-23, Enlightenment Story)

 *అమ్మవారు అనుగ్రహం*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁

"డాక్టర్ గారు ఫోన్ చేసారు బ్లడ్ రిపోర్ట్ వచ్చిందిట ‘టైఫాయిడ్’అని చెప్పారు” అన్నారు రామనాధం గారు.

"టైఫాయిడా!?.. “ అంది కంగారుగా శకుంతలమ్మ.

"ఓ పది రోజులు బాగా రెస్ట్ తీసుకుని.... జాగర్తగా మందులు వాడితే తగ్గిపోతుంది కంగారు పడకు" అన్నారు రామనాధం గారు.

"నా భయం, కంగారు, జ్వరం గురించి కాదు, జరుగుబాటు గురించి!" అంది నీరసంగా శకుంతలమ్మ.

"ఏదో తంటాలు పడాలి, తప్పదు మరి!" అన్నారాయన.

"పెద్దమ్మాయి కి ఫోన్ చేసి చూస్తాను" అంటూ రింగ్ చేసి స్పీకర్ ఆన్ చేసారు.

"హలో..హలో..వసంతా!...ఆ...ఆ...నేనే నమ్మా!.. అమ్మ బ్లెడ్ రిపోర్ట్ లు వచ్చాయి,. టైఫాయిడ్ అని చెప్పారు, బాగా జ్వరం, ఒళ్ళు నెప్పులూ, బాగా నీరసంగా ఉంది."

"అయ్యో!! ఇప్పుడెలా నాన్నా! నేను వద్దామంటే మీ మనవడికి సెమిస్టర్ పరీక్షలు, ఆయన కూడా ఉండటంలేదు, ఆయన ప్రోజెక్ట్ పనిమీద రేపు సింగపూర్ వెడుతున్నారు. నెల రోజుల వరకూ రారు. మీరేమో అక్కడ ఒక్కళ్ళూ ఉండద్దంటే వినరు. వీలైతే ఎవరినైనా సాయం తీసుకుని ఫ్లైట్ లో వచ్చెయ్యండి" అంది.

"సరే.. చూస్తాం వసంతా!" అని స్పీకర్ ఆపి ఫోన్ పెట్టేసారు.

"పోనీ చిన్నదానికి ఫోన్ చేస్తారా!? అది రాగలదేమో" అంది శకుంతలమ్మ ఆశగా!

సరేనంటూ, ఫోన్ రింగ్ చేసి స్పీకర్ ఆన్ చేసారు.

"హలో....హలో...సుజాతా! ఆ..ఆ..నేనే, అమ్మకి టైఫాయిడ్ అని చెప్పారు. ఓ పది రోజులు నువ్వు రాగలవేమోనని"

"రేపటి నుండి నాకు ఆఫీస్ లో ఇన్స్పెక్షన్ ఉంది నాన్నా!..... లేకపోతే తప్పకుండా వచ్చేదాన్ని. మీకు కూడా స్పాండిలైటిస్, బేక్ పెయిన్ ఉన్నాయి కదా! అమ్మకి బాగా తగ్గేవరకూ ఏదైనా ఏజెన్సీ నుంచి అన్ని పనులకీ ఓ మనిషిని పెట్టుకుంటే మంచిది" అంది.

"విన్నావుగా.. అదీ సంగతి!" అన్నారు ఫోన్ ఆఫ్ చేసి.

"ఏంచేస్తాం, ఎవరి ఇబ్బందులు వాళ్ళవి. మన తిప్పలేవో మనం పడవలసిందే" అంది శకుంతలమ్మ.

శకుంతలమ్మ కి జ్వరం బాధ కంటె కూడా, మర్నాటి నుండి మొదలయ్యే "దేవీ నవరాత్రి పూజలు" గురించే ఎక్కువ బాధగా ఉంది. ప్రతి సంవత్సరం పది రోజులు కలశం పెట్ట,   నవావతారాలనూ, ప్రతి రోజూ పూజించి, ప్రత్యేక నివేదనలు చేసి, ప్రతిరోజు సువాసినులకి వాయన తాంబూలాలు, పసుపు కుంకుమలు ఇచ్చుకోవడం అలవాటు ఆవిడకి.

ఈ సంవత్సరం పూజ మాట అటుంచి, కనీసం దీపం పెట్టుకునే భాగ్యం కూడా లేదని బాధగా ఉంది.

"ఎదురుగా గోడ మీద కళకళలాడుతూ అభయహస్తంతో, కరుణా పూరిత దృక్కులతో , దివ్య మందహాసంతో ఉన్న అమ్మవారి పటానికి నమస్కారం చేసి దీనంగా మనసులోనే వేడుకుంది… "ఎప్పుడూ నిన్నే భక్తి శ్రద్ధలతో కొలుస్తూ, నీవు తప్ప వేరు దిక్కు లేదని నమ్మిన దాన్ని, నువ్వే నాకు ఏదో దారి చూపి సహాయ పడు తల్లీ!" అని పదే పదే వేడుకుంది.

రామనాధం గారికి ఏం చెయ్యాలో తోచట్లేదు... 'ఈ అవసర సమయంలో సహాయం ఎవరిని అడగాలా, ఎవరు సహాయ పడతారని' ఆలోచిస్తున్నారు.
**********************

కాలింగ్ బెల్ మోగింది,..  మెల్లగా లేచి వెళ్ళి తలుపు తీశారు రామనాధం గారు.

ఎదురుగా.....గౌరి.... నవ్వుతూ.. "నమస్తే అంకుల్" అంది.

"గౌరీ! నువ్వా! ఎలా ఉన్నావమ్మా!?     రా, లోపలికి. అంటూ, హాస్టల్ నుంచి ఎప్పుడొచ్చావు?" అన్నారు కూర్చోమని సోఫా చూపిస్తూ!

"నిన్న రాత్రి వచ్చానంకుల్... ఇప్పుడు దసరా శెలవులు. పండగయ్యేవరకూ ఉంటాను. మిమ్మల్ని,. ఆంటీనీ చూసి వెళదామని వచ్చాను" అంది.

రవణమ్మ గారి కూతురు గౌరి. ఇంటరు రెండో సంవత్సరం చదువుతోంది. తండ్రి చిన్నతనంలోనే పోయాడు. రవణమ్మ గారు కొందరి ఇంట్లో వాడుకగా వంటలు చెయ్యడం, పచ్చళ్ళు, పొడులు, స్వీట్లు, తయారు చేసి అమ్మడం చేస్తూ ఉంటుంది. గౌరి చాలా తెలివైన పిల్ల.  చురుకు కూడా, తల్లికి పనిలో సహాయ పడుతూనే, చదువులో ముందుంటుంది. టెంత్ క్లాసు 90% మార్కులతో పాసైంది . రవణమ్మ గారు ఇంక చదివించలేనంటే.. రామనాధం గారు, గౌరిని దీనదయాళ్ చారిటబుల్ ట్రస్ట్ వారి బాలికల హాస్టల్  లో చేర్పించారు. అక్కడ ఆర్ధికంగా వెనుక బడ్డ తెలివైన విద్యార్ధులకి, ఉచిత విద్య , వసతి కల్పిస్తారు. వారు కనపరిచే ప్రతిభ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తారు.

రామనాధం గారు రవణమ్మ గారి కుటుంబానికి అప్పుడప్పుడు, ఆర్ధిక సహాయం కూడా చేసారు. అందుకే గౌరి హాస్టల్ నుంచి వచ్చినప్పుడు, వాళ్ళని కలిసి వెడుతూ ఉంటుంది.

"అంకుల్! ఆంటీ లేరా? కనిపించలేదు"  అంది లోపలికి చూస్తూ.

"ఉందమ్మా! పడుకుంది. నాలుగు రోజుల నుండి జ్వరం. టైఫాయిడ్ అన్నారు డాక్టర్"

"అయ్యో!..   మరి మీకు సహాయం ఎవరు!?"

"మా అమ్మాయిలిద్దరూ రాలేని పరిస్ధితిలో ఉన్నారు. అదే ఏం తోచట్లేదు!" అన్నారు దిగులుగా.

"అంకుల్ మీకు అభ్యంతరం లేకపోతే నేను వచ్చి మీకు,...... ఆంటీకీ సహాయంగా ఉంటాను"

"నువ్వా?! ఎందుకమ్మా!......నీకు శ్రమ"

"నాకు శ్రమేం లేదు అంకుల్, ఇంటికెళ్ళి అమ్మ తో చెప్పి,. నా బట్టలు, పుస్తకాలు తెచ్చుకుని వస్తాను. నాకిప్పుడు ఎలాగా శెలవలే కదా! మీరు నాకు చేసిన సహాయానికి, ఇది నాకో అవకాశం మీ ఋణం తీర్చుకోవడానికి. ఒక గంటలో వస్తాను అంకుల్" అంటూ లేచింది.
**********

దేవుడు పంపినట్టు "దేవత" లా వచ్చిన గౌరి రాకతో సగం భారం తీరింది రామనాధం దంపతులకి.

శకుంతలమ్మ గారి మనసు తెలిసిన గౌరి,. ఉదయాన్నే లేచి, దేవుడి గది శుభ్రం చేసి, పూజా సామాగ్రి తోమి,  స్నానం చేసి ఆరేసిన బట్టలు కట్టుకుని,. అమ్మవారికి ధూప దీపాలతో పాటు,  శకుంతలమ్మ గారిని అడిగి... ప్రసాదం కూడా చేసి నివేదించేది.

రామనాధం గారికి కూడా ఇబ్బంది లేకుండా సమయానికి,.. బ్రేక్ ఫాష్ట్, భోజనం ఏర్పాటు చేసేది.

శకుంతలమ్మ గారికి, సమయానికి మందులు వెయ్యడం , డాక్టర్ గారి సలహా అనుసరించి ఆహారం, పళ్ళరసాలు, తయారు చేసి సమయానికి ఇవ్వడం, స్పాంజి బాత్ చేయించి, బట్టలు మార్పించడం, కన్నకూతురిలా ప్రేమగా, అభిమానంగా చేసేది.

పనంతా అయ్యాక,. కొంచెం సేపు తన పాఠాలు చదువుకునేది.  గౌరి సేవలతో, శకుంతలమ్మ గారి జ్వరం కొంచెం తగ్గుముఖం పట్టింది. విజయ దశమి రానే వచ్చింది. శకుంతలమ్మ మెల్లగా లేచి గౌరి సాయంతో దీపం పెట్టింది దేవుడికి. పూజ పూర్తయిన తరువాత ఒక పళ్ళెంలో చక్కని చీర, పసుపు కుంకుమ, పూలు పెట్టి అమ్మవారికి సమర్పించింది. ప్రతి సంవత్సరం అలా సమర్పించిన చీర గుడిలో అమ్మవారి కి ఇస్తుంది.

ఈసారి ఆలా చెయ్యలేదు. "కులమత, వర్ణ, వయో, బేధాలెంచకుండా,.. ప్రతి జీవిలో భగవంతుని చూడమన్న ఆర్యోక్తి ని స్మరించుకుని, మనిషి రూపంలో సమయానికి వచ్చి ఆదుకున్న "దేవత"లాంటి గౌరికే ఆ వాయినం తీసుకునే అర్హత ఉందని" భావించింది

గౌరిని కూర్చోపెట్టి, పసుపురాసి, బొట్టు పెట్టి, గంధం పూసింది, చేతికి అక్షింతలు ఇచ్చి, అమ్మవారికి సమర్పించిన చీర, పసుపు కుంకుమ, పూలు ఉన్న పళ్ళెం గౌరి చేతికిచ్చి "నువ్వే ఈ సంవత్సరం నేను సమర్పించే వాయినం అందుకుంటున్న అమ్మవారివి" అంది భక్తిగా కాళ్ళకి నమస్కరించి.

గౌరి కంగారు పడిపోయింది "నాకు నమస్కరించడం ఏంటి ఆంటీ" అని.

"తప్పులేదమ్మా! అమ్మవారి స్ధానం లో నిన్ను భావించి వాయినం ఇచ్చాను కనుక నమస్కరించవచ్చు" అంది శకుంతలమ్మ మనస్ఫూర్తిగా!

శకుంతలమ్మ బాగా కోలుకుంది. దగ్గరలోని అమ్మవారి గుడికి వెళ్ళింది.

గుడిలో రవణమ్మ గారు కన్పించింది. కుశల ప్రశ్నలు అయ్యాక "దసరాల్లో మీకు ఒంట్లో బాగులేదని
విన్నాను. ఈసారి దసరాకి నేను, మా గౌరి.. మా తమ్ముడి ఊరు వెళ్ళాం".

"ఆవిడ ఇంకా ఏమో చెప్తోంది. శకుంతలకి అవేం వినిపించడం లేదు. అమ్మవారి మూల విరాట్ కి తాను విజయ దశమినాడు గౌరికి వాయనంలో ఇచ్చిన చీర కట్టి ఉంది. అమ్మవారి మూల విరాట్   కరుణా మయ దృక్కులతో, మధుర మందహాసంతో...  అభయ హస్తమిస్తూ.... కళ్ళముందు కదలాడుతోందంతే".....!?!✍️


\
        
 🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃

Sunday 22 October 2023

అందమే ఆనందం (23-Oct-23, Enlightenment Story)

 *అందమే ఆనందం*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁

'మనం ఆనందంలో పుట్టాం... ఆనందంగానే ఉన్నాం' అంటాడు ఒక వేదాంతి. అందుకు సాక్ష్యంగా 'ఆకాశం బ్రహ్మ... ఆనందం బ్రహ్మ' అంటాడు. ప్రపంచంలో నూటికి తొంభైమంది అదేమిటో తెలియనట్లు కనిపిస్తారు. ఏదో పోగొట్టుకున్నవా రిలా, దేని కోసమో వెదుకుతున్నట్లుగా అనిపిస్తుంది. తల్లి ఒడిలోనో ఉయ్యాల్లోనో పడుకుని, కాళ్లు చేతులు ఊపుతూ ఆనందంగా కేరింతలు కొట్టే పిల్లల్ని చూసిన ప్పుడు మనం ఆనంద స్వరూపులమేనన్న ఎరుక కలుగుతుంది. పెరిగి పెద్ద అవుతున్నకొద్దీ ఆ ఆనందం తరిగిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? ప్రశ్నకు సమాధానం మన లోపలే ఉంది. 

సృష్టిలోని ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనిషి జన్మ ఉత్తమమైనదంటారు. అయితే, అడుగడుగునా మనిషి ఆనందానికి దూరం అవుతుండటానికి కారణం అజ్ఞానం లేదా అవిద్య అంటారు. విజ్ఞులు. ఏ జీవికీ లేని ఆలోచనా శక్తి, వివేచనా జ్ఞానం ఉన్నప్పటికీ, అవి పని చేయకపోవడం వల్ల, బిడ్డను చంకలో పెట్టుకుని ఊరంతా గాలించే తల్లిలా చాలామంది తల్లడిల్లుతూ ఉంటారు. ఎక్కడ ఆనందం ఉన్నదో జాడ తెలి యక, వెతకకూడని చోట దాని కోసం వెతుకుతూ ఆయాసపడుతుంటారు.

ఆనందం ఒక అనుభూతి. అది పర మాత్మ స్వరూపం. వస్తు ప్రపంచంలో అది కనిపించదు. కనిపించే ప్రతి వస్తువూ నశిస్తుంది- బుద్ధుడు. మన ఇంద్రియాలు సాధా రణంగా బయటి ప్రపంచాన్నే పట్టు కుని వేలాడుతూ ఉంటాయి. చూపు అందాన్ని, వినికిడి సుస్వరాన్ని, నాసిక సువాసనను, నాలుక సురుచిని కోరతాయి. పువ్వు వాడిపోతుంది. రాగం ఆగిపో తుంది. సెంటు సువాసన కొంతసేపటికి మాయమవుతుంది. తినగ తినగ తీపి చేదవుతుంది. కాలాధీనమైన వస్తు ప్రపంచంలో అన్నీ తాత్కాలికమైనవే! వాటిపై ఆధారపడ్డ ఇంద్రియాలకు, ఆపై మనసుకు, నిలకడ కరవైపోతుంది. ఆవేదన, అన్వే షణ మళ్ళీ ప్రారంభం అవుతాయి. ఇంద్రియాలకు తాత్కాలికంగా కలిగే తృప్తిని సుఖం అని, మనసులో చెలరేగే ఉల్లాసాన్ని సంతోషం అని అంటారు. అంతకు మించిన ఆనందం కోసం మానవ హృదయం ప్రతి క్షణం తపిస్తూ ఉంటుంది.

ఆనందం కోసం బయట వెతకడం మాని, అంతరంగంలో అన్వేషించమంటారు అనుభవజ్ఞులు. బంధానికైనా, మోక్షానికైనా మననే కారణం అంటుంది గీత. గనిలో పనిమనిషిలా మనో దీపాన్ని వెలిగించుకుని, హృదయ మందిరాన్ని ప్రవే శిస్తే, సాగర మధనంలో అమృత భాండంలా, అంతరంగ మథనం ద్వారా మనం ఆనంద రసాన్ని ఆస్వాదించవచ్చు. మన లోపల ఉన్న ఒక అద్భుత ప్రపంచాన్ని 'లో చూపు'తో అందుకోవచ్చు.

ఆనందం తరగని ధనం. అమృతంలాగా అంతం లేనిది. 'ఆనందామృతం' అన్న పదబంధమే అందుకు ప్రబల నిదర్శనం. మానసిక స్థితి శీతోష్ణ పరిస్థితుల పైన ఆధారపడినంత కాలం, ఆనందం అందని ద్రాక్షపండే! ధ్యాననిష్ఠలో మనసును నియంత్రించి, ఏకాగ్రబుద్ధితో ఆనంద స్వరూపాన్ని, నాదబిందు కళారూపాన్ని ఆరాధించే యోగికి ఆనందం కరతలామలకం అవుతుంది.

ఆ బ్రహ్మాది దేవతలకు అందని దివ్యానుభూతిని ధ్యానయోగంలో సంపాదించు కోవాలి. అందుకు సాధనకు మించిన రాజమార్గం కనిపించదు. తరగని అందం సాక్షాత్కరించినప్పుడు కరిగిపోని ఆనందం వరిస్తుంది. హృదయారవిందంలో అన వరతం రసీభవించే ఆనంద రసస్వరూపుడు ఆ భగవంతుడొక్కడే. అదే అందం! దాని అనుబంధమే ఆనందం! అందుకే 'అందమే ఆనందం' అన్నాడు కవి.

 🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃

Thursday 19 October 2023

భక్తియోగం (20-Oct-23, Enlightenment Story)

 *భక్తియోగం*

🍁🍁🍁🍁

భక్తియోగంలో భక్తుల గురించి, వారికి ఉండవలసిన లక్షణముల గురించి పరమాత్మ వివరించాడు. వాటిని ఒక్కసారి పరిశీలిద్దాము.

  • ఎవరినీ ద్వేషించకూడదు.
  • అతి మమకారము పనికిరాదు
  • అహంకారము అసలు పనికిరాదు. 
  • అందరి పట్ల కరుణ దయ కలిగి ఉండాలి.
  • నుఖదుఃఖములు సమంగా చూడాలి.
  • అన్ని సందర్భములలో ఓరుకలిగి ఉండాలి..
  • ఎప్పుడూ సంతోషంగా, సంతుష్టిగా ఉండాలి.
  • మనసును అదుపులో ఉంచుకోవాలి. 
  • చంచల స్వభావం కాకుండా ధృఢమైన నిశ్చయం కలిగి ఉండాలి.
  • మనసును, బుద్ధిని ఆత్మలో ఉంచాలి.
  • భయం అనేది వదిలిపెట్టాలి. తాను ఎవరికీ భయపడకూడదు, ఇతరులను భయపెట్టకూడదు.
  • కోపం వదిలిపెట్టాలి, ఎక్కువ ఆనందము, ఎక్కువగా భయపడకూడదు. 
  • దేని మీద ఎక్కువగా మమకారము. అపేక్ష కలిగి ఉండకూడదు.
  • ఎల్లప్పుడూ శరీరమును, మనసును శుభ్రంగా ఉంచుకోవాలి. 
  • ప్రతి కార్యమును శ్రద్ధతో సమర్థతతో చేయాలి, చెయ్యాల్సివచ్చిందే అని చేయకూడదు. 
  • దేని మీద అత్యధికమైన ప్రేమ, పక్షపాతము చూపకుండా తటస్థంగా ఉండాలి. 
  • మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఏ వ్యాకులత చెందకూడదు.
  • ఏ పని చేసినా ఫలితం ఆశించకుండా చేయాలి. ఆ ఫలితమును పరమాత్మకు అర్పించాలి. 
  • తనకు సుఖం కలిగి నపుడు పొంగి పోయి నా అంతవాడు లేడనకూడదు.
  • ఇతరులమీద ఎట్టి పరిస్తితుల మీద అసూయ పడకూడదు. ద్వేషించకూడదు. 
  • అన్ని కాలాలలో చిరునవ్వుతో ఉండాలి ఏడుస్తూ ఉండకూడదు.
  • కోరికలను అదుపులో ఉంచుకోవాలి, కోరికలను విడిచిపెడితే మరి మంచిది.
  • శుభము, అశుభము రెండింటినీ సమానంగా అనుభవించాలి.
  • శత్రువులు మిత్రులను సమానంగా ఆదరించాలి.
  • మానము అవమానము రెండింటినీ చిరునవ్వుతో భరించాలి. 
  • ఒకప్పుడు పొంగి పోవడం మరుక్షణం కుంగి పోవడం పనికిరాదు.
  • అనవసరమైన విషయాలలో ఆసక్తిని వదిలిపెట్టాలి. 
  • కాలానుగుణంగా వచ్చే ఎండ చలి వర్షము వీటిని సమత్వభావంతో భరించాలి.. 
  • ఎవరు మనలను నిందించినా, పొగిడినా చిరునవ్వుతో స్వీకరించాలి.
  • సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. 
  • ఏదొరికితే దానితో తృప్తి చెందాలి, లేని దాని కోసం పాకులాడకూడదు.
  • ఉన్న స్థలము శుభ్రంగా ఉంచుకోవాలి. 
  • ఎల్లప్పుడూ స్థిరమైన బుద్ధి కలిగి ఉండాటి చంచలత్వము పనికిరాదు. 
  • ఈ అనంత విశ్వానికి అధిపతి అయిన పరమాత్మ ఎడల భక్తి కలిగి ఉండాలి. ఇవి కేవలం భక్తులకే కాదు సాధారణమానవులుకూడా ఆచరించవలసిన లక్షణములు. భక్తులు ప్రతిరోజూ పరమాత్మను పూజిస్తారు. దానికి పత్రం, పుష్పం, ఫలం, తోయం సరిపోతాయి అని చెప్పాడు పరమాత్మ.

 🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃

Wednesday 18 October 2023

మనం తీసుకునే ఆహారంలో 5 విధాలైన దోషాలు (19-Oct-23, Enlightenment Story)

 * మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు *

🍁🍁🍁🍁🍁🍁 🍁🍁🍁🍁🍁🍁🍁🍁 🍁🍁🍁🍁🍁

మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి...

1.  అర్ధ దోషం   2. నిమిత్త దోషం  3.  స్ధాన దోషం   4.  గుణ దోషం   5.  సంస్కార దోషం

 అర్ధ దోషం

ఒక సాధువు  తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో  ఒక వ్యక్తి  వచ్చి ఆ శిష్యునికి  ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు.భోజనం చేసి, సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు. ఆ గదిలోనే  శిష్యుడు ఉంచిన డబ్బు మూట వుంది

హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది, ఆ మూటలో నుండి కొంత డబ్బును తీసుకుని తన సంచీలో దాచేశాడు. తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని, తిరిగి తన ఆశ్రమానికివెళ్ళి పోయాడు. మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు

తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దుననే  మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్థం చేసుకున్నాడు.వెంటనే  తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, ఆ డబ్బును  తిరిగి ఇచ్చేశాడు. తర్వాత శిష్యుడిని ఎలాంటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు

శిష్యుడు తలవంచుకొని, "నన్ను క్షమించండి, స్వామి! యిది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు." అని తలవంచుకొన్నాడు

ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో, తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం. మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని, భుజించడం ముఖ్యం

నిమిత్త దోషం

 మనం తినే ఆహారాన్ని  వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమ కల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి. వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాక కూడదు. ఆహారం మీద దుమ్ము, శిరోజాలు  వంటివి పడ కూడదు

అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి దుష్ట గుణాలు అవతలివారికి అబ్బుతాయి

భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుధ్ధంలో బాణాలతో  కొట్టబడి, యుధ్ధం ముగిసేవరకు అంపశయ్య పై ప్రాణాలతోనే  వున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడు వున్నారు. వారికి భీష్ముడు మంచి మంచి  విషయాలను  బోధిస్తూ వచ్చాడు

అప్పుడు ద్రౌపది కి ఒక అనుమానం కలిగింది. ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తు మాట్లాడే భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు ఊడ్చమని దుశ్శాసనునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాటాడలేక పోయాడు? అని అనుకొన్నది

ఆమె మనసులో ఆలోచనలు గ్రహించిన భీష్ముడు

'అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను .నా స్వీయ బుధ్ధిని ఆ ఆహారం తుడిచి పెట్టింది. శరాఘాతములతో, ఛిద్రమైన దేహంతో, ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున, పాత రక్తం - బిందువులుగా బయటికి పోయి నేను ఇప్పుడు పవిత్రుడినైనాను

నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు భీష్ముడు. చెడ్డ గుణములు వున్న వారు ఇచ్చిన ఆహారం తినినందువలన మనిషిలోని మంచి గుణములు నశించి నిమిత్త దోషం' ఏర్పడుతోంది

 స్ధాన దోషం

ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి. వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాల వలన చేయబడిన వంటకూడా పాడైపోతుంది

యుధ్ధరంగానికి, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంత మంచివి కావు

దుర్యోధనుడు  ఒకసారి యాభైఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని  విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని యింటికి భోజనానికి వెళ్ళాడు. 

కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది.  తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి,  ఆనంద సంభ్రమాలతో తొందర పాటు పడి, అరటి పండు తొక్కవలిచి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే  తీసుకొని  ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, "విదురా! నేను ఆప్యాయతతో  కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధా భక్తులతో యిచ్చిన ఫలమో, పుష్పమో, తోయమో, జలమో, ఏదైనా సంతోషంగా తీసుకుంటాను అని అన్నాడు

మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి

గుణ దోషం

మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా వుండాలి. సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని  లౌకిక మాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది

సంస్కారదోషం

ఆహారం వండే వారి సంస్కారం బట్టి దోషం ఏర్పడుతుంది. సంస్కారవంతుల చేతి వంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతి వంట లేని పోని రోగాల్ని తెచ్చి పెడుతుంది.

 🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃

Tuesday 17 October 2023

పాలు...ఈశ్వరా !! (18-Oct-23, Enlightenment Story)

*పాలు...ఈశ్వరా !!*

🍁🍁🍁🍁🍁🍁 🍁🍁

🎻🌹🙏ఒకసారి "పాలు" ఈశ్వరుని గురించి తపస్సు చేసింది. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యేక్షమై ఏమి నీ సమస్య అని అడిగాడు. 

 అప్పుడు  పాలు...ఈశ్వరా !! 

 నేను ఆవు నుంచి, బర్రె నుంచి వచ్చినప్పుడు శుద్ధంగా, పరిశుద్ధముగా ఉంటాను.. అయితే ఈ పాపిష్టి మానవుడు వాడి స్వప్రయోజనము కోసం నాలో పులుపు వేసి నా మనసును విరిచేస్తున్నాడు. నన్ను రక్షించు అని చెప్పి భాదపడిందట. 

 అప్పుడు ఈశ్వరుడు ఓ చిరు నవ్వు నవ్వి... 

  • ఓ క్షీరమా... ఇది విను, నీవు పాలు లా జీవించాలి అని ఆశ పడే ముందు నా మాట విను.. నీవు పాలు లాగా అయితే ఒకరోజు మాత్రమే బ్రతుకుతావు. 
  •  పాలకు పెరుగు తోడు వేస్తే రెండు రోజులు బ్రతుకుతావు., 
  •  పెరుగుని చిలికి చల్ల ని చేస్తే పుల్లపుల్లగా ఇంకో రెండు రోజులు బ్రతుకుతావు. 
  •  అదే చల్ల లోంచి వచ్చిన వెన్న అయితే వారం రోజులు బ్రతుకుతావు, అ వెన్నను బాగా కాచి దాంట్లో రెండు తమలపాకులు వేసి నెయ్యి చేస్తే మంచి ఘుమ ఘుమలతో  నెలలు తరబడి బ్రతుకుతావు. 
  •  ఆ నెయ్యితోనే దీపం పెడితే నాకు అర్పణవు అవుతావు..
  • ఇప్పుడు చెప్పు... ఒక రోజు పాలు లాగా ఉండి పాలలాగానే చస్తావా లేక క్షణక్షణం అనుక్షణం, రోజు రోజూ పెరిగి రూపాంతరం చెంది నాకు అర్పణవు అవుతావా... అని ఈశ్వరుడు ప్రశ్నించారు.. 
  • దేవుని మాటకి "పాలు" మూగబోయింది, ఈశ్వరునికి దాసోహం  అయ్యింది. తన మనసులో ఉన్న అంధకారానికి సిగ్గుపడి బయటకు వచ్చింది. ఈశ్వరుడు ముందు ప్రజ్వలించి దీపంలా నిలిచిపోయింది... 

మానవుడు కూడా అట్లాగే.. ఎవరో తమ మనస్సుని విరిచేసారు అని మనస్సుని పాడుచేసుకుని బాధపడేకంటే.. క్షీరము వలె మనస్సు లో ఆధ్యాత్మికత అనే తోడు వేసి, ప్రతి పరిస్థితులలోనూ ఆ ఆధ్యాత్మికతను ఈశ్వర నామ స్మరణతో చిలికి , దానిని దైవ చింతనం తో కాచి, దానిలోంచి వచ్చిన జ్ఞానం తో ఎప్పుడు ఎప్పుడా అని ఆ ఈశ్వరుని లో ఏకమవటానికి ఎదురు చూస్తూ జన్మను సార్ధకం చేసుకోవాలి...🌞🙏🌹🎻

 🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃

Monday 16 October 2023

సాధువు, సత్పురుషుడు అంటే (17-Oct-23, Enlightenment Story)

*సాధువు, సత్పురుషుడు అంటే*

🍁🍁🍁🍁🍁🍁 🍁🍁🍁🍁🍁

హైదరాబాద్ కి చెందిన  ప్రముఖ వ్యాపారవేత్త, వారు హైదరాబాద్  శివారు పల్లెటూరులో కొంతభూమిని కొని, అక్కడ ఒక  ఫామ్ హౌస్ ని కట్టుకున్నారు. ఆ ఫామ్ హౌస్ వెనుక వైపు  ఒక చక్కని స్విమ్మింగ్ పూల్, గార్డెన్ కూడా ఏర్పటుచేసుకున్నారు. వాటితో పాటూ అక్కడ ఒక పెద్ద ఆహ్లాదపరిచే 50 ఏళ్ళ నాటి మామిడిచెట్టు కూడా ఉంది. నిజానికి ఆయన ఆ ఆస్తి కొన్నది కూడా ముఖ్యంగా ఆ పెద్ద మామిడిచెట్టును చూసి ముచ్చటపడేవాడు.

ఆ కొత్త ఇంటికి వాస్తు చూపించుకుని తగినమార్పులు చేయించుకోమని వారికి సన్నిహితులు గట్టిగా సలహా ఇచ్చారు. వ్యాపారవేత్త వాస్తును పరిశీలించే శాస్త్రిగారిని తీసుకొని కారులో ఇద్దరూ  బయలుదేరారు.

కొంతప్రయాణం తర్వాత వారు వెళ్తున్న దారిలో వ్యాపారవేత్త కారును కొద్దిగా పక్కకు పోనిచ్చి, వెనుకగా ఓవర్ టేక్ చేసి వస్తున్న కొన్ని కార్లకు దారి ఇవ్వడం చూసిన శాస్త్రి గారు    చిరునవ్వుతో మీ డ్రైవింగ్ నిజంగా చాలా సురక్షితమైనది అన్నారు.

దానికి  వ్యాపారవేత్త నవ్వుతూ అయ్యా! వారికి ఎదో అత్యవసరపని అయిఉండొచ్చు, అందుకే తొందరగా వెళ్తున్నారు. అలాంటి వారికి ముందుకు వెళ్ళడానికి మనం దారిఇవ్వడం మన ధర్మం కదండీ! అన్నారు.

అక్కడ నుండి కారు చిన్న పల్లెటూరు సమీపించింది. అక్కడి వీధులు చిన్నగా ఇరుకుగా ఉండడంతో వ్యాపారవేత్త  కారు వేగం తగ్గించి నెమ్మదిగా నడుపుతున్నారు. 

ఇంతలో హఠాత్తుగా ఒక కొంటె కుర్రాడు రోడ్డుకు అడ్డంగా ఒక్కసారిగా పరిగెత్తాడు. గమనించిన వ్యాపారవేత్త అతడిని తప్పించి తన కారును మరింత  నెమ్మదిగా పోనిస్తున్నారు. అది ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. ఇంతలో అదే దారిలో మరో కుర్రాడు కూడా అలాగే హఠాత్తుగా పరిగెత్తుతూ ముందుకు వెళ్ళిపోయాడు.

ఈసారి ఆశ్చర్యపోవడం శాస్త్రిగారి వంతైంది. 

సార్! ఇలా ఇంకో పిల్లాడు మరలా వస్తాడని మీరెలా ఊహించారు అని ప్రశ్నించారు.  దానికి వ్యాపారవేత్త నవ్వుతూ పిల్లలెప్పుడూ అంతేకదండి! ఒకడి వెంట మరొకడు వెంటపడుతూ ఆడుకుంటారు. వెనుక ఇంకొకడు లేకుండా ఒక్కడే ఎప్పుడూ అలా ఆడుకోరు కదా? అన్నారు. కారు ఫామ్ హౌస్ కి చేరుకుంది. 

కారులోంచి వారు క్రిందికి దిగుతుండగా, అక్కడ ఒక్కసారిగా కొన్ని పక్షులు రెక్కలు కొట్టుకుంటూ  పైకి ఒక్కసారిగా ఎగిరాయి,

అది చూసిన వ్యాపారవేత్త శాస్త్రిగారిని  ఆపి, సర్ మీరు ఏమీ అనుకోకపోతే, మనం కొద్ధి సేపు ఇక్కడే  ఆగి వెళదాం.. అక్కడ వెనక వైపు ఎవరో కొంతమంది పిల్లలు చెట్టెక్కి మామిడిపళ్ళు కొస్తున్నట్లు ఉంది, మనం కనుక హఠాత్తుగా వెళ్తే వాళ్ళు మనల్ని చూసి భయపడి చెట్టునుండి దూకితే క్రిందపడిపోతారు.

ఎందుకండీ అనవసరంగా

అంతలా వాళ్ళని భయపెట్టి సాధించేదేముంది అన్నారు. శాస్త్రి గారు కొంతసేపు స్తబ్దుగా ఉండిపోయారు.  ఆపై నెమ్మదిగా ఇలా అన్నారు. 

ఈ ఇంటికి ఎటువంటి వాస్తు మార్పులు చేర్పులు అవసరం లేదు ! ఈసారి ఆశ్చర్యపోవడం వ్యాపారవేత్త వంతైంది. ఏమి?ఎందుకండి?  ఏ ప్రదేశం అయినా, మీలాంటి ఉత్తములు నివసిస్తూ ఉంటే, సహజంగానే అది ఉత్తమమైన వాస్తుగానే, దానంతట అదే మార్పు చెందుతుంది, సందేహం లేదు.

ఎప్పుడైతే మన ఆలోచనలు, ఆకాంక్ష ఇతరుల శ్రేయస్సు, సంక్షేమం కోరుకుంటాయో, ఆ ఫలితం లబ్దిపొందే వారికే కాక, అది మనకి కూడా మంచి చేస్తుంది. అయితే ప్రత్యేకించి ఎల్లప్పుడూ అన్నిసమయాల్లోనూ ఇతరుల సంక్షేమం కాంక్షించే వ్యక్తి,  వారికి తెలియకుండానే మహోన్నతుడు, సత్పురుషుడుగా మారిపోతాడు. అలాంటి వారికి ఒక వాస్తేకాదు, ఎలాంటి దోషాలూ కూడా దరిచేరవు!

నిజానికి సాధువు, సత్పురుషుడు అంటే  ఎల్లప్పుడూ సమాజానికి మేలు చేసే వ్యక్తులే కదా! 

!!ధర్మస్య విజయోస్తు !! అధర్మస్య నాశోస్తు   !! ప్రాణిషు సద్భావనాస్తు  !!విశ్వస్య కళ్యాణమస్తు. !!

🍂యతోధర్మః తతోజయః

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃

Sunday 15 October 2023

శ్రీ శైలపుత్రి దేవీ (16-Oct-23, Enlightenment Story)

 *శ్రీ శైలపుత్రి దేవీ*

🍁🍁🍁 🪷🕉️🪷 🍁🍁🍁

దుర్గామాత మొదటి స్వరూపము ‘శైలపుత్రి’ నామముతో ప్రసిద్ధికెక్కినది. సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి, పిదప పర్వతరాజైన హిమవంతుని ఇంట పుత్రికయై అవతరించినందున ఆమెకు శైలపుత్రి అను నామము ఏర్పడినది. శైలపుత్రి అవతారములో ఆమె పరమేశ్వరుణ్ణే పరిణయమాడుతుంది. వృషభవాహనారూఢయైన ఈ మాతకు కుడిచేతిలో త్రిశూలము, ఎడమచేతిలో కమలము విరాజిల్లుచుండును. తలపై చంద్రవంకను ధరించియుండును. పార్వతి, హైమవతి అనునవియు ఆమె పేర్లే. శైలపుత్రి మహిమలు, శక్తులు అనంతములు. వాంఛితములను ప్రసాదించు తల్లి. ఈ అమ్మవారిని పూజించటం వలన మోక్ష సామ్రాజ్య సిద్ధి పొందవచ్చు, అష్ట దారిద్య్రం పోగోడుతుంది. ఈ అవతారమే నవదుర్గలలో మొదటి రోజున ఈ అమ్మ వారిని పూజిస్తారు. భక్తులు పూజలూ, ఉపవాసాలూ జరుపుకుంటారు. మొదటి రోజున యోగులు ఉపాసనద్వారా తమ మనస్సులను మూలాధారచక్రంలో స్థిరపరుచుకుంటారు. దీనితోనే వారి యోగ సాధనలు ఆరంభమవుతాయి.నవదుర్గలలో మొదటి అవతారమైన ‘శైలపుత్రి’ యొక్క మహిమలూ, శక్తులూ అనంతములు.

కథ :

పూర్వజన్మలో ఈమె దక్ష ప్రజాపతికి పుత్రిక దాక్షాయని. అ జన్మలో ఈమె పేరు సతీదేవి. ఈమె పరమేశ్వరుని పరిణయమాడినది. ఒకసారి దక్షుడు నిరీశ్వర యాగమును ఆచరిస్తాడు. దేవతలు తమతమ యజ్ఞభాగములను స్వీకరించటానికై దక్షుడు వారిని ఆహ్వానిస్తాడు. కానీ పరమశివుని మాత్రము ఆ యజ్ఞానికి పిలువడు. తన తండ్రి ఒక మహాయజ్ఞమును సంకల్పించిన విషయం సతీ దేవికి తెలుస్తుంది. “కారణము ఏమోగానీ, దక్షుడు మనపై కినుకుబూనినాడు. ఆ యాగమును వీక్షించుటకై సతీదేవి మసస్సు ఉబలాటపడుతుంది. అప్పుడు ఆమె పరమేశ్వరునికి తన కోరికను తెలియజేస్తుంది. దక్ష ప్రజాపతి ఆ యాగమునకు నకు దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. యజ్ఞభాగములనుగూడ వారికి సమర్పించుచున్నాడు. కానీ ఉద్దేశ్యపూర్వకముగానే మనలను పిలువలేదు. కనీసము సమాచారమునైననూ తెలుపలేదు. ఇట్టి పరిస్థితిలో నీవు అచటికి వెళ్ళుట ఏ విధముగను మంచిదిగాదు” అని హితవు బోధించారు. శంకరుని ఈ హితవచనము ఆమె చెవికెక్కలేదు. ఈ యజ్ఞమిషతోనైనా అక్కడికి వెళ్ళి తన తల్లినీ, తోబుట్టువులనూ చూడవచ్చునన్న కోరిక ప్రబలంగా ఉండటంతో అనుమతికై ఆమె పట్టుబడుతుంది. ఆమె పట్టుదలను చూసి, చివరకు శంకరుడు అనుమతిస్తారు. సతీదేవి తన తండ్రి ఇంటికి వెళ్ళినప్పుడు  ఇంత్లోవారు ఎవ్వరూ ఆమెతో మాట్లాడరు, ఆదరించరు. అందరూ ముఖాలను పక్కకు తిప్పుకొంటారు. తల్లి మాత్రము ఆమెను ప్రేమతో కౌగిలించుకొంటుంది. తోబుట్టువుల పలుకులలో వ్యంగ్యం, పరిహాసమూ నిండి ఉంటాయి. తనవారి ప్రవర్తనకు ఆమె మనస్సు కలత చెందుతుంది. అందరిలోనూ శంకరుని పట్ల నిరాదరణభావమే ఉండటం ఆమె గమనిస్తుంది. తండ్రియైన దక్షుడు ఆమెతో అవమానకరంగా మాట్లాడతాడు. ఇదంతా అనుభవించిన పిమ్మట, సతీదేవి హృదయము క్షోభతో, క్రోధముతో ఉడికిపోతుంది. ‘పరమేశ్వరుని మాటను పాటించక నేను ఇచ్చటికివచ్చి పెద్ద పొరపాటే చేసితిని‘ అని ఆమె అనుకుంటుంది. తన భర్తఅయిన పరమేశ్వరునికి జరిగిన ఈ అవమానమును ఆమె సహించలేక వెంటనే ఆమె తన రూపమును అక్కడికక్కడే యోగాగ్నిలో భస్మము గావిస్తుంది. భరింపలేని ఈ దారుణదుఃఖకరమైన సంఘటనను గురించి విని, పరమశివుడు క్రోధితుడవుతాడు. ఆయన తన ప్రమథగణాలను పంపి దక్షుని యజ్ఞాన్ని పూర్తిగా ద్వంసం చేయిస్తారు. సతీదేవి యోగాగ్నిలో తన తనువును చాలించి, మరుజన్మలో శైలరాజైన హిమవంతునికి పుత్రికగా అవతరిస్తుంది. అప్పుడు ఆమె ‘శైలపుత్రి’గా ప్రసిద్ధికెక్కుతుంది. పార్వతి, హైమవతి అన్నవి కూడా ఆమె పేర్లే. ఉపనిషత్తులోని ఒక కథను అనుసరించి, ఆమె హైమవతీ రూపంలో దేవతల గర్వాన్ని ఆణచివేస్తుంది. మహిషాసురుని సంహరించేందుకు యుద్ధంలో మొదటిరోజు పరాశక్తి ఇలా పార్వతీదేవిగా వచ్చింది. కాబట్టే నవరాత్రుల మొదటిరోజు శైలపుత్రీ దుర్గాదేవిని ఆరాధిస్తారు.


ధ్యాన శ్లోకం:

“వందే వాంచితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం 

వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీం”

వృషభాన్ని అధిరోహించి, కిరీటంలో చంద్రవంకను ధరించి, యశశ్శు కలిగి, భక్తుల మనః వాంఛలను తీర్చే మాతా శైలపుత్రీ దుర్గా దేవికి నమస్కరిస్తున్నాను అని పై శ్లోకానికి అర్ధం.


🚩🙏 ఓం శ్రీ మాత్రేనమః 🙏🚩

🍁🍁🍁 🪷🕉️🪷 🍁🍁🍁

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃

ఎగ దీస్తే బ్రహ్మ హత్య - దిగ దీస్తే గో హత్య అనే మాట ఎలా వచ్చింది? (29-Apr-24, Enlightenment Story)

  ఎగ దీస్తే బ్రహ్మ హత్య -  దిగ దీస్తే గో హత్య అనే మాట ఎలా వచ్చింది?     🌺🍀🌺🍀 🌺 🌺🍀🌺 🌺🍀🌺🍀 🌺 🌺🍀🌺 🌺🍀🌺🍀 🌺 🌺🍀🌺           ...