Thursday 2 March 2023

నామత్రయం (05-Mar-23, Enlightenment Story)

*నామత్రయం*

🌷🙏🌷🌷🙏🌷🌷🙏 🌷🌷🙏🌷🌷🙏

👉 నామ త్రయం అంటే మూడు నామాలు. అవి 'శ్రీ అచ్యుతాయ నమః, శ్రీ అనంతాయ నమః, శ్రీ గోవిందాయ నమః' ఈ మూడు నామాలు నిత్యం చదివేవారికి కలి ప్రేరితమైన రోగాలు రావు. జబ్బులు ఏమైనా ఉంటే అనతి కాలంలోనే తగ్గిపోతాయి.

👉 ఈ నామాలు ఒక దివ్యౌషధం లా పనిచేస్తుంది. భగవన్నామాలలో ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. అద్భుత మహిమ ఉంది. అందునా కొన్ని నామాలు మరీ విశిష్టమైనవి. అట్టి విశిష్ట నామాల్లో మరీ విశిష్ట నామాలు అచ్యుత, అనంత, గోవింద అన్నవి. 

👉 పద్మ పురాణంలో ఈ నామ మహిమ 'అచ్యుతానంత గోవింద నామోచ్ఛారణ భేషజాత్ నశ్యంతి సకలారోగాః సత్యం సత్యం వదామ్యహ' అని మిక్కలి గొప్పగా వర్ణించబడింది. 

👉 అంటే 'ఈ నామాలను పలకటం అనే మందు చేత సర్వరోగాలు నశించి తీరుతాయి. ఇది సత్యం, నేను సత్యం చెబుతున్నాను' అని దీనర్ధం.

👉 ఇలా రెండు మార్లు సత్యం అని చెప్పటం ద్వారా శ్రీ ధన్వంతరి ప్రమాణం చేసి చెప్పారన్న మాట. క్షీరార్ణవ మథన సమయంలో అవతరించిన మహా మహిమాన్విత పురుషుడు శ్రీ ధన్వంతరి. ఆయుర్వేద వైద్య విద్యలో ఆయనదే ప్రధమ స్థానం

👉 పార్వతీదేవి అడుగగా శంకరుల వారు శ్రీమన్నారయణుని లీలల గురించి, కూర్మావతార సందర్భంలో క్షీరసాగర మథన గాథ వినిపిస్తూ ఇలా అన్నారు. పార్వతీ! పాల కడలిలో లక్ష్మీ దేవి అవతరించింది. దేవతలు, మునులు లక్ష్మీనారాయణుని స్తుతిస్తున్నారు. ఆ సందర్భంలోనే భయంకరమైన హాలాహలం పాలకడలి నుంచి ఉద్భవించింది.

👉 ఆ హాలాహలం చూసి దేవతలు, దానవులు భయపడి తలో దిక్కుకి పారిపోయారు. పారిపోతున్న దేవతలను, దానవులను ఆపి, భయపడవద్దని చెప్పి, ఆ కాలకూటాన్ని నేను మ్రింగుతానని ధైర్యం చెప్పాను. అందరూ నా పాదాలపై పడి నన్ను పూజించి స్తుతించ సాగారు.

👉 అపుడు నేను ఏకాగ్ర చిత్తంతో సర్వ దుఃఖ హరుడైన శ్రీమన్నారాయణుని ధ్యానం చేసుకుని ఆయన నామాల్లో ప్రధానమైన మూడు నామాల్ని అచ్యుత, అనంత, గోవింద అన్న మూడు మహా మంత్రాల్ని స్మరించుకుంటూ ఆ మహా భయంకరమైన కాలకూట విషాన్ని త్రాగివేశాను.

👉 సర్వ వ్యాపి అయిన విష్ణు భగవానుని యెుక్క ఆ నామ త్రయం యెుక్క మహిమ వల్ల సర్వ లోక సంహారకమైన ఆ విషాన్ని సునాయాసంగా త్రాగేశాను. ఆ విషం నన్నేమి చెయ్యలేక పోయింది అని సాక్షాత్తూ సదా శివుడు తెలిపాడు.

👉 కనుక మీరు కూడా 'శ్రీ అచ్యుతాయ నమః, శ్రీ అనంతాయ నమః, శ్రీ గోవిందాయ నమః' అన్న 'నామ త్రేయాస్త్ర మంత్రాన్ని' పలికేటప్పుడు ఈ మహిమనంతా జ్ఞాపకముంచుకుని, విశ్వాసం పెంచుకుని, మంత్ర మననం చేయడం ద్వారా అనారోగ్య బాధలు తొలగించుకుని, ఆయురారోగ్యాలను పొందవచ్చు.

 👉 ప్రతి రోజు ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటితో మీ దినచర్యను ప్రారంబించండి. నీటి గ్లాసును చేత పట్టుకుని ' నామ త్రేయాస్త్ర మంత్రాన్ని' కొద్దిసేపు పలికి, ఆ నీటిని మంత్ర బలంతో శక్తివంతం చేసి, తరువాత ఆ నీటిని స్వీకరించండి. ప్రతి రోజు ఇలా చేయడం వలన రోగాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

No comments:

Post a Comment

భగవంతుడు దగ్గర వున్నాడు అనుకొంటే దగ్గరే (16-May-24, Enlightment Story)

భగవంతుడు దగ్గర వున్నాడు అనుకొంటే దగ్గరే 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 🌺🍀🌺🍀 భగవంతుడు దూరంగా ఉన్నాడనుకొంటే దూరంగానే ఉంటాడని, దగ్గర వున్నాడు అనుకొం...