Saturday 14 January 2023

సంక్రాంతి నాడు గంగా నదిలో స్నానం చేయాలని

  సంక్రాంతి నాడు గంగా నదిలో స్నానం చేయాలని చెప్పడం వెనుక పురాణ గాథ ఇదే..


🔆 మకర సంక్రాంతి రోజున గంగానదిలో స్నానం చేయడం ద్వారా ఏడు జన్మల పాపాలు పోతాయని చెబుతారు.

గంగాస్నానానికి వెళ్లలేకపోతే ఇంట్లోనే స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చేయాలని చెబుతారు.


🔆 హిందూ గ్రంథాలలో పేర్కొన్న వివరాల ప్రకారం, కపిల మహర్షి నాటి కాలంలో గంగాసాగర్ దగ్గర ఆశ్రమం నిర్మించి తపస్సు చేసుకునేవాడు.

నాటి రోజుల్లో సాగర రాజు కీర్తి మూడు లోకాలలోనూ వ్యాపించింది.

రాజులందరూ సాగరుడు చేసే దానధర్మాలను, సత్కార్యాల మహిమను గానం చేసేవారు.

దీనిని చూసిన స్వర్గలోకపు రాజు ఇంద్రుడు చాలా ఆందోళన చెందాడు.


🔆 ఈ సమయంలో సాగర రాజు అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడు.ఇంద్రుడు అశ్వమేధ యాగ గుర్రాన్ని దొంగిలించి, కపిలముని ఆశ్రమం దగ్గర కట్టేశాడు.

అశ్వమేధ యాగానికి తెచ్చిన గుర్రాన్ని వెతకడానికి సాగర రాజు తన 60 వేల మంది కుమారులను పంపాడు.

ఆ కుమారులందరూ గుర్రాన్ని వెతుక్కుంటూ కపిల ముని ఆశ్రమానికి చేరుకున్నారు.

అక్కడ అశ్వమేధ యాగం కోసం తెచ్చిన గుర్రాన్ని చూశాడు.దీంతో వారు కపిలముని ఈ గుర్రాన్ని దొంగిలించారని ఆరోపించారు.

కోపోద్రిక్తుడైన కపిల ముని సాగర రాజు 60 వేల మంది కుమారులందరినీ కాలి బూడిద కమ్మంటూ శపించాడు.

వెంటనే సాగరరాజు కపిల ముని ఆశ్రమానికి చేరుకుని, తన కుమారులను క్షమించాలని అభ్యర్థించాడు.


🔆 అప్పుడు కపిల ముని అతనితో నీ కుమారులందరి మోక్షానికి ఒకే ఒక మార్గం ఉంది.

మీరు మోక్షదాయిని అయిన గంగను భూమిపైకి తీసుకురండి అని చెప్పాడు.

సాగర రాజు మనవడు రాజు అన్షుమాన్, గంగామాతని భూమిపైకి తీసుకువచ్చే వరకు తమ రాజవంశానికి చెందిన ఏ రాజు శాంతియుతంగా కూర్చోకూడదని కపిల ముని సూచనపై ప్రతిజ్ఞ చేసుకున్నాడు.

అతను తపస్సు చేయడం ప్రారంభించారు.

రాజు అన్షుమాన్ మరణం తరువాత, భగీరథుడు గంగామాతను తన తపస్సుతో సంతోషపెట్టాడు.


🔆 భగీరథుడు తన తపస్సుతో శివుడిని కూడా ప్రసన్నం చేసుకున్నాడు, తద్వారా శివుడు గంగామాత తన జఠాఝూటం ద్వారా భూమిపైకి దిగేలా చేశాడు.

గంగామాతను కేశాల్లో పెట్టుకుని శివుడు గంగాధరుడయ్యాడు.

గంగామాత భూమిపైకి దిగింది.


🔆 ముందు భగీరథ రాజు వెళుతుండగా వెనుక భూమిపై గంగామాత ప్రవహించడం ప్రారంభించింది.

భగీరథుడు గంగను కపిల ముని ఆశ్రమానికి తీసుకువచ్చాడు, అక్కడ గంగామాత సాగర రాజు 60 వేల మంది కుమారులకు మోక్షాన్ని ఇచ్చింది.సాగర రాజుకు గల 60 వేల మంది పుత్రులకు గంగామాత మోక్షాన్ని ఇచ్చిన రోజే మకర సంక్రాంతి అని చెబుతారు అక్కడి నుండి గంగ ముందుకు సాగి సముద్రాన్ని చేరింది.


🔆 అలా కలిసే ప్రదేశాన్ని గంగా సాగర్ అని అంటారు.మకర సంక్రాంతి రోజున గంగాసాగర్ లేదా గంగా నదిలో స్నానం చేయడం మోక్షానికి దారి తీస్తుంది.పాపాలను కడిగివేస్తుందని చెబుతారు.

No comments:

Post a Comment

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...